News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (03-06-2023)
Updated : 03 Jun 2023 22:02 IST
1/33
హైదరాబాద్లోని మల్కాజిగిరిలో అర్నిత ఇన్స్టిట్యూట్ ఆప్ ఫ్యాషన్ డిజైన్ యాన్యువల్ గ్రాడ్యుయేషన్ షో నిర్వహించారు. ఎలిగాన్స్ -2023 థీమ్తో ఏర్పాటు చేసిన ఈవెంట్లో అందాల సుందరీమణులు ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు.
2/33
జమ్ములో తితిదే ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ మహా సంప్రోక్షణను తిరుమలలో నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు.
3/33
మంత్రి హరీశ్రావు పుట్టినరోజు సందర్భంగా శనివారం మంత్రి మహమూద్ అలీ ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
4/33
ఇంగ్లాండ్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జూన్7 నుంచి మొదలవనుంది. స్టార్ స్పోర్ట్స్లో ఈ మ్యాచ్ ప్రసారం కానున్న సందర్భంగా మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా పోస్టర్తో కూడిన కోహ్లీ ఫొటోను ఛానెల్ ట్విటర్లో పంచుకుంది. ‘ఈ మ్యాచ్లో కోహ్లీ రప్ఫాడిస్తాడా?’ అని ట్వీట్ చేసింది.
5/33
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్ వెళ్లిన యశస్వి జైస్వాల్, అశ్విన్ కలిసి ఫొటో తీసుకున్నారు. ఈ ఫొటోను తన ఇన్స్టా ఖాతాలో పంచుకున్న అశ్విన్.. చిన్న పైయన్(చిన్న బాలుడు) అని పోస్టు పెట్టారు.
6/33
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రయాణికులతో నిండిపోయింది. ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండటంతో అక్కడ రద్దీ నెలకొంది.
7/33
సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం పథకం ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని తెలుపుతూ ఎంపీ సంతోష్కుమార్ ఈ ఫొటోను ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా అప్పనపల్లి గ్రామంలోని కేసీఆర్ అర్బన్ పార్కులో శనివారం చిరుత కనిపించిందని ఆయన తెలిపారు.
8/33
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లో ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డ్స్ వేడుకను ఘనంగా నిర్వహించారు. సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్, తదితరులను ఘనంగా సత్కరించారు.
9/33
తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు శనివారం మలయప్పస్వామి ముత్యపు కవచంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఉత్సవమూర్తిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు.
10/33
ప్రముఖ సినీనటుడు చిరంజీవి హైదరాబాద్ నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్లో క్యాన్సర్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి వైద్య సిబ్బందితో సరదాగా ముచ్చటించారు.
11/33
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా మూడు చింతలపల్లిలో నిర్వహించిన సంబరాల్లో మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్ చేసి అలరించారు. అంతకుముందు భారాస నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.
12/33
శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీకి చెందిన పలువురు శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. గురుద్వారాలకు సంబంధించిన వివిధ సమస్యలను ఆయనకు వివరించారు.
13/33
కరీంనగర్లో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. వాతావరణం చల్లగా మారడంతో ఎండల వేడి నుంచి ప్రజలు ఉపశమనం పొందారు.
14/33
ఒడిశాలోని బాలేశ్వర్లో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ సందర్భంగా అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. దీంతో ఏలూరు రైల్వే స్టేషన్లో ఇలా ప్రయాణికుల రద్దీ నెలకొంది.
15/33
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, అందుతున్న సహాయక చర్యలపై ఆయన ఆరా తీశారు.
16/33
ముంబయిలో వట పూర్ణిమ పండగను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మర్రిచెట్టుకు ఇలా దారం చుట్టి పూజించారు.
17/33
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను సత్తుపల్లిలో ఘనంగా నిర్వహించారు. రైతు దినోత్సవం సందర్భంగా భారాస నాయకులు 250 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టి రైతు సంక్షేమ పథకాలను గురించి కొనియాడారు.
