News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 29 Jun 2022 20:06 IST
1/21
ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో ఉక్రెయిన్‌లో పర్యటించారు. అనంతరం ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీలో యుద్ధ పరిస్థితుల గురించి చర్చించారు. జీ7 దేశాల సదస్సుకు జర్మనీ వచ్చిన జోకో విడోడో తిరుగు పయనంలో ఉక్రెయిన్‌ వచ్చారు. అనంతరం రష్యాలో పర్యటించి పుతిన్‌తో శాంతి చర్చలు జరపనున్నారు. జోకో విడోడో ప్రస్తుతం జీ20 కూటమికి ఛైర్మన్‌గా ఉన్నారు. ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో ఉక్రెయిన్‌లో పర్యటించారు. అనంతరం ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీలో యుద్ధ పరిస్థితుల గురించి చర్చించారు. జీ7 దేశాల సదస్సుకు జర్మనీ వచ్చిన జోకో విడోడో తిరుగు పయనంలో ఉక్రెయిన్‌ వచ్చారు. అనంతరం రష్యాలో పర్యటించి పుతిన్‌తో శాంతి చర్చలు జరపనున్నారు. జోకో విడోడో ప్రస్తుతం జీ20 కూటమికి ఛైర్మన్‌గా ఉన్నారు.
2/21
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని జులై 5న ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో అమ్మవారికి సమర్పించనున్న నూతన చీర తయారీ పనులను ఆలయ ఆవరణలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రారంభించారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని జులై 5న ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో అమ్మవారికి సమర్పించనున్న నూతన చీర తయారీ పనులను ఆలయ ఆవరణలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రారంభించారు.
3/21
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో జులై 2, 3 తేదీల్లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నోవాటెల్‌ మార్గంలో ఇరువైపులా పెద్దఎత్తున భాజపా జెండాలు, స్వాగత తోరణాలు, ప్రధాని నరేంద్ర మోదీ కటౌట్లను ఏర్పాటు చేశారు. దీంతో ఈ మార్గమంతా కాషాయ వర్ణం సంతరించుకుంది. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో జులై 2, 3 తేదీల్లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నోవాటెల్‌ మార్గంలో ఇరువైపులా పెద్దఎత్తున భాజపా జెండాలు, స్వాగత తోరణాలు, ప్రధాని నరేంద్ర మోదీ కటౌట్లను ఏర్పాటు చేశారు. దీంతో ఈ మార్గమంతా కాషాయ వర్ణం సంతరించుకుంది.
4/21
5/21
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి బుధవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికి దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి బుధవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికి దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.
6/21
7/21
ఛండీఘర్‌లో నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన తెలంగాణ, ఏపీ ఆర్థిక శాఖ మంత్రులు హరీశ్‌రావు, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ వారిని సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఛండీఘర్‌లో నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన తెలంగాణ, ఏపీ ఆర్థిక శాఖ మంత్రులు హరీశ్‌రావు, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ వారిని సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.
8/21
రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్‌ గ్రామ సర్పంచి లక్ష్మీనర్సింహారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తగా వివాహం చేసుకున్న నూతన దంపతులతో ఆయన మొక్కలు నాటిస్తున్నారు. మ్యారేజ్‌ సర్టిఫికెట్ల కోసం గ్రామపంచాయతీకి వచ్చిన వారికి చెట్ల ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. అనంతరం పల్లె ప్రకృతి వనంలో గాని, గ్రామ వీధుల్లో గాని రెండు మొక్కలు నాటించి మ్యారేజ్‌ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఇటీవల వివాహం చేసుకున్న నర్సింహ, మానస మంగళవారం మొక్కలు నాటారు. రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్‌ గ్రామ సర్పంచి లక్ష్మీనర్సింహారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తగా వివాహం చేసుకున్న నూతన దంపతులతో ఆయన మొక్కలు నాటిస్తున్నారు. మ్యారేజ్‌ సర్టిఫికెట్ల కోసం గ్రామపంచాయతీకి వచ్చిన వారికి చెట్ల ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. అనంతరం పల్లె ప్రకృతి వనంలో గాని, గ్రామ వీధుల్లో గాని రెండు మొక్కలు నాటించి మ్యారేజ్‌ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఇటీవల వివాహం చేసుకున్న నర్సింహ, మానస మంగళవారం మొక్కలు నాటారు.
9/21
స్పెయిన్‌లోని మ్యాడ్రిడ్‌లో జరగుతున్న నాటో సదస్సులో సభ్య దేశాల అధినేతలంతా కలిసి గ్రూప్‌ ఫొటో తీసుకున్నారు. మంగళవారం ప్రారంభమైన ఈ నాటో సదస్సు గురువారం ముగియనుంది. ఈ సందర్భంగా నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఏర్పడిన తరహాలో తీవ్ర భద్రతా సంక్షోభం ఎదుర్కొంటున్నట్లు అభివర్ణించారు. స్పెయిన్‌లోని మ్యాడ్రిడ్‌లో జరగుతున్న నాటో సదస్సులో సభ్య దేశాల అధినేతలంతా కలిసి గ్రూప్‌ ఫొటో తీసుకున్నారు. మంగళవారం ప్రారంభమైన ఈ నాటో సదస్సు గురువారం ముగియనుంది. ఈ సందర్భంగా నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఏర్పడిన తరహాలో తీవ్ర భద్రతా సంక్షోభం ఎదుర్కొంటున్నట్లు అభివర్ణించారు.
10/21
విశాఖ జిల్లాలోని ఆనందపురంలో 100 సీట్ల సామర్థ్యంతో ఇగ్లూ థియేటర్‌ నిర్మిస్తున్నారు. ఇందులో మల్టిప్లెక్స్‌లకు దీటుగా ఏసీ, సరౌండ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఆగస్టులో ఈ థియేటర్‌ను ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విశాఖ జిల్లాలోని ఆనందపురంలో 100 సీట్ల సామర్థ్యంతో ఇగ్లూ థియేటర్‌ నిర్మిస్తున్నారు. ఇందులో మల్టిప్లెక్స్‌లకు దీటుగా ఏసీ, సరౌండ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఆగస్టులో ఈ థియేటర్‌ను ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
11/21
12/21
భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య జులై 1నుంచి ప్రారంభం కానున్న ఐదో టెస్టు మ్యాచ్‌ కోసం భారత క్రీడాకారులు ఇంగ్లాండ్‌లో సాధన చేస్తున్నారు. టీమిండియా గతేడాది ఇంగ్లాండ్‌కు 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ ఆడేందుకు వెళ్లగా 4 మ్యాచ్‌లు పూర్తయ్యాక 2-1 ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్టుకు ముందు కరోనా కేసులు నమోదు కావడంతో వాయిదా పడింది. భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య జులై 1నుంచి ప్రారంభం కానున్న ఐదో టెస్టు మ్యాచ్‌ కోసం భారత క్రీడాకారులు ఇంగ్లాండ్‌లో సాధన చేస్తున్నారు. టీమిండియా గతేడాది ఇంగ్లాండ్‌కు 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ ఆడేందుకు వెళ్లగా 4 మ్యాచ్‌లు పూర్తయ్యాక 2-1 ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్టుకు ముందు కరోనా కేసులు నమోదు కావడంతో వాయిదా పడింది.
13/21
14/21
అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ వద్ద వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆందోళన చేశారు. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ వద్ద వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆందోళన చేశారు.
15/21
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆర్నిఖ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్‌కు సంబంధించిన కౌంట్‌డౌన్‌ ఈవెంట్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ నూతన మోడళ్ల ఆభరణాలు ధరించి ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆర్నిఖ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్‌కు సంబంధించిన కౌంట్‌డౌన్‌ ఈవెంట్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ నూతన మోడళ్ల ఆభరణాలు ధరించి ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
16/21
17/21
ఉక్రెయిన్‌లోని క్రెమెన్‌చుక్‌ నగరంలో ఓ షాపింగ్‌మాల్‌పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో 18మంది మరణించారని, మరో 36మంది 

