
తాజా వార్తలు
మూడో రోజు: భోజన విరామానికి భారత్ 161/4
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు మూడో రోజు తొలి సెషన్లో టీమ్ఇండియా భోజన విరామ సమయానికి 161/4తో నిలిచింది. 62/2 ఓవర్నైట్ స్కోర్తో ఆదివారం ఆట కొనసాగించిన భారత్ ఈ సెషన్లో రెండు వికెట్లు కోల్పోయి మరో 99 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్(38*), రిషభ్ పంత్(4*) క్రీజులో ఉన్నారు. అంతకుముందు కెప్టెన్ అజింక్య రహానె(37; 93 బంతుల్లో 3x4) మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఔటయ్యాడు. మూడో స్లిప్లో వేడ్ చేతికి చిక్కడంతో భారత్ 144 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఇక సీనియర్ బ్యాట్స్మన్ ఛెతేశ్వర్ పుజారా(25; 94 బంతుల్లో 2x4) హేజిల్వుడ్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. శనివారం రోహిత్(44), శుభ్మన్గిల్(7) పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి..
సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్