News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (03-06-2023)
Updated : 03 Jun 2023 12:29 IST
1/19
సింగరేణి గనుల్లో కార్మికుల విధులకు శిల్పరూపం ఇస్తూ గోదావరిఖని ఫ్లైవింక్లయిన్ కూడలిలో ఏర్పాటు చేసిన విగ్రహాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి.
2/19
మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలానికి చెందిన మంతటి ఓం ప్రకాష్ అనే వ్యక్తి 70 సుద్దముక్కలతో 15 రోజులు రాష్ట్ర సచివాలయ భవన సమూహాన్ని, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనాన్ని 10 రోజుల పాటు రూపొందించారు.
3/19
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని కాకర్లపల్లి రోడ్డులో వందేళ్ల చరిత్ర కలిగిన రావి చెట్టు నీడనిస్తూ కాలనీ వాసుల పూజలందుకుంటోంది. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఈ వృక్షం చుట్టూ దాతల సాయంతో కాంక్రిటు స్లాబ్ వేసి గుడిగా తీర్చిదిద్దుతున్నారు.
4/19
కొందరు యువకులు వారి అభిరుచులకు అనుగుణంగా 25 థీమ్స్తో చిన్న ఫిల్మ్ సిటీలను నెలకొల్పి అందుబాటులోకి తెచ్చారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో ఏడాది కిందట దీన్ని ప్రారంభించారు. ఫ్రీ, పోస్టు వెడ్డింగ్, మెటర్నిటీ, బేబీ షూట్స్ నిర్వహించేలా సౌకర్యాలు కల్పించారు.
5/19
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం మాళాపురం గ్రామంలో తాగునీటి ఎద్దడి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ చిత్రాలే నిదర్శనం. గొంతు తడుపుకొనేందుకు ప్రజలు నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది.
6/19
నిరుపయోగ రైలు విడి భాగాలతో తయారు చేసిన జిరాఫీ, నెమలి, పిల్లి నమూనాలు నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. తిరుపతి రైల్వేస్టేషన్ గ్యారేజీ ముందు ఆర్సీరోడ్డులో వీటిని ఏర్పాటు చేశారు.
7/19
తిరుపతి జిల్లాలోని తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం రాత్రి అమ్మవారు తెప్పపై ఊరేగుతూ భక్తులకు సాక్షాత్కరించారు.
8/19
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా.. నల్గొండలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. వాటి నిర్వహణ లేక మొక్క దశలోనే ఎండిపోతున్నాయి.
9/19
తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకల్లో భాగంగాచిన్నారుల నృత్య ప్రదర్శన గద్వాల, వనపర్తి, మహబూబ్నగర్
10/19
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లాలోని మధిర పెద్ద చెరువులో స్విమ్మర్లు ఈతకొడుతూ జాతీయ జెండాకు శుక్రవారం గౌరవ వందనం సమర్పించారు.
11/19
ఖమ్మం జిల్లాలోని పాల్వంచ-ములకలపల్లి ప్రధాన రహదారిపై కుంటినాగులగూడెం వద్ద ఇరువైపులా గతంలో చెట్లు కొద్దిరోజుల క్రితం ఎండిపోయి కనిపించాయి. ఇప్పుడవి పచ్చదనాన్ని సంతరించుకుని కళకళలాడుతూ కనిపించాయి.
12/19
ఖమ్మం: భద్రాచలం ఏరియా నుంచి ఖమ్మం మార్కెట్కు వెళ్తున్న ఓ మిర్చి లోడు వాహనంపై రైతులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. పాల్వంచ మండలం నాగారంకాలనీ ఆర్టీఏ చెక్పోస్టు వద్ద కనిపించిన ఈ దృశ్యాన్ని ‘న్యూస్టుడే’ కెమెరా క్లిక్మనిపించింది.
13/19
గద్వాల పైవంతెన నుంచి అయిజకు వెళ్లే ప్రధానరహదారి అధ్వానంగా మారింది. గుంతలు, కంకరతేలిన రోడ్డుపై వాహనాల రాకపోకలతో దుమ్ము లేస్తోంది. దారి స్పష్టంగా కనిపించని స్థాయిలో ఉంటోంది.
14/19
హైదరాబాద్లోని రాజ్భవన్లో జరిగిన తెలంగాణ రాష్ట్రావతరణ ఉత్సవాల్లో కళాకారిణులతో కలిసి నృత్యం చేస్తున్న గవర్నర్ తమిళిసై
15/19
తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకల్లో భాగంగా హైదరాబాద్లోని హైకోర్టులో పేరిణి నృత్యాన్ని ప్రదర్శిస్తున్న కళాకారులు.
16/19
మధ్యప్రదేశ్లోని రత్లాంకు చెందిన సుభాష్ చంద్రసోని, అతని కుటుంబసభ్యులు శ్రీవారి భక్తులు. స్వామివారిపై విశ్వాసంతో వారు ధరించే ప్రతి ఆభరణంలోనూ శ్రీవారి రూపం ఉండేలా చూసుకుంటారు. మెడలో శ్రీవారి ప్రతిమ బంగారు లాకెట్లు వేసుకొని తిరుగుతుంటే భక్తులంతా ఆసక్తిగా చూశారు.
17/19
హైదరాబాద్: భానుడి భగభగలతో శుక్రవారం మధ్యాహ్నం హబ్సిగూడ ప్రధాన రహదారి నిర్మానుష్యంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే చౌరస్తాలు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి.
18/19
ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం మహారాష్ట్రలోని నాగ్పుర్లో నిర్వహించిన ఊరేగింపులో పాల్గొన్న ప్రజలు
19/19
ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం గుజరాత్లోని సూరత్లో సైకిల్ ఆకారంలో నిల్చున్న స్వామినారాయణ గురుకుల ప్రాంగణం విద్యార్థులు
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి