
తాజా వార్తలు
ఆస్ట్రేలియా అభిమానులకు చేదు వార్త..
సిడ్నీ: వరుసగా రెండు వన్డేల్లో టీమ్ఇండియాపై అర్ధశతకాలతో రాణించిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా మిగిలిన పరిమిత ఓవర్ల మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆదివారం రెండో వన్డే సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ అతడు గాయపడిన సంగతి తెలిసిందే. తొడ కండరాల్లో నొప్పితో మైదానంలోనే విలవిల్లాడడంతో వెంటనే స్పందించిన ఆస్ట్రేలియా జట్టు వైద్య బృందం వార్నర్ను బయటకు తీసుకెళ్లింది. అనంతరం వైద్య పరీక్షలు చేయగా తీవ్రగాయమైనట్లు తేలింది. దీంతో అతడు మూడో వన్డేతో పాటు తర్వాత ఆడాల్సిన మూడు టీ20ల సిరీస్కు అందుబాటులో ఉండడని కోచ్ జస్టిన్ లాంగర్ పేర్కొన్నట్లు ఐసీసీ ట్వీట్ చేసింది.
వార్నర్ స్థానాన్ని జాన్ మాథ్యూ షార్ట్ భర్తీ చేస్తాడని లాంగర్ పేర్కొన్నాడు. అలాగే తమ జట్టు ఇప్పటికే వన్డే సిరీస్ గెలుపొందడంతో.. టెస్టు సిరీస్కు ముందు ప్రధాన పేసర్ పాట్ కమిన్స్కు కూడా విశ్రాంతి ఇవ్వాలనుకున్నట్లు ఆసీస్ కోచ్ తెలిపాడు. అయితే, అతడికి ప్రత్యామ్నాయ ఆటగాడిని మాత్రం వెల్లడించలేదు. వార్నర్, కమిన్స్ తమకు కీలక ఆటగాళ్లని, రాబోయే టెస్టు సిరీస్లో వాళ్లు రాణించాలంటే తగినంత విశ్రాంతి అవసరమని చెప్పాడు. డిసెంబర్ 17 నుంచి టీమ్ఇండియాతో ప్రారంభమయ్యే 4 టెస్టుల సిరీస్ తమకెంతో ముఖ్యమని అన్నాడు. ఆ సిరీస్లో సత్తా చాటాలని అనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా, టీమ్ఇండియా తొలి రెండు వన్డేల్లో విఫలమవగా బుధవారం మూడో వన్డేలో తలపడనుంది. ఈ మ్యాచ్లోనైనా విజయం సాదించి వన్డే సిరీస్కు ముగింపు పలకాలని చూస్తోంది. మరి ఓపెనర్గా వార్నర్ లేకపోవడం కలిసొచ్చే అంశమైనా ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్న సంగతి తెలిసిందే.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- వైట్హౌస్లో విచిత్ర పెంపుడు జంతువులు!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- ఇక చాలు
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- సాహో భారత్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
