News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (23-05-2023)

Updated : 23 May 2023 21:33 IST
1/17
తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరలో భాగంగా మొదటి మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి బోనం సమర్పంచి ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరలో భాగంగా మొదటి మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి బోనం సమర్పంచి ప్రత్యేక పూజలు చేశారు.
2/17
కోఠి ఉమెన్స్‌ కళాశాలకు వెళ్లే దారిలో కాగితపు పూల చెట్టు సుందరంగా కనిపిస్తోంది. గులాబీ రంగుతో నిండిపోయిన ఈ చెట్టు.. ప్రయాణికులు, విద్యార్థులకు కనువిందు చేస్తోంది. కోఠి ఉమెన్స్‌ కళాశాలకు వెళ్లే దారిలో కాగితపు పూల చెట్టు సుందరంగా కనిపిస్తోంది. గులాబీ రంగుతో నిండిపోయిన ఈ చెట్టు.. ప్రయాణికులు, విద్యార్థులకు కనువిందు చేస్తోంది.
3/17
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా చెపాక్‌ స్టేడియంలో గుజరాత్‌, చెన్నై జట్ల మధ్య క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్‌ నెగ్గిన గుజరాత్‌ జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌కు ముందు ఇరుజట్ల కెప్టెన్‌లు హార్దిక్‌ పాండ్య, ధోనీ ఇలా ఫొటోకు పోజిచ్చారు. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా చెపాక్‌ స్టేడియంలో గుజరాత్‌, చెన్నై జట్ల మధ్య క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్‌ నెగ్గిన గుజరాత్‌ జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌కు ముందు ఇరుజట్ల కెప్టెన్‌లు హార్దిక్‌ పాండ్య, ధోనీ ఇలా ఫొటోకు పోజిచ్చారు.
4/17
సిడ్నీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. సిడ్నీలో ఈ సాయంత్రం చాలా ప్రత్యేకమైనదని, అక్కడికి వచ్చిన భారతీయులకు మోదీ  కృతజ్ఞతలు తెలిపారు. సిడ్నీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. సిడ్నీలో ఈ సాయంత్రం చాలా ప్రత్యేకమైనదని, అక్కడికి వచ్చిన భారతీయులకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
5/17
ద్విచక్రవాహనం అద్దంలో తన రూపాన్ని చూసుకొని మురిసిపోతున్న ఈ బుజ్టి పిట్ట కూకట్‌పల్లి బస్‌స్టాప్‌లో కనిపించింది. ద్విచక్రవాహనం అద్దంలో తన రూపాన్ని చూసుకొని మురిసిపోతున్న ఈ బుజ్టి పిట్ట కూకట్‌పల్లి బస్‌స్టాప్‌లో కనిపించింది.
6/17
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా బుధవారం ముంబయి, లఖ్‌నవూ జట్ల మధ్య చెపాక్‌ స్టేడియంలో ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా విమానాశ్రయంలో రోహిత్‌కు ఓ చిన్నారి హాయ్‌ చెబుతున్న ఫొటోను ఎంఐ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ‘ఆల్‌ ది బెస్ట్ రోహిత్‌..’ అని ట్వీట్‌ చేసింది. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా బుధవారం ముంబయి, లఖ్‌నవూ జట్ల మధ్య చెపాక్‌ స్టేడియంలో ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా విమానాశ్రయంలో రోహిత్‌కు ఓ చిన్నారి హాయ్‌ చెబుతున్న ఫొటోను ఎంఐ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ‘ఆల్‌ ది బెస్ట్ రోహిత్‌..’ అని ట్వీట్‌ చేసింది.
7/17
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా చెన్నై, గుజరాత్‌ జట్ల మధ్య చెన్నైలో తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా ఇరుజట్ల కోచ్‌లు ఫ్లెమింగ్, నెహ్రా స్టేడియంలో  సరదాగా ముచ్చటించుకుంటున్న ఫొటోను సీఎస్‌కే ట్విటర్‌లో పంచుకుంది. ‘స్నేహం కుదిరింది. వీరి మధ్య దూరం లేదు’ అని ట్వీట్‌ చేసింది. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా చెన్నై, గుజరాత్‌ జట్ల మధ్య చెన్నైలో తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా ఇరుజట్ల కోచ్‌లు ఫ్లెమింగ్, నెహ్రా స్టేడియంలో సరదాగా ముచ్చటించుకుంటున్న ఫొటోను సీఎస్‌కే ట్విటర్‌లో పంచుకుంది. ‘స్నేహం కుదిరింది. వీరి మధ్య దూరం లేదు’ అని ట్వీట్‌ చేసింది.