ఆచూకీ తెలియడం లేదని అక్కడి అధికారులు పేర్కొన్నారు. స్థానికులు ఇవాళ ఇలా పుష్పగుచ్ఛాలు ఉంచి సంతాపం తెలిపారు. ఉక్రెయిన్‌లోని క్రెమెన్‌చుక్‌ నగరంలో ఓ షాపింగ్‌మాల్‌పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో 18మంది మరణించారని, మరో 36మంది ఆచూకీ తెలియడం లేదని అక్కడి అధికారులు పేర్కొన్నారు. స్థానికులు ఇవాళ ఇలా పుష్పగుచ్ఛాలు ఉంచి సంతాపం తెలిపారు.
18/21
హైదరాబాద్‌ యూసఫ్‌గూడలోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌ కార్యాలయంలో అవిభక్త కవలలు వీణా-వాణిలను 

మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ అభినందించారు. మంగళవారం విడుదలైన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో వీణా-వాణి ప్రథమ 

శ్రేణిలో ఉత్తీర్ణులైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ యూసఫ్‌గూడలోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌ కార్యాలయంలో అవిభక్త కవలలు వీణా-వాణిలను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ అభినందించారు. మంగళవారం విడుదలైన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో వీణా-వాణి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విషయం తెలిసిందే.
19/21
సినీనటి రాశీఖన్నా ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. అనంతరం వకుళామాత అన్నదాన సత్రానికి వెళ్లి అన్నదాన సేవలో 

పాల్గొన్నారు. రాశీ నటించిన తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్‌’ జులై 1న థియేటర్లలో విడుదల కానుంది. సినీనటి రాశీఖన్నా ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. అనంతరం వకుళామాత అన్నదాన సత్రానికి వెళ్లి అన్నదాన సేవలో పాల్గొన్నారు. రాశీ నటించిన తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్‌’ జులై 1న థియేటర్లలో విడుదల కానుంది.
20/21
 ప్రముఖ నటుడు మహేశ్‌బాబు, ఆయన సతీమణి నమ్రత మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను కలిశారు. ప్రపంచంలోని గొప్ప 

విజనరీ వ్యక్తుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌ను కలవడం చాలా ఆనందంగా ఉందంటూ మహేశ్‌ ఈ చిత్రాన్ని తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. 
ప్రముఖ నటుడు మహేశ్‌బాబు, ఆయన సతీమణి నమ్రత మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను కలిశారు. ప్రపంచంలోని గొప్ప విజనరీ వ్యక్తుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌ను కలవడం చాలా ఆనందంగా ఉందంటూ మహేశ్‌ ఈ చిత్రాన్ని తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు.
21/21
నాంపల్లి మెట్రోస్టేషన్‌ వద్ద కనువిందు చేస్తున్న పావురాల గుంపు నాంపల్లి మెట్రోస్టేషన్‌ వద్ద కనువిందు చేస్తున్న పావురాల గుంపు

మరిన్ని