
తాజా వార్తలు
ఇది గెలిస్తే.. సిరీస్ గెలుస్తాం: ఆర్చర్
భారత్తో టెస్టు సిరీస్పై ఇంగ్లాండ్ పేసర్
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియాతో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ను ఇంగ్లాండ్ గెలుస్తుందనే నమ్మకం ఉందని ఆ జట్టు పేసర్ జోఫ్రా ఆర్చర్ ధీమా వ్యక్తం చేశాడు. అలా జరగాలంటే మూడో టెస్టులో తాము గెలవడం కీలకమని చెప్పాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన అతడు ఈ టెస్టు సిరీస్పై, పింక్బాల్ బంతిపై.. తన అభిప్రాయాలు వెల్లడించాడు. ఇప్పటికే 1-1తో నిలిచిన సిరీస్ను ఇంగ్లాండ్ సొంతం చేసుకుంటుందా? అని అడిగిన ప్రశ్నకు తప్పకుండా గెలుస్తామని ఆర్చర్ బదులిచ్చాడు.
‘మేం తప్పకుండా గెలుస్తాం. అయితే, అంతకన్నా ముందు మూడో టెస్టులో విజయం సాధించడం ముఖ్యం. ఇది గెలిస్తే నాలుగో మ్యాచ్ను డ్రా చేసుకుంటాం. మేం ఎప్పుడూ గెలవాలనే ఆడతాం. కానీ రాబోయే టెస్టు అత్యంత కీలకం. ఇది గెలిస్తే చివరి టెస్టును కోల్పోకుండా చూసుకుంటాం’ అని ఆర్చర్ వివరించాడు. అనంతరం పింక్బాల్పై మాట్లాడుతూ.. ‘నిజం చెప్పాలంటే ఈ బంతి కూడా సాధారణ బంతిలాగే ఉంటుంది. పింక్ బంతితోనూ ఇంతకుముందు పలుమార్లు బౌలింగ్ చేశా’ అని ఇంగ్లాండ్ పేసర్ చెప్పుకొచ్చాడు.