8/17
తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ‘ఎండ్యూరింగ్‌ సింబల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ప్రోగ్రెస్‌’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా అమెరికన్‌ సొసైటీ ఆఫ్ సివిల్‌ ఇంజినీర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ ఈ అవార్డును అందుకున్నారు. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ‘ఎండ్యూరింగ్‌ సింబల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ప్రోగ్రెస్‌’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా అమెరికన్‌ సొసైటీ ఆఫ్ సివిల్‌ ఇంజినీర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ ఈ అవార్డును అందుకున్నారు.
9/17
చిరంజీవి ప్రధాన పాత్రలో మెహర్‌ రమేశ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘భోళా శంకర్‌’. ఈ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ స్విట్జర్లాండ్‌లో జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. ‘కళ్లు చెదిరే అందాలతో.. మైమరిపించే లోకేషన్స్‌లో తమన్నాతో ఆటపాట ఆహ్లాదకరంగా సాగింది. ఈ పాట ప్రేక్షకులందరినీ మెప్పిస్తుంది’ అని చిరు ట్వీట్‌ చేశారు. చిరంజీవి ప్రధాన పాత్రలో మెహర్‌ రమేశ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘భోళా శంకర్‌’. ఈ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ స్విట్జర్లాండ్‌లో జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. ‘కళ్లు చెదిరే అందాలతో.. మైమరిపించే లోకేషన్స్‌లో తమన్నాతో ఆటపాట ఆహ్లాదకరంగా సాగింది. ఈ పాట ప్రేక్షకులందరినీ మెప్పిస్తుంది’ అని చిరు ట్వీట్‌ చేశారు.
10/17
అడిడాస్‌ జెర్సీ సంస్థ సభ్యులు క్రికెటర్‌ అక్షర్‌ పటేల్‌తో కలిసి దిగిన ఫొటోను ఆ సంస్థ ట్విటర్‌లో పంచుకుంది. ‘అడిడాస్‌ టీమ్‌ఇండియాతో కలిసి ఉంది. జెర్సీ కోసం వేచి ఉండాలి’ అని ట్వీట్‌ చేసింది. అడిడాస్‌ జెర్సీ సంస్థ సభ్యులు క్రికెటర్‌ అక్షర్‌ పటేల్‌తో కలిసి దిగిన ఫొటోను ఆ సంస్థ ట్విటర్‌లో పంచుకుంది. ‘అడిడాస్‌ టీమ్‌ఇండియాతో కలిసి ఉంది. జెర్సీ కోసం వేచి ఉండాలి’ అని ట్వీట్‌ చేసింది.
11/17
పవన్‌ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తోన్న చిత్రం  ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వంలో రానున్న ఈ మల్టీస్టారర్‌ చిత్రంలో సాయి ధరమ్‌ తేజ్‌ ‘మార్కండేయులు(మార్క్‌)’ పాత్ర పోషిస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఓ ఫొటోను ట్వీట్‌ చేసింది. పవన్‌ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తోన్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వంలో రానున్న ఈ మల్టీస్టారర్‌ చిత్రంలో సాయి ధరమ్‌ తేజ్‌ ‘మార్కండేయులు(మార్క్‌)’ పాత్ర పోషిస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఓ ఫొటోను ట్వీట్‌ చేసింది.
12/17
బంజారాహిల్స్‌లోని హోటల్‌ తాజ్‌ కృష్ణాలో డిజైర్‌ డిజైనర్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు. బంజారాహిల్స్‌లోని హోటల్‌ తాజ్‌ కృష్ణాలో డిజైర్‌ డిజైనర్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు.
