News In Pics : చిత్రం చెప్పే సంగతులు - 1 (18-11-2022)

Updated : 18 Nov 2022 08:37 IST
1/19
విజయవాడలోని పాల ప్రాజెక్టు వద్ద నిర్మించిన చనమోలు వెంకట్రావు పై వంతెనపై మొక్కలు మొలిచాయి. ప్రస్తుతం వేర్లు బయటకు చొచ్చుకుని పెద్దవవుతున్నాయి. ఇలాగే వదిలేస్తే వంతెన గోడలు బీటలు వారే ప్రమాదం ఉంది. విజయవాడలోని పాల ప్రాజెక్టు వద్ద నిర్మించిన చనమోలు వెంకట్రావు పై వంతెనపై మొక్కలు మొలిచాయి. ప్రస్తుతం వేర్లు బయటకు చొచ్చుకుని పెద్దవవుతున్నాయి. ఇలాగే వదిలేస్తే వంతెన గోడలు బీటలు వారే ప్రమాదం ఉంది.
2/19
విజయవాడ వారధి నుంచి బెంజిసర్కిల్‌ వచ్చే దారిలో స్క్యూబ్రిడ్జి వద్ద వంతెన అంచులు సరిగా లేకపోవడంతో ప్రమాదకరంగా మారింది. గతంలో కారు పై నుంచి పడి పెనుప్రమాదం వాటిల్లింది. అయినా అధికారులు పట్టించుకోలేదు. రెండు రోజుల కిందట ఓ లారీ అక్కడ ఉన్న ఖాళీల్లో నుంచి దూసుకువెళ్లింది. ఇప్పటికైనా అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. విజయవాడ వారధి నుంచి బెంజిసర్కిల్‌ వచ్చే దారిలో స్క్యూబ్రిడ్జి వద్ద వంతెన అంచులు సరిగా లేకపోవడంతో ప్రమాదకరంగా మారింది. గతంలో కారు పై నుంచి పడి పెనుప్రమాదం వాటిల్లింది. అయినా అధికారులు పట్టించుకోలేదు. రెండు రోజుల కిందట ఓ లారీ అక్కడ ఉన్న ఖాళీల్లో నుంచి దూసుకువెళ్లింది. ఇప్పటికైనా అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
3/19
కూకట్‌పల్లి మెట్రో వద్ద  కొత్తగా రోడ్డు వేసి వారమైంది. అయినా అక్కడి నుంచి మట్టిని తొలగించలేదు. 3 చౌరస్తాలను మూసివేయడంతో నిత్యం వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆ మట్టికుప్పల వద్దే తమ వాహనాలను నిలిపి నడిచి వెళ్తున్నారు. చుట్టూ కట్టిన కట్టెలను పాదచారులు ఇలా దాటుకుంటూ వెళ్తున్నారు. కూకట్‌పల్లి మెట్రో వద్ద కొత్తగా రోడ్డు వేసి వారమైంది. అయినా అక్కడి నుంచి మట్టిని తొలగించలేదు. 3 చౌరస్తాలను మూసివేయడంతో నిత్యం వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆ మట్టికుప్పల వద్దే తమ వాహనాలను నిలిపి నడిచి వెళ్తున్నారు. చుట్టూ కట్టిన కట్టెలను పాదచారులు ఇలా దాటుకుంటూ వెళ్తున్నారు.
4/19
అమెరికాలోని అట్లాంటాలో మేసీ లెనాక్స్‌ స్క్వేర్‌ వద్ద ఏర్పాటు చేసిన క్రిస్మస్‌ ట్రీ. 45 వేల ఎల్‌ఈడీ లైట్లతో దీన్ని రూపొందించారు. అమెరికాలోని అట్లాంటాలో మేసీ లెనాక్స్‌ స్క్వేర్‌ వద్ద ఏర్పాటు చేసిన క్రిస్మస్‌ ట్రీ. 45 వేల ఎల్‌ఈడీ లైట్లతో దీన్ని రూపొందించారు.
