News In Pics: చిత్రం చెప్పే సంగతులు (06-12-2022)
Updated : 06 Dec 2022 04:07 IST
1/10
ది స్క్వేర్ కిలోమీటర్ అరే (ఎస్కేఏ) పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం ఆస్ట్రేలియాలో మొదలైంది. 21వ శతాబ్దపు అతిపెద్ద సైన్స్ ప్రాజెక్టుల్లో ఒకటిగా దీన్ని అభివర్ణిస్తున్నారు. 2028 నాటికి ఈ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు.
2/10
అహ్మదాబాద్లోని రాణిప్లో ప్రధాని మోదీ, నారన్పుర్లో ఓటు హక్కు వినియోగించుకున్న అమిత్ షా.
3/10
శ్రీవారి ఆలయ ధ్వజస్తంభానికి నమస్కరిస్తున్న ర్రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
4/10
చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో నిర్మిస్తున్న 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెలలో నూతన సచివాలయాన్ని ప్రారంభించబోతున్న తరుణంలో.. అంబేడ్కర్ జయంతి రోజు(ఏప్రిల్ 14)న ఈ విగ్రహాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
5/10
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లిలోని ప్యాక్స్ కొనుగోలు కేంద్రంలో వందల సంఖ్యలో కోతులు ధాన్యం తింటూ అన్నదాతలను హడలెత్తిస్తున్నాయి. సోమవారం కోతులను తరిమేందుకు రైతులు ప్రయత్నించగా, కరిచేందుకు యత్నించాయి. కర్రలతో తరిమినా.. సమీపంలోని చెట్లపైకి వెళ్లి తిరిగి ధాన్యంపై పడుతున్నాయని, నష్టం కలిగిస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
6/10
తళతళ మెరుస్తున్న ఈ ఆకృతులన్నీ పనికిరాని వస్తువులు, వృథాగా ఉన్న వాహనాల విడిభాగాలతో తయారు చేసినవే. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 25 మంది లోహ కళాకారులు శ్రమించి బతుకమ్మ, చార్మినార్, ఒగ్గుడోలు వంటి విభిన్న రూపాల్లో తీర్చిదిద్దారు. రవీంద్రభారతిలో కొలువు దీరిన ఇవి చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
7/10
విశాఖలోని కేజీహెచ్కు నిత్యం పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఉత్తరాంధ్రతో పాటు...ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి కూడా వచ్చి వైద్య సేవలు పొందుతుంటారు. అంతటి కీలకమైన ఇక్కడ ఓపీ టోకెన్ తీసుకోవాలంటే పెద్ద ప్రయాసే. భారీ వరుసలో నిరీక్షించక తప్పదు. సోమవారం ఓపీ కేంద్రం వద్ద రద్దీని చిత్రంలో చూడొచ్చు.
8/10
కడప నగరంలోని పెద్దదర్గా ఉరుసు మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. బుధవారం గంధం, గురువారం ఉరుసు జరగనుంది. విద్యుత్తు దీపాల కాంతుల్లో మెరిసిపోతున్న దర్గాను చిత్రంలో చూడొచ్చు.
9/10
కొందరు శ్రావ్యంగా పాడారు. మరికొందరు సమ్మోహనంగా డ్యాన్స్ చేశారు. ఇంకొందరు వీనులవిందులైన సంగీతాన్ని జత చేశారు. వీరంతా యువతీ యువకులే. ఇక హుషారుకు అడ్డేముంది...అందరూ కలిసి యువ జోరేమిటో చూపించారు. తమలోని ప్రతిభతో అలరించారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించిన ‘ఫ్లాష్మాబ్’ ఇందుకు వేదికయింది.
10/10
సికింద్రాబాద్ బన్సీలాల్పేటలో పురాతన మెట్లబావిని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి కేటీఆర్ సోమవారం రాత్రి ప్రారంభించారు. గడిచిన ఎనిమిదిన్నర సంవత్సరాల్లో అనేక ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను ప్రారంభించినప్పటికీ దక్కని సంతోషం.. ఈ మెట్లబావిని ప్రారంభిస్తుంటే దక్కిందని కేటీఆర్ పేర్కొన్నారు. రూ.10 కోట్లతో సుందరంగా తీర్చిదిద్దిన ఈ బావి గొప్ప పర్యాటక కేంద్రంగా విరాజిల్లనుందని చెప్పారు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య