
తాజా వార్తలు
ఐపీఎల్ వేలం తేదీ ఖరారు
ఇంటర్నెట్డెస్క్: క్రికెట్ అభిమానులకు శుభవార్త. ‘ఐపీఎల్ వేలం-2021’ తేదీ ఖరారైంది. చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న వేలం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ‘అలర్ట్.. ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం. వేదిక: చెన్నై’ అని ట్వీట్ చేసింది. కాగా, ఈ వేలంలో అత్యధిక సొమ్ముతో పంజాబ్ బరిలోకి దిగనుంది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ వద్ద రూ. 53.2 కోట్లు ఉన్నాయి.
కాగా, బెంగళూరు వద్ద (రూ.35.7 కోట్లు), రాజస్థాన్ (రూ.34.85 కోట్లు), చెన్నై (రూ.22.9 కోట్లు), ముంబయి (రూ.15.35 కోట్లు), దిల్లీ (12.8 కోట్లు), కోల్కతా (రూ.10.85 కోట్లు), సన్రైజర్స్ (రూ.10.75 కోట్లు) ఉన్నాయి. అయితే ఇటీవల ఫ్రాంచైజీల వదులుకున్న ఆటగాళ్లలో ఆస్ట్రేలియా ప్లేయర్లు మాక్స్వెల్, స్టీవ్ స్మిత్పై అందరి చూపు కేంద్రీకృతమైంది. ఏ ఫ్రాంచైజీ వారిద్దరిని సొంతం చేసుకుంటుందనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. స్మిత్ను రాజస్థాన్, మాక్సీని పంజాబ్ వదులుకున్న సంగతి తెలిసిందే. అంతేగాక ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సత్తాచాటిన ఆటగాళ్లకు వేలంలో మంచి డిమాండ్ ఉండనుంది.
ఇవీ చదవండి
వాళ్లను గుర్తించలేకపోయాం: క్రికెట్ ఆస్ట్రేలియా
రూట్.. రైట్ రైట్! కోహ్లీ ఆపగలడా?