News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2 (05-12-2022)
Updated : 05 Dec 2022 20:53 IST
1/19
హైదరాబాద్లోని బన్సీలాల్పేటలో సుందరీకరించిన మెట్లబావిని మంత్రి కేటీఆర్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పాల్గొన్నారు.
2/19
బేగంపేటలోని కంట్రీ క్లబ్లో సోమవారం నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన టికెట్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సినీనటి స్నేహాగుప్తా పాల్గొని సినిమా పాటలకు స్టెప్పులేస్తూ సందడి చేశారు.
3/19
మిలమిల మెరుస్తున్న ఈ వస్తువులన్నీ బంగారంతో చేసినవేం కాదు! వాహనాలకు సంబంధించిన వస్తువులు దెబ్బతిని నిరుపయోగంగా మారగా.. వాటితో ఇలా కళాఖండాలను తీర్చిదిద్ది హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ప్రదర్శనకు ఉంచారు. బతుకమ్మ, చార్మినార్, ఒగ్గు డోలు వంటి కళారూపాల ఆకృతులు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
4/19
విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇచ్చిన నృత్య ప్రదర్శన ఆసాంతం చూపరులను ఆకట్టుకుంది.
5/19
ఫ్లాష్ మాబ్లో పాల్గొన్న విద్యార్థులు
6/19
అంతర్జాతీయ మట్టి దినోత్సవం సందర్భంగా ‘మట్టిని రక్షించు(సేవ్ సాయిల్)’ వాలంటీర్లు హైదరాబాద్లోని చార్మినార్, ఉస్మానియా క్యాంపస్, శిల్పారామం, ట్యాంక్బండ్ తదితర ప్రాంతాల్లో మట్టి క్షీణతపై అవగాహన కల్పించారు.
7/19
8/19
సెయింట్ నికోలస్ డే వేడుకల్లో భాగంగా జర్మనీలోని టోయింగ్లో ఓ డైవర్ సాంటాక్లాజ్ వేషధారణలో అక్వేరియంలోని చేపలకు మేతను అందించారు.
9/19
ఓ తల్లి తన కుమార్తెను పాఠశాల నుంచి ఇంటికి తీసుకెళ్లే సమయంలో ద్విచక్రవాహనం పైనుంచి కింద పడకుండా ఉండేందుకు చున్నీతో ఇలా కట్టి జాగ్రత్తగా తీసుకెళ్లింది. నల్గొండలోని దేవరకొండ రోడ్డులో ఈ చిత్రం కనిపించింది.
10/19
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆమెకు లాంఛనంగా స్వాగతం పలికి దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
11/19
లండన్లోని కింగ్ క్రాస్ స్టేషన్ వద్ద ‘హోమ్లెస్ ఛారిటీ క్రైసిస్’ సంస్థ 4.3 మీటర్ల ఎత్తైన నిరాశ్రయుడి విగ్రహాన్ని ఆవిష్కరించింది. 17మంది వ్యక్తుల ముఖ కవళికలను వినియోగించి అధునాతన ఫేస్మ్యాపింగ్ టెక్నాలజీ సహాయంతో సహజత్వం ఉట్టిపడేలా దీన్ని తీర్చిదిద్దారు.
12/19
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. వడోదరలోని ఓ పోలింగ్ కేంద్రంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
13/19
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో మాట్లాడటంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు..
14/19
ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఎయిర్బస్ బెలూగా ఆదివారం రాత్రి హైదరాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయింది. తిమింగలం ఆకారంలో ఉండే ఈ విమానం సోమవారం సాయంత్రం 7.20గంటల వరకు ఇక్కడ ఉండనుంది.
15/19
విశ్వక్సేన్ హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ‘హిట్’ విజయవంతమైంది. తాజాగా అడివి శేష్ కథానాయకుడిగా ‘హిట్ 2’ విడుదలైంది. సినిమా చివర్లో ‘హిట్ 3’ నాని హీరోగా తెరకెక్కిస్తామని చిత్రబృందం హింట్ ఇచ్చింది. దర్శకుడితో కలిసి ఈ ముగ్గురు హీరోలు ఒక చోట చేరిన ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్గా మారింది.
16/19
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాసర ‘వేద భారతి పీఠ’ వేద విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వేద విద్యార్థుల నుంచి ఆశీర్వచనం పొందారు. భాజపా అధికారంలోకి వస్తే వేద పాఠశాలల సంఖ్య మరింతగా పెంచేందుకు కృషి చేస్తామని ప్రకటించారు.
17/19
జమ్మూలో చలి తీవ్రత క్రమేణ పెరుగుతోంది. దీంతో వేకువజామునే పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారత్-పాక్ సరిహద్దులోని రణ్బీర్ సింగ్ పురాలో కనిపించాయి ఈ చిత్రాలు..
18/19
నాంపల్లి మెట్రో స్టేషన్ వద్ద పావురాలు గుంపులుగుంపులుగా ఎగురుతూ కనువిందు చేస్తున్నాయి. పలువురు సందర్శకులు తమ చిన్నారులతో వచ్చి వాటికి ఆహారంగా ధాన్యపు గింజలు వేస్తున్నారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ మురిసిపోతున్నారు.
19/19
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు ఇస్తీకఫాల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!