5/19
ఫార్ములా - ఈ రేస్‌కు సమయం దగ్గరపడుతుండటంతో నగరంలోని పరిసరాలని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఖైరతాబాద్‌ మెట్రో విభాగిని మధ్యలో ఉన్న మొక్కలు ఎండిపోవటంతో ఇలా కొత్తవి నాటిస్తున్నారు. ఫార్ములా - ఈ రేస్‌కు సమయం దగ్గరపడుతుండటంతో నగరంలోని పరిసరాలని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఖైరతాబాద్‌ మెట్రో విభాగిని మధ్యలో ఉన్న మొక్కలు ఎండిపోవటంతో ఇలా కొత్తవి నాటిస్తున్నారు.
6/19
ప్రస్తుతమున్న పోటీలో ప్రభుత్వోద్యోగం సాధించడం కష్టంతో కూడుకున్న పనే. ఇప్పటికే రాత పరీక్ష ఉత్తీర్ణులై మలి విడత నిర్వహించే శారీరక సామర్థ్య తదితర పరీక్షలకు కఠోర సాధన చేస్తున్నారు కానిస్టేబుల్‌ అభ్యర్థులు. భాగ్యనగరంలోని విక్టోరియా మెమోరియల్‌ మెట్రో స్టేషన్‌ మెట్లను గెంతుతూ ఎక్కుతుండగా తీసిన చిత్రమిది. ప్రస్తుతమున్న పోటీలో ప్రభుత్వోద్యోగం సాధించడం కష్టంతో కూడుకున్న పనే. ఇప్పటికే రాత పరీక్ష ఉత్తీర్ణులై మలి విడత నిర్వహించే శారీరక సామర్థ్య తదితర పరీక్షలకు కఠోర సాధన చేస్తున్నారు కానిస్టేబుల్‌ అభ్యర్థులు. భాగ్యనగరంలోని విక్టోరియా మెమోరియల్‌ మెట్రో స్టేషన్‌ మెట్లను గెంతుతూ ఎక్కుతుండగా తీసిన చిత్రమిది.
7/19
 గతంలో నిండైన శోభతో వెలుగొందిన లలిత కళాతోరణం ప్రస్తుతం కళావిహీనంగా మారింది. ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ పాడైంది. కళావేదికపై రాళ్లు పగిలి, శిలాఫలకాల రంగులు పోయాయి. కార్యక్రమాల నిర్వహణ మృగ్యమైంది. ప్రభుత్వం పట్టించుకొని పూర్వవైభవం తేవాలని కళాభిమానులు కోరుతున్నారు. గతంలో నిండైన శోభతో వెలుగొందిన లలిత కళాతోరణం ప్రస్తుతం కళావిహీనంగా మారింది. ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ పాడైంది. కళావేదికపై రాళ్లు పగిలి, శిలాఫలకాల రంగులు పోయాయి. కార్యక్రమాల నిర్వహణ మృగ్యమైంది. ప్రభుత్వం పట్టించుకొని పూర్వవైభవం తేవాలని కళాభిమానులు కోరుతున్నారు.
8/19
 హుస్సేన్‌సాగర్‌ చెంత ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ ట్రయల్‌ రన్‌కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 19, 20వ తేదీల్లో జరిగే రేస్‌లో పాల్గొనే కార్లు గురువారం హుస్సేన్‌సాగర్‌ తీరానికి చేరాయి. 30 పైనే కార్లను తీసుకొచ్చారు. హుస్సేన్‌సాగర్‌ చెంత ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ ట్రయల్‌ రన్‌కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 19, 20వ తేదీల్లో జరిగే రేస్‌లో పాల్గొనే కార్లు గురువారం హుస్సేన్‌సాగర్‌ తీరానికి చేరాయి. 30 పైనే కార్లను తీసుకొచ్చారు.
