News In Pics: చిత్రం చెప్పే సంగతులు -1 (10-12-2022)
Updated : 10 Dec 2022 08:09 IST
1/13
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు వెళ్లే వారికి బస్సు కష్టాలు తప్పడం లేదు. కాలేజీలన్నీ ఒకే సమయానికి మొదలవుతుండటం.. రద్దీకి సరిపడా బస్సులు లేకపోవడంతో లోపల కిక్కిరిసిపోవడమే కాదు.. బయట ఇలా ఫుట్బోర్డుపై నిలబడి ప్రయాణిస్తున్నారు. కొత్తపేటలో కనిపించిన దృశ్యాలివి.
2/13
ఈ-బైక్లకు ఇళ్లల్లో ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు. కానీ ఎలక్ట్రిక్ ఆటోలకు ఛార్జింగ్ పాయింట్లు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. ఎర్రమంజిల్ సివిల్ సప్లై కార్యాలయం సమీపంలో ఉన్న ఓ ఛార్జింగ్ పాయింట్ వద్ద ఆటో డ్రైవర్.. ఖాళీ బ్యాటరీని తీసి.. ఛార్జర్లో పెట్టి.. నిండుగా ఉన్న బ్యాటరీని ఆటోలో అమర్చుతున్న దృశ్యమిది.
3/13
యువత నృత్యాలు.. వాటిని తిలకిస్తూ తోటి విద్యార్థుల కేరింతలతో కృష్ణా విశ్వవిద్యాలయంలో సందడి నెలకొంది. కృష్ణాతరంగ్ పేరిట రెండు రోజుల పాటు యువజనోత్సవాలు నిర్వహిస్తున్నారు.
4/13
కామారెడ్డి జిల్లా బీర్కూర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇది. 44 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పాఠశాలలో ప్రస్తుతం 106 మంది బాలికలు, 106 మంది బాలురు చదువుతున్నారు. ఆరుగురు ఉపాధ్యాయినులు, ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇటీవల మూత్రశాల గోడ కూలడం, పైన రేకులను దొంగలు ఎత్తుకెళ్లడంతో ఉపాధ్యాయులు ఆ ప్రాంతంలో పరదాలు కట్టారు. ఆ పరదాల చాటునే నిత్యం బాలికలు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తోంది.
5/13
అస్సాంలోని గోలాఘాట్ వద్ద శుక్రవారం వరిచేను గట్టుపై కూర్చొని కూలీలతో కలిసి ‘పొమెలొ’ సలాడ్ తింటున్న ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ.
6/13
కాకతీయ మెడికల్ కాలేజీ మైదానం డీజే సౌండ్లతో దద్దరిల్లింది. నిత్యం రోగుల మధ్య ఒత్తిడితో ఉండే వైద్యవిద్యార్థులు వయ్యారి నడక (ఫ్యాషన్ షో)తో తోటి విద్యార్థుల్లో జోష్ నింపారు. కాకతీయ మెడికల్ కాలేజీ వార్షికోత్సవం, మెడికోఫెస్ట్ ఉత్కర్ష-22 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం కళాశాల మైదానంలో డీజేనైట్, ఫ్యాషన్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు.
7/13
ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత 7 డిగ్రీలుగా నమోదైంది. మధ్యాహ్నం 12 అయినా చలి తీవ్రత తగ్గలేదు. శుక్రవారం ఉదయం తరగతి గదిలో పాఠాలు వినే పరిస్థితి లేకపోవడంతో గుడిహత్నూర్ మండలంలో గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో అన్ని తరగతులను ఆరుబయట ఎండలోనే నిర్వహిస్తున్నారు.
8/13
చెట్లపై నివాసాలు ఉండటం అడవుల్లో లేదా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాల్లో చూస్తుంటాం. నగర శివారులోని అబ్దుల్లాపూర్మెట్లో ఓ వ్యక్తి తన ఇంటి ముందున్న చెట్టుపై ఇలా మంచెలా ఏర్పాట్లు చేసుకోవడం ఆకట్టుకుంటోంది.
9/13
భాగ్యనగరంలోని ధూల్పేటలో ఓ ఇంటి ప్రహరీని చీల్చుకుని మరీ కొన్నేళ్లుగా రావి చెట్టు పెరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ రోడ్డులో వెళ్లే వాహనదారులకు ఇది ప్రమాదకరంగా ఉంది.
10/13
మిస్ ఇండియా వరల్డ్ మానస వారణాసి సందడి చేశారు. అమీర్పేట లో శుక్రవారం మంగళ గౌరి సిల్క్స్ నూతన షోరూంను ఆమె ప్రారంభించారు.
11/13
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వద్ద సందడి మొదలైంది. ఈనెల 28-30 వరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ఖరారైన విషయం తెలిసిందే. ఆమె బస నేపథ్యంలో రాష్ట్రపతి నిలయంలోని పరిసరాలు, భవనాలను ముస్తాబు చేస్తున్నారు.
12/13
మైండ్స్పేస్ వద్ద శంకుస్థాపన పూజల్లో సీఎం కేసీఆర్, మేయర్ విజయలక్ష్మి, కేశవరావు తదితరులు
13/13
తెలంగాణ సాధనే ధ్యేయంగా పురుడుపోసుకున్న తెరాస పార్టీ.. జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించింది. శుక్రవారం తెలంగాణ భవన్ వద్ద భారాస నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబరాలు జరుపుకొన్నారు. బాణసంచా కాల్చి.. మిఠాయిలు పంచారు.. లంబాడీల నృత్యం ఆకట్టుకుంది.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా