News In Pics : చిత్రం చెప్పే సంగతులు -2 (19-11-2022)
Updated : 19 Nov 2022 20:17 IST
1/18
ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా హైదరాబాద్ కొంపల్లిలోని పీర్సన్ స్కూల్లో 777 మంది విద్యార్థులు 27 నిమిషాల పాటు నృత్య, సంగీత, జాతీయ పతాక ప్రదర్శన చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు.
2/18
తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొని కోలాటమాడి సందడి చేశారు.
3/18
హైదరాబాద్లో శనివారం నిర్వహించిన ఫార్ములా రేసులో 75వ నంబరు పోటీదారుడి వాహనం ఐమాక్స్ ఎదురుగా ఉన్న రక్షణ కంచెకు తగిలి అపసవ్య దిశలో తిరిగింది. లోపల ఉన్న రేసర్ వెనక వస్తున్న వాహనాలను సహాయం కోరుతూ చేయి ఎత్తి చూపారు. ఫార్ములా రేసింగ్లో వాహనం ప్రమాదానికి గురై ఇబ్బందుల్లో ఉన్న సమయంలో సాయం కోసం ఇలా చేయి ఎత్తి సంకేతం ఇస్తుంటారు.
4/18
ఎన్టీఆర్ మార్గ్లో నూతనంగా నిర్మించిన ఫార్ములా రేసింగ్ ట్రాక్ వద్ద ట్రయల్ రేసును ప్రారంభించి తిలకిస్తున్న మంత్రి కేటీఆర్.
5/18
ఎన్టీఆర్ మార్గ్లో జరుగుతున్న ఫార్ములా రేసింగ్ వద్దకు వచ్చిన సినీనటుడు నిఖిల్ మంత్రి కేటీఆర్తో మాట్లాడుతూ కనిపించారు.
6/18
నెల్లూరు శ్రీ వేంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో జిల్లా యువజన ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఓ విద్యార్థిని ఇచ్చిన మహిషాసుర మర్దని నృత్యరూపకం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.
7/18
హైదరాబాద్లోని హైటెక్ సిటీలో నిర్వహించిన హైలైఫ్ ఎగ్జిబిషన్లో పలువురు మోడల్స్ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
8/18
అవంతి డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్డే వేడుకలను చాదర్ఘాట్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థినులు ఆడిపాడి సందడి చేశారు.
9/18
10/18
నల్గొండ పట్టణంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ఎస్సై కొలువుల ఈవెంట్స్ కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత శిక్షణనిస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసు అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో అభ్యర్థులు సాధన చేస్తున్నారు.
11/18
హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్లో భాగంగా ఫార్ములా కార్లు ఇలా పోటీపడుతూ కనిపించాయి..
12/18
నెల్లూరు నగరంలోని ఓ కళ్యాణ మండపంలో శనివారం ‘శ్రీమతి నెల్లూరు’ ఆడిషన్ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొని ర్యాంప్వాక్ చేసి ఆకట్టుకున్నారు.
13/18
14/18
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో శనివారం శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
15/18
న్యూజిలాండ్తో జరగనున్న రెండో టీ20 మ్యాచ్ కోసం భారత జట్టు మౌంట్ మాంగనుయ్కి చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ భారత జట్టుకు ‘పౌహిరి’తో ఘనస్వాగతం పలికారు. న్యూజిలాండ్లో సంప్రదాయమైన పౌహిరిలో ఘనమైన ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు పాడటం తదితరాలు ఉంటాయి. ఈ వేడుకలో భారత క్రికెటర్లు కూడా స్టెప్పులేశారు.
16/18
వారాంతం కావడంతో మలేసియన్ టౌన్షిప్ కాలనీవాసులు కేపీహెచ్బీ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ సందడి చేశారు. మహిళలు, యువతులు కేరింతలు కొడుతూ ఆటగాళ్లలో హుషారు నింపారు. వారాంతాల్లో ఆటలు ఆడుతూ ఉద్యోగ ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందుతున్నట్లు వారు తెలిపారు.
17/18
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు వైకాపా ప్రభుత్వ తీరును విమర్శిస్తూ మంళగిరిలోని తెదేపా కార్యాలయంలో ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు చెందిన నూతన బుల్లెట్ ద్విచక్రవాహనాలను ఆయన ప్రారంభించారు.
18/18
ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా జనసేన పార్టీ హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో శనివారం ఉదయం పార్టీ అధినేత పవన్కల్యాణ్ ఆమె చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వీర మహిళలనుద్దేశించి పవన్ మాట్లాడుతూ.. మాతృభూమి కోసం బిడ్డను వీపు మీద కట్టుకొని లక్ష్మీబాయి యుద్ధం చేయడం తనలో స్ఫూర్తి నింపిందని తెలిపారు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!