News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2 (06-08-2022)

Updated : 06 Aug 2022 19:54 IST
1/22
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌, హర్‌ ఘర్‌ తిరంగాలో భాగంగా కాకినాడ నగరంలోని విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాడెట్లు, ప్రజలు 300 మీటర్ల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌, హర్‌ ఘర్‌ తిరంగాలో భాగంగా కాకినాడ నగరంలోని విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాడెట్లు, ప్రజలు 300 మీటర్ల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు.
2/22
3/22
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌, హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ ఆకట్టుకుంటోంది. ఈ ఎగ్జిబిషన్‌ను తిలకించేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌, హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ ఆకట్టుకుంటోంది. ఈ ఎగ్జిబిషన్‌ను తిలకించేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు.
4/22
5/22
ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో జయశంకర్‌ చేసిన త్యాగాలను కేసీఆర్ గుర్తు చేశారు. ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో జయశంకర్‌ చేసిన త్యాగాలను కేసీఆర్ గుర్తు చేశారు.
6/22
శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో జరిగిన వివాహ వేడుకకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వధూవరులు మాధురి, వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్‌లను ఆయన ఆశీర్వదించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో జరిగిన వివాహ వేడుకకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వధూవరులు మాధురి, వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్‌లను ఆయన ఆశీర్వదించారు.
7/22
ఇటీవల కోనసీమ ప్రాంతంలో వరద బాధితులను ఆదుకోవాలని కోరుతూ సీఎంకు వినతి పత్రం ఇవ్వాలని ప్రయత్నించి.. బలంగా గళం వినిపించిన జనసేన వీర మహిళలను పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అభినందించారు. ఇటీవల కోనసీమ ప్రాంతంలో వరద బాధితులను ఆదుకోవాలని కోరుతూ సీఎంకు వినతి పత్రం ఇవ్వాలని ప్రయత్నించి.. బలంగా గళం వినిపించిన జనసేన వీర మహిళలను పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అభినందించారు.
8/22
9/22
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ద్వారకలోని ద్వారకాదీశుడి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సిబ్బంది ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ద్వారకలోని ద్వారకాదీశుడి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సిబ్బంది ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు.
10/22
11/22
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబు దాడి ఈ తేదీనే(1945 ఆగస్టు6, 9 తేదీలు) జరిగింది. ఈ సందర్భంగా యుద్ధాలు వద్దు.. శాంతి పాటించడమే మంచిదంటూ ముంబయిలోని విద్యార్థులు ముఖాలపై సందేశాన్నిచ్చే పెయింటింగ్స్‌తో శాంతి ర్యాలీ నిర్వహించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబు దాడి ఈ తేదీనే(1945 ఆగస్టు6, 9 తేదీలు) జరిగింది. ఈ సందర్భంగా యుద్ధాలు వద్దు.. శాంతి పాటించడమే మంచిదంటూ ముంబయిలోని విద్యార్థులు ముఖాలపై సందేశాన్నిచ్చే పెయింటింగ్స్‌తో శాంతి ర్యాలీ నిర్వహించారు.
12/22
13/22
14/22
ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా దిల్లీలో ఆయన చిత్రపటానికి తెరాస ఎంపీలు, నాయకులు నివాళి అర్పించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీలు సంతోశ్‌కుమార్‌, బీబీ పాటిల్‌, రంజిత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా దిల్లీలో ఆయన చిత్రపటానికి తెరాస ఎంపీలు, నాయకులు నివాళి అర్పించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీలు సంతోశ్‌కుమార్‌, బీబీ పాటిల్‌, రంజిత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
15/22
16/22
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో 14గేట్ల ద్వారా 77వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న ఛత్తీస్‌గఢ్‌ నుంచి గంట గంటకు ఇన్‌ఫ్లో పెరుగుతోందని అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో 14గేట్ల ద్వారా 77వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న ఛత్తీస్‌గఢ్‌ నుంచి గంట గంటకు ఇన్‌ఫ్లో పెరుగుతోందని అధికారులు తెలిపారు.
17/22
వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల హైదాబాద్‌లోని డ‌బీర్‌పురా బీబీకా ఆలంను దర్శించుకొని ప్రార్థనలు చేశారు.. వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల హైదాబాద్‌లోని డ‌బీర్‌పురా బీబీకా ఆలంను దర్శించుకొని ప్రార్థనలు చేశారు..
18/22
19/22
ముంబయిలో తితిదే నిర్మించనున్న శ్రీవారి ఆలయ భూమిపూజకు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌లను ఆహ్వానించారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి వారిని కలిసి కార్యక్రమానికి రావాలని కోరారు. ఆగస్టు 21న భూమిపూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముంబయిలో తితిదే నిర్మించనున్న శ్రీవారి ఆలయ భూమిపూజకు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌లను ఆహ్వానించారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి వారిని కలిసి కార్యక్రమానికి రావాలని కోరారు. ఆగస్టు 21న భూమిపూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
20/22
21/22
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు దిల్లీ వెళ్లారు. అక్కడి విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబుకు తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని, రామ్మోహన్‌ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్‌, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు స్వాగతం పలికారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు దిల్లీ వెళ్లారు. అక్కడి విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబుకు తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని, రామ్మోహన్‌ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్‌, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు స్వాగతం పలికారు.
22/22
పార్లమెంటులో నిర్వహించిన ఉపరాష్ట్రపతి ఎన్నికలో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంటులో నిర్వహించిన ఉపరాష్ట్రపతి ఎన్నికలో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మరిన్ని