9/19
హైదరాబాద్‌లోని ఎస్బీహెచ్‌-బీ కాలనీ కోదండ రామాలయంలో కోటి దీపోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. అత్యంత వైభవంగా శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చారు. హైదరాబాద్‌లోని ఎస్బీహెచ్‌-బీ కాలనీ కోదండ రామాలయంలో కోటి దీపోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. అత్యంత వైభవంగా శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
10/19
 హైదరాబాద్‌ నగరం చుట్టూ 158 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్‌) వెంబడి పచ్చదనం అభివృద్ధికి హెచ్‌ఎండీఏ 71.51 లక్షల మొక్కలు నాటింది. వాటికి బిందు సేద్యంతో నీటి సౌకర్యం కల్పిస్తూ.. స్కాడా సాఫ్ట్‌వేర్‌ ఆటోమేషన్‌తో నిర్వహిస్తున్నారు. దీంతో ఓఆర్‌ఆర్‌పై 19 ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద పచ్చదనం కనువిందు చేస్తోంది. హైదరాబాద్‌ నగరం చుట్టూ 158 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్‌) వెంబడి పచ్చదనం అభివృద్ధికి హెచ్‌ఎండీఏ 71.51 లక్షల మొక్కలు నాటింది. వాటికి బిందు సేద్యంతో నీటి సౌకర్యం కల్పిస్తూ.. స్కాడా సాఫ్ట్‌వేర్‌ ఆటోమేషన్‌తో నిర్వహిస్తున్నారు. దీంతో ఓఆర్‌ఆర్‌పై 19 ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద పచ్చదనం కనువిందు చేస్తోంది.
11/19
12/19
 తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరిట నిర్మిస్తున్న సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ సందర్శించారు. కొద్ది నెలల్లోనే అందుబాటులోకి రానుంది. తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరిట నిర్మిస్తున్న సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ సందర్శించారు. కొద్ది నెలల్లోనే అందుబాటులోకి రానుంది.
13/19
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాత్రి వేల విద్యుత్తు కాంతుల్లో వెలుగుతున్న సరికొత్త ఫొటోను తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు గురువారం ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాత్రి వేల విద్యుత్తు కాంతుల్లో వెలుగుతున్న సరికొత్త ఫొటోను తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు గురువారం ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.
14/19
 మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం గోప్లాపూర్‌ శివారులో సుమారు 25 ఎకరాల్లో విస్తరించిన ఊరగుట్ట (మల్లన్న గుట్ట) పచ్చని చెట్లతో కళకళలాడుతోంది. 1995లో వాటర్‌షెడ్‌ పథకంలో భాగంగా ఊరగుట్టపై వేల సంఖ్యలో మొక్కలు నాటారు. మొక్కలను సంరక్షించడానికి అయిదేళ్లపాటు గుట్టపైకి మేకలు, పశువుల రాకను నిషేధించారు. దీంతో గుట్ట పచ్చందాలను సంతరించుకొంది. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం గోప్లాపూర్‌ శివారులో సుమారు 25 ఎకరాల్లో విస్తరించిన ఊరగుట్ట (మల్లన్న గుట్ట) పచ్చని చెట్లతో కళకళలాడుతోంది. 1995లో వాటర్‌షెడ్‌ పథకంలో భాగంగా ఊరగుట్టపై వేల సంఖ్యలో మొక్కలు నాటారు. మొక్కలను సంరక్షించడానికి అయిదేళ్లపాటు గుట్టపైకి మేకలు, పశువుల రాకను నిషేధించారు. దీంతో గుట్ట పచ్చందాలను సంతరించుకొంది.
15/19
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానాలు కొన్ని రోజులుగా యువతీ, యువకులతో కిక్కిరిసిపోతున్నాయి. చలిని కూడా లెక్క చేయకుండా ఉదయం, సాయంత్రం కసరత్తు చేసేస్తున్నారు. ఎస్సై, కానిస్టేబుల్‌ రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు శారీరక సామర్థ్య పరీక్షల్లోనూ తమ సత్తాచాటి ఉద్యోగం సాధించాలన్న తపనతో చెమటోడుస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానాలు కొన్ని రోజులుగా యువతీ, యువకులతో కిక్కిరిసిపోతున్నాయి. చలిని కూడా లెక్క చేయకుండా ఉదయం, సాయంత్రం కసరత్తు చేసేస్తున్నారు. ఎస్సై, కానిస్టేబుల్‌ రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు శారీరక సామర్థ్య పరీక్షల్లోనూ తమ సత్తాచాటి ఉద్యోగం సాధించాలన్న తపనతో చెమటోడుస్తున్నారు.
16/19
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇంటి నిండా మొక్కలు పెంచి హరిత శోభితం చేశారు.. తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయ  అర్చకస్వామి పద్మనాభం. తిరుపతి పొర్లవీధిలో ఉండే ఈ ఇల్లు ఆ వీధిలో కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. వీధి మొత్తానికి పచ్చదనంతో ఉండే ఇల్లు ఇది ఒక్కటే కావడం విశేషం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇంటి నిండా మొక్కలు పెంచి హరిత శోభితం చేశారు.. తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయ అర్చకస్వామి పద్మనాభం. తిరుపతి పొర్లవీధిలో ఉండే ఈ ఇల్లు ఆ వీధిలో కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. వీధి మొత్తానికి పచ్చదనంతో ఉండే ఇల్లు ఇది ఒక్కటే కావడం విశేషం.
17/19
 సాధారణంగా గుమ్మడి కాయ ఐదు కిలోల లోపు ఉంటాయి. అయితే నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం మన్నేటికోట ప్రాంతంలో తొమ్మిదిన్నర కిలోల గుమ్మడి ఔరా అనిపిస్తోంది. సాధారణంగా గుమ్మడి కాయ ఐదు కిలోల లోపు ఉంటాయి. అయితే నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం మన్నేటికోట ప్రాంతంలో తొమ్మిదిన్నర కిలోల గుమ్మడి ఔరా అనిపిస్తోంది.
18/19
ఇలాంటి ఫ్లెక్సీలు సాధారణంగా రహదారులు, మలుపుల వద్ద కనిపిస్తాయి. దీనికి భిన్నంగా నెల్లూరు జిల్లా కొరిమెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం లోపల దీన్ని ఏర్పాటు చేశారు. పాఠశాల వరండా శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయి. దాని కింద విద్యార్థులు రాకపోకలు సాగిస్తే ప్రమాదాలు జరగవచ్చనే ముందుజాగ్రత్తతో దాన్ని  ఏర్పాటు చేశారు. ఇలాంటి ఫ్లెక్సీలు సాధారణంగా రహదారులు, మలుపుల వద్ద కనిపిస్తాయి. దీనికి భిన్నంగా నెల్లూరు జిల్లా కొరిమెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం లోపల దీన్ని ఏర్పాటు చేశారు. పాఠశాల వరండా శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయి. దాని కింద విద్యార్థులు రాకపోకలు సాగిస్తే ప్రమాదాలు జరగవచ్చనే ముందుజాగ్రత్తతో దాన్ని ఏర్పాటు చేశారు.
19/19
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం రామదాసుకండ్రిగ పంట పొలాల్లో నారు పోసి దీనికి రక్షణగా మహిళల చీరలు అడ్డుగా చుట్టారు కొందరు రైతులు. ఒకటి కాదు రెండు కాదు చాలా పొలాలకు ఇలానే చుట్టి ఉంచారు. పశువులు పొలాల్లోకి రాకుండా ఉండేందుకు ఇలా ఏర్పాట్లు చేసుకున్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం రామదాసుకండ్రిగ పంట పొలాల్లో నారు పోసి దీనికి రక్షణగా మహిళల చీరలు అడ్డుగా చుట్టారు కొందరు రైతులు. ఒకటి కాదు రెండు కాదు చాలా పొలాలకు ఇలానే చుట్టి ఉంచారు. పశువులు పొలాల్లోకి రాకుండా ఉండేందుకు ఇలా ఏర్పాట్లు చేసుకున్నారు.

మరిన్ని