News In Pics : చిత్రం చెప్పే సంగతులు-2 (25-11-2022)
Updated : 25 Nov 2022 22:27 IST
1/19
కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారు శుక్రవారం రాత్రి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు..
2/19
లద్ధాఖ్ సింధు లోయలోని హను-ఆర్యన్ గ్రామానికి చెందిన పలువురు మహిళలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. వీరంతా భారత ఆర్మీ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ సమగ్రతా పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చారు.
3/19
మాదాపూర్లోని శిల్పకళావేదికలో సినీనటి శోభన కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఆమె నృత్యం ఆసాంతం ప్రేక్షకులను అలరించింది.
4/19
5/19
కాంగ్రెస్ చేపట్టిన భారత్జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్.. రాహుల్ గాంధీతో కలిసి యాత్రలో పాల్గొన్నారు. వారిద్దరు మీసాలను మెలేసి పోజులిస్తూ పార్టీ శ్రేణులు, ప్రజల్లో జోష్ పెంచారు.
6/19
విశాఖలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం మోస్తరు వర్షం కురిసింది. దీంతో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
7/19
కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని కూడలిలో భారీ కాఫీ పాత్ర నమూనాను ఏర్పాటు చేశారు. దీంతో కూడలి నూతన శోభను సంతరించుకుంది.
8/19
విశాఖలోని ఎంవీపీ డబుల్ రోడ్డులో విద్యుత్తు పనుల కోసం చెట్టు చుట్టూ మట్టి తవ్వారు. దీంతో వృక్షం నేలకొరిగి ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.
9/19
దివంగత ఫుట్బాల్ క్రీడాకారుడు డీగో మారడోనా రెండో వర్ధంతి సందర్భంగా ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ తీరంలో ఆయన సైకత శిల్పాన్ని తీర్చిదిద్ది నివాళి అర్పించాడు.
10/19
ఆదిలాబాద్లోని భీంపూర్ మండలం గుంజాల సమీపంలోనిది ఈ జలపాతం. ఇక్కడ ఓ రాయి ప్రకృతిసిద్ధంగా మనిషి రూపంతో కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది. జలపాతం పైనుంచి చూస్తే నీటి కోసం నోరు తెరిచినట్లుగా ఈ రూపం కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చిన ప్రకృతి ప్రేమికులు తమ సెల్ఫోన్లలో ఈ చిత్రాన్ని బంధించి మురిసిపోతున్నారు..
11/19
బెల్జియంకు చెందిన యువతి కెమిల్, కర్ణాటకకు చెందిన ఆటోడ్రైవర్ అనంతరాజు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నాలుగేళ్ల క్రితం హంపికి వచ్చిన ఆమెకు ఆటో డ్రైవర్, గైడ్ అనంతరాజుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఇరు కుటుంబాల అంగీకారంతో శుక్రవారం ఉదయం హంపి విరూపాక్షేశ్వరుడి సన్నిధిలో వేడుకగా వీరి కల్యాణం జరిగింది.
12/19
ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంలోని ఛత్తీస్గఢ్-దుర్గకొండల్ సరిహద్దు అటవీ ప్రాంతంలో రోడ్డు పనులు చేస్తున్న వాహనాలను తగలబెట్టిన మావోయిస్టులు
13/19
కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఖమ్మం జిల్లా ఈర్లపూడిలోని ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇటీవల గొత్తికోయల దాడిలో శ్రీనివాసరావు హత్యకు గురైన సంగతి తెలిసిందే.
14/19
సినీనటుడు వరుణ్ సందేశ్, వితికా శేరు దంపతులు ముచ్చింతల్లోని సమతా స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి రామానుజాచార్యుల విగ్రహం వద్ద ఫోటోలు తీసుకొని సందడి చేశారు.
15/19
ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కాశీ విశ్వనాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. చాలాకాలంగా ఇక్కడికి రావాలని వేచి చూస్తున్నట్లు ఆయన తెలిపారు.
16/19
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నేటి ఉదయం సర్వభూపాల వాహనంపై వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
17/19
గోవాలో నిర్వహించిన 53వ అంతర్జాతీయ ఫిల్మ్ఫెస్టివల్లో ‘అఖండ’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి ఇలా రెడ్ కార్పెట్పై సందడి చేశారు.
18/19
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లోని ఖండవా జిల్లాలో సాగుతోంది. రాహుల్కు సంఘీభావం తెలుపుతూ యాత్రలో పాల్గొన్న ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఓ బాలికకు ఇలా షూ లేస్ కడుతూ కనిపించారు.
19/19
ఏపీ సీఎస్ సమీర్శర్మ కుటుంబ సమేతంగా ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
-
రాష్ట్రంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపండి: ఏపీ సీఎస్ ఆదేశం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
-
విశాఖ - బెంగళూరు మధ్య 20 వేసవి ప్రత్యేక రైళ్లు.. శని, ఆదివారాల్లోనే..!
-
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్