News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (22-05-2023)
Updated : 22 May 2023 21:27 IST
1/23
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగోను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్రావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ ప్రభుత్వ ప్రాధాన్య పథకాలతో ఈ లోగోను రూపొందించారు.
2/23
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా మంగళవారం చెన్నై, గుజరాత్ జట్ల మధ్య చెన్నైలో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా చెన్నై ప్లేయర్ మొయిన్ అలీ, గుజరాత్ కోచ్ నెహ్రా స్టేడియంలో నవ్వులు చిందిస్తున్న ఫొటోను జీటీ తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది. ‘ఫ్లే ఆఫ్ మ్యాచ్లు ఎలా ఉన్నా.. మేము నవ్వుతూనే ఉంటాం’ అని ట్వీట్ చేసింది.
3/23
జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సదస్సుకు హాజరయ్యేందుకు శ్రీనగర్ వచ్చిన ప్రతినిధులు దాల్ సరస్సులో పడవల్లో తిరిగి అక్కడి అందాలను ఆస్వాదించారు.
4/23
ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, గ్రీన్ కలిసి దిగిన ఫొటోను ముంబయి జట్టు తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది. ఇటీవల ఈ ఇద్దరు సెంచరీలు చేసిన నేపథ్యంలో వీరికి 100/100 అని పోస్టు పెట్టింది.
5/23
ఫ్రాన్స్లో నిర్వహిస్తున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నటీమణులు డయానా పెంటీ, మౌని రాయ్ పాల్గొని సందడి చేశారు.
6/23
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సిడ్నీ చేరుకున్నారు. అక్కడి భారతీయులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
7/23
అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. వాషింగ్టన్లో దిగిన ఫొటోను ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటో బాగుందంటూ కార్యకర్తలు, ఆయన ఫాలోవర్లు కామెంట్లు పెడుతున్నారు.
8/23
సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
9/23
సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఐపీఎల్ 16వ సీజన్ నుంచి వీడ్కోలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆటగాళ్లు, కోచ్లు కలిసి దిగిన ఫొటోను ఎస్ఆర్హెచ్ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు.
10/23
శ్రీనగర్లో నిర్వహిస్తున్న జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సదస్సుకు సినీనటుడు రామ్చరణ్ హాజరయ్యారు. ఆయనకు అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికారు.
11/23
ప్రధాని నరేంద్ర మోదీకి న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్ ఆ దేశ క్రికెట్ జెర్సీని బహూకరించారు. పపువా న్యూ గినియాలో ఈ నేతలు ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు.
12/23
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసర మండల కేంద్రంలో ‘కీసర ప్రీమియర్ లీగ్’ క్రికెట్ పోటీలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బ్యాట్ పట్టి క్రికెట్ ఆడి పార్టీ శ్రేణులు, క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
13/23
శ్రీనగర్లో సోమవారం జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, జీ20 ప్రతినిధులకు శ్రీనగర్ విమానాశ్రయంలో మహిళలు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు.
14/23
ముంబయి అచీవర్స్ అవార్డ్స్ 2023 ప్రదానోత్సవ కార్యక్రమంలో సినీనటి షెర్లీ సేథియా ‘ది రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నారు.
15/23
ఫ్రాన్స్లో నిర్వహిస్తున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో శృతిహాసన్ మెరిశారు. ఆమె పదునైన చూపులతో చూపరులను ఆకట్టుకున్నారు.
16/23
హైదరాబాద్లోని శిల్పకళావేదికలో కొత్తగా ఎంపికైన 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మంత్రి హరీశ్రావు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అక్కడివారు మంత్రితో సెల్ఫీలు, గ్రూప్ ఫొటో తీసుకొని సంబరపడ్డారు.
17/23
కృష్ణా జిల్లా బందరు పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా తపసిపుడి గ్రామానికి చేరుకున్న సీఎం.. సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ పైలాన్ను జగన్ ఆవిష్కరించారు.
18/23
కర్ణాటకలో సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విధాన సౌధ ప్రవేశద్వారం వద్ద ఇలా ప్రణమిల్లి సమావేశాలకు హాజరయ్యారు.
19/23
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా నాలుగు జట్లు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్స్కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జట్లకు అభినందనలు తెలుపుతూ ‘ఐపీఎల్’ తన ట్విటర్ ఖాతాలో ఈ ఫొటోను పంచుకుంది.
20/23
ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సీఎం కప్ పేరున నిర్వహిస్తున్న క్రీడా పోటీలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. వివిధ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.
21/23
తెలంగాణ ఉద్యమకారుడు పిట్టల రవీందర్ తెలంగాణ మత్స్య సహకార సంఘాల సమాఖ్య ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయన్ను అభినందించారు.
22/23
మాదాపూర్ శిల్పకళావేదికలో అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాల జారీ కార్యక్రమానికి మంత్రి హరీశ్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా అర్హులైన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్లకు నియామక పత్రాలు అందజేశారు.
23/23
వైఎస్ అవినాష్రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు కర్నూలు ఎస్పీకి లిఖితపూర్వక లేఖ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అనినాష్ను అరెస్టు చేస్తే ఊరుకునేది లేదని వైకాపా కార్యకర్తలు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విశ్వభారతి ఆసుపత్రి ఎదుట బైఠాయించిన పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?