News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (29-05-2023)
Updated : 29 May 2023 21:50 IST
1/24
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు స్వామివారు సర్వభూపాల వాహనంపై బకాసుర వధ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
2/24
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సీఎం కప్ 2023 తెలంగాణ క్రీడా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు ఇచ్చిన నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ పాల్గొన్నారు.
3/24
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా అహ్మదాబాద్లో చెన్నెసూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ సందర్భంగా చెన్నై క్రికెటర్ల కుటుంబసభ్యులు మ్యాచ్ వీక్షిస్తూ సందడి చేశారు.
4/24
ఉక్రెయిన్లోని కీవ్పై రష్యా సోమవారం డ్రోన్లు, క్షిపణులతో దాడులను తీవ్రతరం చేసింది. దీంతో ప్రజలు పెద్దఎత్తున అక్కడి మెట్రో స్టేషన్లో తలదాచుకున్నారు.
5/24
హైదరాబాద్లోని కేపీహెచ్బీ పాత రైతుబజార్ వంతెనపై సోమవారం ఉదయం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
6/24
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా అహ్మదాబాద్లో చెన్నెసూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు ధోనీ, హార్దిక్ పాండ్య ట్రోఫీతో ఫొటో తీసుకున్నారు.
7/24
సినీనటి పూజా జవేరి వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. ‘మై అల్మారీ’ పేరుతో వస్ర్త తయారీ బ్రాండ్ను ఆమె ముంబయిలో సోమవారం లాంచ్ చేశారు.
8/24
మణిపుర్లో గిరిజనులపై జరుగుతున్న హింసాకాండను నిరసిస్తూ అక్కడి కుకీ గిరిజన మహిళలు దిల్లీలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు జాతీయ జెండాలను చేతబట్టి కన్నీటిపర్యంతమయ్యారు. మణిపుర్లో ఈ నెల 3నుంచి గిరిజన, గిరిజనేతరుల మధ్య రిజర్వేషన్లు, ఆర్థిక ప్రయోజనాలు తదితర కారణాలతో ఘర్షణలు సాగుతున్నాయి.
9/24
ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్కు వర్షం అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో అందరి చూపు ఆకాశం వైపు ఉంది అని తెలుపుతూ సీఎస్కే.. మొయిన్ అలీ, కాన్వేల ఫొటోను ట్విటర్ వేదికగా పంచుకుంది.
10/24
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం విరాట్ కోహ్లీ, జయదేవ్ ఉనద్కత్ తదితరులు ఇంగ్లాండ్కు చేరుకున్నారు. ఆస్ట్రేలియా, భారత్ మధ్య జూన్ 7 నుంచి 11 వరకు ఈ మ్యాచ్ జరగనుంది.
11/24
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య సోమవారం సాయంత్రం మ్యాచ్ జరగనుండటంతో ‘జియో సినిమా’ తన ట్విటర్ ఖాతాలో ఈ ఆసక్తికర ఫొటోను పంచుకుంది. ‘దేశవ్యాప్తంగా నేడు సిక్ లీవ్ కోసం హెచ్ఆర్ విభాగాల వద్ద పోగుబడిన వినతులివి’ అని చెబుతూ ఫన్నీగా పోస్టు పెట్టింది.
12/24
మహేశ్బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ28’(వర్కింగ్ టైటిల్). ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ను ఈ నెల 31న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలుపుతూ చిత్రబృందం మహేశ్ పోస్టర్ను ట్విటర్ వేదికగా పంచుకుంది.
13/24
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం యశస్వి జైస్వాల్.. రోహిత్ శర్మతో కలిసి ఇంగ్లాండ్కు వెళ్లారు. ఐపీఎల్ 16వ సీజన్లో యశస్వి జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి సత్తాచాటిన విషయం తెలిసిందే.
14/24
గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా స్టేడియంలో స్కూటీ నడుపుతున్న ఫొటోను ‘జీటీ’ తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది. మరోసారి ఐపీఎల్ 2023 ఫైనల్స్కు వెళ్తున్నట్లు తెలుపుతూ పోస్టు పెట్టింది. ఆదివారం వర్షం కారణంగా చెన్నై, గుజరాత్ జట్ల మధ్య వాయిదా పడిన ఫైనల్ మ్యాచ్ సోమవారం జరగనుంది.
15/24
సికింద్రాబాద్లోని జాహ్నవి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు నృత్య ప్రదర్శన, ర్యాంప్ వాక్తో ఆకట్టుకున్నారు.
16/24
ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిది సంవత్సరాల పాలనలో జరిగిన అభివృద్ధిపై రూపొందించిన పుస్తకాన్ని హైదరాబాద్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
17/24
సినీనటుడు ఎన్టీఆర్ జిమ్లో కసరత్తులు చేస్తున్న ఫొటోను పలువురు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ ‘దేవర’ ఫొటో బాగుందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ‘దేవర’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
18/24
ప్రాంతీయ రింగు రోడ్డు అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ భువనగిరి కలెక్టర్ కార్యాలయం ధర్నాచౌక్ వద్ద బాధిత రైతులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వారికి మద్దతు పలుకుతూ ప్రజాగాయకుడు గద్దర్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
19/24
‘మహానాడు’లో పాల్గొని రాజమహేంద్రవరం నుంచి బయలుదేరిన తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడిని ఎయిర్పోర్టులో గోదావరి జిల్లాల తెదేపా ముఖ్యనేతలు కలిశారు. ఈ సందర్భంగా ‘మహానాడు’ విజయానికి సహకరించిన నేతలకు చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు.
20/24
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ రోజు ఉదయం బెంగళూరులో కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారని.. అందుకు తగిన ప్రతిఫలం దక్కిందని డీకేను అభినందించారు.
21/24
నూతన సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
22/24
రామ్ పోతినేని, రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పండగ చేస్కో. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ బ్యానర్పై పరుచూరి కిరీటి నిర్మించారు. ఈ చిత్రం విడుదలై నేటికి 8 ఏళ్లు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన పోస్టర్ను చిత్రబృందం ట్విటర్ వేదికగా పోస్టు చేసింది.
23/24
సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి మరో రాకెట్ ప్రయోగం జరిగింది. ఉదయం 10.42 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్12 వాహకనౌక ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లింది.
24/24
పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రో’. ఈ సినిమాను జులై 28న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. దీనికి సంబంధించిన పోస్టర్ను సాయిధరమ్తేజ్ ట్విటర్లో పోస్టు చేశారు.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇన్ఫీ లాభం 30 శాతం జంప్.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?