News In Pics: చిత్రం చెప్పే సంగతులు- (06-10-22)

Updated : 06 Oct 2022 20:29 IST
1/17
దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా లాలాగూడ ప్రధాన రహదారిలోని గోడలను ఇలా సుందరీకరించారు. అటుగా వెళ్లే వాహనదారులు, పాదచారులను ఈ చిత్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా లాలాగూడ ప్రధాన రహదారిలోని గోడలను ఇలా సుందరీకరించారు. అటుగా వెళ్లే వాహనదారులు, పాదచారులను ఈ చిత్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
2/17
లఖ్‌నవూ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు శిఖర్ ధావన్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన అతని అభిమాని ఒకరు ఇలా తన శరీరం నిండా శిఖర్‌ పచ్చబొట్లతో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. లఖ్‌నవూ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు శిఖర్ ధావన్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన అతని అభిమాని ఒకరు ఇలా తన శరీరం నిండా శిఖర్‌ పచ్చబొట్లతో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు.
3/17
ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని సాధించాలనే సంకల్పంతో రాజధాని రైతులు అరసవల్లి వరకు చేస్తున్న పాదయాత్ర ఏలూరు జిల్లాలో సాగుతోంది. ఇవాళ ఉదయం గణపవరం మండలం సరిపల్లె నుంచి యాత్ర మొదలైంది. దారి పొడవునా వర్షం పడుతున్నా లెక్కచేయకుండా రైతులు ముందుకు సాగారు. అనేక చోట్ల వర్షపునీరు ప్రవహించి దారులు బురదమయంగా మారినా.. అలాగే యాత్ర కొనసాగించారు.  
ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని సాధించాలనే సంకల్పంతో రాజధాని రైతులు అరసవల్లి వరకు చేస్తున్న పాదయాత్ర ఏలూరు జిల్లాలో సాగుతోంది. ఇవాళ ఉదయం గణపవరం మండలం సరిపల్లె నుంచి యాత్ర మొదలైంది. దారి పొడవునా వర్షం పడుతున్నా లెక్కచేయకుండా రైతులు ముందుకు సాగారు. అనేక చోట్ల వర్షపునీరు ప్రవహించి దారులు బురదమయంగా మారినా.. అలాగే యాత్ర కొనసాగించారు.
4/17
5/17
హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి కురుస్తోన్న వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి కురుస్తోన్న వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
6/17
7/17
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అక్టోబర్‌ 4 వరకు సాధారణంగా ఉన్న రద్దీ.. అక్టోబర్‌ 5 నుంచి క్రమంగా పెరిగింది. పెరటాసి మాసం, రెండో శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో రద్దీ పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వైకుంఠం క్యూ కాంపెక్స్‌-2, నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్‌లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతోంది.  తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అక్టోబర్‌ 4 వరకు సాధారణంగా ఉన్న రద్దీ.. అక్టోబర్‌ 5 నుంచి క్రమంగా పెరిగింది. పెరటాసి మాసం, రెండో శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో రద్దీ పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వైకుంఠం క్యూ కాంపెక్స్‌-2, నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్‌లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతోంది.
8/17
9/17
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు రోహిత్‌ శర్మ నేతృత్వంలోని భారత బృందం గురువారం తెల్లవారుజామున ఆస్ట్రేలియాకు బయల్దేరి వెళ్లింది. ప్రపంచ కప్‌ టోర్నీకి బయల్దేరే మందు భారత బృందం సభ్యులు, సహ క్రికెటర్లతో కలిసి దిగిన ఫొటోలను తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు రోహిత్‌ శర్మ నేతృత్వంలోని భారత బృందం గురువారం తెల్లవారుజామున ఆస్ట్రేలియాకు బయల్దేరి వెళ్లింది. ప్రపంచ కప్‌ టోర్నీకి బయల్దేరే మందు భారత బృందం సభ్యులు, సహ క్రికెటర్లతో కలిసి దిగిన ఫొటోలను తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు.
10/17
మిలే కదం.. జుడే వతన్‌ (అడుగులో అడుగు వేద్దాం.. దేశాన్ని ఏకం చేద్దాం)’ అనే నినాదంతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు విశేష స్పందన లభిస్తోంది. కర్ణాటకలోని పాండవపుర తాలుకాలో సాగుతున్న యాత్రలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ పాల్గొన్నారు. తనయుడు రాహుల్‌తో కలిసి ఉత్సాహంగా అడుగులు వేశారు. మధ్యలో ఓ చోట ఆమె షూ లేసులు ఊడిపోగా.. రాహులే కట్టారు. మిలే కదం.. జుడే వతన్‌ (అడుగులో అడుగు వేద్దాం.. దేశాన్ని ఏకం చేద్దాం)’ అనే నినాదంతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు విశేష స్పందన లభిస్తోంది. కర్ణాటకలోని పాండవపుర తాలుకాలో సాగుతున్న యాత్రలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ పాల్గొన్నారు. తనయుడు రాహుల్‌తో కలిసి ఉత్సాహంగా అడుగులు వేశారు. మధ్యలో ఓ చోట ఆమె షూ లేసులు ఊడిపోగా.. రాహులే కట్టారు.
11/17
12/17
దసరా పండగ నేపథ్యంలో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి, మాజీ గవర్నర్‌ విద్యా సాగర్‌రావు, మాజీ ఎంపీలు వీహెచ్‌, వివేక్‌ తదితరులు పాల్గొన్నారు. దసరా పండగ నేపథ్యంలో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి, మాజీ గవర్నర్‌ విద్యా సాగర్‌రావు, మాజీ ఎంపీలు వీహెచ్‌, వివేక్‌ తదితరులు పాల్గొన్నారు.
13/17
14/17
మెగాస్టార్‌ కథానాయకుడిగా.. మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. దసరా పండగ రోజున విడుదలైంది. భారీ బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా వసూళ్లను చిత్రబృందం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.38 కోట్ల గ్రాస్‌ వచ్చినట్లు పేర్కొంటూ ఈ పోస్టర్‌ను విడుదల చేసింది. మెగాస్టార్‌ కథానాయకుడిగా.. మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. దసరా పండగ రోజున విడుదలైంది. భారీ బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా వసూళ్లను చిత్రబృందం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.38 కోట్ల గ్రాస్‌ వచ్చినట్లు పేర్కొంటూ ఈ పోస్టర్‌ను విడుదల చేసింది.
15/17
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధ‌వారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. చక్రస్నానం నాటి సాయంకాలం ధ్వజావరోహణం నిర్వహిస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవ యజ్ఞం మంగళాంతం అవుతుంది.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధ‌వారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. చక్రస్నానం నాటి సాయంకాలం ధ్వజావరోహణం నిర్వహిస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవ యజ్ఞం మంగళాంతం అవుతుంది.
16/17
కర్నూలు జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్టులో ఏటా నిర్వహించే కర్రల సమరంలో 74 మంది గాయాలపాలయ్యారు. ఏటా దసరా రోజున శ్రీమాళ మల్లేశ్వర స్వామికి బన్ని ఉత్సవం నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఆనవాయితీ ప్రకారం కర్రల సమరం జరుగుతుంది. కర్నూలు జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్టులో ఏటా నిర్వహించే కర్రల సమరంలో 74 మంది గాయాలపాలయ్యారు. ఏటా దసరా రోజున శ్రీమాళ మల్లేశ్వర స్వామికి బన్ని ఉత్సవం నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఆనవాయితీ ప్రకారం కర్రల సమరం జరుగుతుంది.
17/17

మరిన్ని