News in Pics: చిత్రం చెప్పే సంగతులు-02(1-02-2023)
Updated : 01 Feb 2023 20:29 IST
1/21
తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కొత్త చిత్రం ‘దళపతి 67 (వర్కింగ్ టైటిల్)’ లాంఛనంగా పట్టాలెక్కింది. ఈ సినిమా చిత్రీకరణ బుధవారం పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. త్రిష, సంజయ్దత్, అర్జున్ తదితర భారీ తారాగణంతో ఈ సినిమా రూపొందనుంది.
2/21
3/21
‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని ప్రగతినగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆధునికీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవం కార్యక్రమానికి మంత్రి హారీశ్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిజిటల్ క్లాస్ రూమ్ను పరిశీలించిన ఆయన.. విద్యార్థులతో కలిసి పాఠాలు విన్నారు..
4/21
కల్యాణ్రామ్ హీరోగా రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అమిగోస్’. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అమిగోస్’ ట్రైలర్ను ఈ నెల 3న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
5/21
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ సీఎం క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
6/21
అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం రథోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
7/21
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి సముద్ర స్నానాలు ఆచరించారు.
8/21
హైదరాబాద్లోని కొంపల్లిలో బుధవారం ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి కుమార్తె వివాహ వేడుక నిర్వహించారు. కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
9/21
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో బుధవారం సమ్మక్క సారలమ్మ చిన్న జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
10/21
దర్శకుడు వెంకీ అట్లూరి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పూజాతో ఆయన ఏడడుగులు వేశారు. బుధవారం ఉదయం హైదరాబాద్లో జరిగిన వీరి వివాహానికి సినీ నటులు నితిన్, కీర్తి సురేశ్ తదితరులు హాజరయ్యారు.
11/21
వధూవరులతో సెల్ఫీ తీసుకుంటున్న కీర్తి సురేశ్, నితిన్ తదితరులు
12/21
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటలో తొలి కేజీ టు పీజీ విద్యా సంస్థల సముదాయాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం చేయడంతో పాటు వారి బాగోగులను తెలుసుకున్నారు.
13/21
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందానికి చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పరిపూర్ణ జీవితం ఇలాగే బ్రహ్మానందకరంగా సాగాలని ఆకాంక్షించారు.
14/21
హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ నగల దుకాణం ప్రారంభోత్సవంలో సినీనటి రాశీసింగ్, మోడల్ శ్రీలేఖ పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా వారు నూతన డిజైన్ల ఆభరణాలతో ఫొటోలకు పోజులిచ్చారు..
15/21
పారంభోత్సవంలో పాల్గొన్న మోడల్ శ్రీలేఖ
16/21
‘పాప్కార్న్’ చిత్రబృందం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంది. సాయి రోనంకి, అవికాగోర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 10న ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రానికి మురళి దర్శకత్వం వహించారు.
17/21
సినీ నటులు మెహరీన్, సుడిగాలి సుధీర్ తిరుమల శ్రీవారిని వేర్వేరుగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
18/21
ఓల్డ్ ఆల్వాల్లోని అయాన్ డిజిటల్ సెంటర్ వద్ద జేఈఈ పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు.
19/21
అగ్ర కథానాయిక సమంత కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. రాజ్ అండ్ డీకే కాంబోలో రానున్న ‘సిటాడెల్’ సిరీస్ కోసం ఆమె రంగంలోకి దిగారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా అమెజాన్ ప్రైమ్ సామ్ లుక్ని షేర్ చేసింది. ‘‘ది మిషన్ ఈజ్ ఆన్ ఫైర్. సిటాడెల్ ఇండియన్ వెర్షన్ను మేము మొదలుపెట్టేశాం’’ అని పేర్కొంది. వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
20/21
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మ, కూతురు వామికలతో కలిసి టూర్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వామికను భుజాలపై ఎక్కించుకుని, అనుష్కతో కలిసి ట్రెక్కింగ్ చేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
21/21
2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర పద్దును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ట్యాబ్తో నిర్మలమ్మ బృందం ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్కు చేరుకుంది. ప్రొటోకాల్ ప్రకారం దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్మును కలిసిన ఆర్థిక మంత్రి బృందం.. బడ్జెట్ గురించి రాష్ట్రపతికి వివరించారు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?