13/17
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో బెంగళూరు జట్టు లీగ్‌ స్టేజ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జట్టు సభ్యులతో కూడిన ఓ తాజా ఫొటోను ఆర్‌సీబీ తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది.  ‘ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చాం. వచ్చే ఏడాది అభిమానులను అలరిస్తాం’ అని ట్వీట్‌ చేసింది. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో బెంగళూరు జట్టు లీగ్‌ స్టేజ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జట్టు సభ్యులతో కూడిన ఓ తాజా ఫొటోను ఆర్‌సీబీ తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది. ‘ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చాం. వచ్చే ఏడాది అభిమానులను అలరిస్తాం’ అని ట్వీట్‌ చేసింది.
14/17
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా చెన్నై, గుజరాత్‌ జట్ల మధ్య మంగళవారం చెపాక్‌ స్టేడియంలో తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా బ్రావో, నెహ్రా ఇలా ముచ్చటించుకుంటున్న ఫొటోను గుజరాత్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ‘ ఇద్దరు ఛాంపియన్‌ల మధ్య గొప్ప చర్చ’ అని ట్వీట్‌ చేసింది. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా చెన్నై, గుజరాత్‌ జట్ల మధ్య మంగళవారం చెపాక్‌ స్టేడియంలో తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా బ్రావో, నెహ్రా ఇలా ముచ్చటించుకుంటున్న ఫొటోను గుజరాత్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ‘ ఇద్దరు ఛాంపియన్‌ల మధ్య గొప్ప చర్చ’ అని ట్వీట్‌ చేసింది.
15/17
సిడ్నీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీని ఫేమస్‌ చెఫ్‌ సారా టాడ్‌ కలిశారు. అనంతరం భారతదేశ వంటకాల గురించి వీరిద్దరు చర్చించుకున్నారు. సిడ్నీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీని ఫేమస్‌ చెఫ్‌ సారా టాడ్‌ కలిశారు. అనంతరం భారతదేశ వంటకాల గురించి వీరిద్దరు చర్చించుకున్నారు.
16/17
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా చెన్నై, గుజరాత్‌ జట్ల మధ్య మంగళవారం చెన్నైలో తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా ఇరుజట్ల కెప్టెన్‌లు ధోనీ, హార్దిక్‌ పాండ్యలకు సంబంధించిన ఓ ఫొటోను సీఎస్‌కే తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది. ‘గురు శిష్యుల జర్నీని చూసి ఎలా ఫీలవుతున్నారు?’ అని ట్వీట్‌ చేసింది. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా చెన్నై, గుజరాత్‌ జట్ల మధ్య మంగళవారం చెన్నైలో తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా ఇరుజట్ల కెప్టెన్‌లు ధోనీ, హార్దిక్‌ పాండ్యలకు సంబంధించిన ఓ ఫొటోను సీఎస్‌కే తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది. ‘గురు శిష్యుల జర్నీని చూసి ఎలా ఫీలవుతున్నారు?’ అని ట్వీట్‌ చేసింది.
17/17
 కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఊహించని విధంగా ఓ ట్రక్కులో ప్రత్యక్షమయ్యారు. దిల్లీ నుంచి చండీగఢ్‌ వెళ్తున్న ఆయన.. మార్గమధ్యంలో కారు దిగి, ఓ ట్రక్కు ఎక్కి ప్రయాణించారు. ఆ ట్రక్కులో ఆయన చండీగఢ్‌ వరకు చేరుకుని అక్కడ డ్రైవర్‌లతో కలిసి భోజనం చేశారు. అనంతరం డ్రైవర్‌ల కష్టనష్టాల గురించి రాహుల్‌ అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఊహించని విధంగా ఓ ట్రక్కులో ప్రత్యక్షమయ్యారు. దిల్లీ నుంచి చండీగఢ్‌ వెళ్తున్న ఆయన.. మార్గమధ్యంలో కారు దిగి, ఓ ట్రక్కు ఎక్కి ప్రయాణించారు. ఆ ట్రక్కులో ఆయన చండీగఢ్‌ వరకు చేరుకుని అక్కడ డ్రైవర్‌లతో కలిసి భోజనం చేశారు. అనంతరం డ్రైవర్‌ల కష్టనష్టాల గురించి రాహుల్‌ అడిగి తెలుసుకున్నారు.
Tags :

మరిన్ని