Srisailam : రావణ వాహనంపై విహరించిన పార్వతీపరమేశ్వరులు

ఇల కైలాసం శ్రీశైల మహాక్షేత్రంలో దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీభ్రమరాంబాదేవి బుధవారం భక్తులకు చంద్రఘంట అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై చంద్రఘంటదేవిని కొలువుదీర్చి మంగళహారతులతో పూజలు నిర్వహించారు. అనంతరం అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీస్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను రావణ వాహనంపై వేంచేపు చేశారు. పార్వతీ పరమేశ్వరులు అభయహస్త దీవెనలిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.   

Updated : 29 Sep 2022 09:31 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని