
తాజా వార్తలు
నటరాజన్కు రెండు వికెట్లు
గబ్బా: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్ఇండియా పేసర్ నటరాజన్ స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు తీశాడు. తొలుత జట్టు స్కోర్ 200 వద్ద మాథ్యూవేడ్(45; 87 బంతుల్లో 6x4)ను ఔట్ చేసిన అతడు కాసేపటికే మార్నస్ లబుషేన్(108; 204 బంతుల్లో 9x4)ను పెవిలియన్ పంపాడు. దీంతో ఆస్ట్రేలియా 213 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం గ్రీన్, టిమ్పైన్ క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా 67 ఓవర్లకు 213/5తో కొనసాగుతోంది.
అంతకుముందు ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే డేవిడ్ వార్నర్(1) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన లబుషేన్.. స్మిత్(36)తో కలిసి మూడో వికెట్కు 70 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. ఇక రెండో సెషన్లో స్మిత్ ఔటయ్యాక.. వేడ్(45; 87 బంతుల్లో 6x4)తో జోడీ కట్టి 113 పరుగుల శతక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే సిరాజ్ వేసిన 63వ ఓవర్ చివరి బంతికి 4 పరుగులు చేసి లబుషేన్ టెస్టుల్లో 5వ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, 50 పరుగుల లోపే అతడు రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రహానె ఒక క్యాచ్ వదలగా, రెండోసారి పుజారా స్లిప్లో అందుకోలేకపోయాడు.