18/33
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కాశీ విశ్వనాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి దర్శనంతో మనసుకు ప్రశాంతత లభించిందని ఆయన తెలిపారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ను అభివృద్ధి చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
19/33
స్పైనోసారస్ అస్థిపంజరాన్ని చికాగోలోని ఫీల్డ్ మ్యూజియంలో ప్రదర్శించారు. 46 అడుగుల పొడవుతో ఉన్న ఈ అస్థిపంజరం చూపరులను ఆకట్టుకుంటోంది.
20/33
ఒడిశాలో మహా విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 278 మంది మృతి చెందారు. ఘటనానంతరం కనిపించిన దృశ్యం ఇది.
21/33
జపాన్లోని టోయోకావా, ఐచి ప్రిఫెక్చర్లలో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. దీంతో కార్లు, ఇతర వాహనాలు వరద నీటిలో నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల్లోని ప్రజలు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు.
22/33
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారతదేశ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఆయన భారత్ ఎప్పుడు వచ్చారు అని ఆలోచిస్తున్నారా? అదేం లేదండి.. ఏఐ సృష్టించిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
23/33
సినీనటుడు అడివి శేష్.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులను కలిసి ముచ్చటించారు. అడివి శేష్ ప్రధాన పాత్రలో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ సినిమా గతేడాది విడుదలై విజయం సాధించింది.
24/33
తెలంగాణ రైతు దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలం పద్మాజివాడి రైతు వేదికను స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. కార్యక్రమానికి ఆమె ఎడ్లబండిపై వచ్చి భారాస శ్రేణుల్లో జోష్ నింపారు.
25/33
అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ల వివాహ వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా వారి కుమార్తె శ్వేతా బచ్చన్ ఇన్స్టా వేదికగా తల్లిదండ్రులు గతంలో దిగిన ఫొటోను పంచుకున్నారు. ఇన్నేళ్లు బంధాన్ని విజయవంతంగా కొనసాగించడానికి రహస్యమేంటని తాను తల్లిని ప్రశ్నించగా.. ప్రేమ అని ఆమె బదులిచ్చినట్లు చెబుతూ శ్వేత పోస్టు పెట్టారు.
26/33
రైతు దినోత్సవం, మంత్రి హరీశ్రావు పుట్టిన రోజు నేపథ్యంలో సిద్ధిపేట పత్తి మార్కెట్యార్డులో ధాన్యంతో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు చిత్రాలను తీర్చిదిద్దారు.
27/33
భారత క్రీడాకారులు రోహిత్శర్మ, విరాట్ కోహ్లీ నూతన టెస్టు జెర్సీల్లో కనిపించారు. ఈ నెల 7 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత క్రీడాకారులు ఈ జెర్సీలను వినియోగించనున్నారు.
28/33
హైదరాబాద్ ఐటీసీ కోహినూర్లో నిర్వహించిన గ్లోబల్ వ్యాక్సిన్ కొల్బరేటివ్ జీ20 సదస్సుకు హాజరైన కేంద్ర మంత్రి మనసుఖ్ మాండవీయ, అధికారులు అపర్ణ, జయేశ్రంజన్, యువరాజ్ తదితరులు
29/33
జనసేన అధినేత పవన్కల్యాణ్ జూన్ 14 నుంచి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర ప్రారంభించబోతున్నారు. అన్నవరం నుంచి భీమవరం వరకు వారాహి యాత్ర రూట్మ్యాప్ను జనసేన పార్టీ ట్విటర్లో షేర్ చేసింది.
30/33
ప్రపంచ సైకిల్ డే సందర్భంగా శనివారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నుంచి సైకిల్ రైడ్ను ప్రారంభించారు. కార్యక్రరమంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్తో పాటు నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
31/33
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు సంతపేట కూడలిలో చంద్రబాబు నాయుడి చిత్రపటానికి తెదేపా బీసీ నాయకులు, కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు. పార్టీ మేనిఫెస్టోలో బీసీలకు ప్రాధాన్యం కల్పించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు.
32/33
ఒడిశాలో మాటలకందని మహా విషాదం చోటుచేసుకుంది. బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం అనూహ్య రీతిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వందల మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. 900 మందికి పైగా గాయాలపాలయ్యారు.
33/33
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఆఫ్ లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలకు అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు