
తాజా వార్తలు
టీమ్ఇండియా ఐదో వికెట్
బ్రిస్బేన్: టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో ఐదో వికెట్ కోల్పోయింది. భోజన విరామం తర్వాత తొలి ఓవర్లోనే మయాంక్ అగర్వాల్(38; 75 బంతుల్లో 3x4, 1x6) ఔటయ్యాడు. హేజిల్వుడ్ వేసిన 60.2 ఓవర్కు స్లిప్లో స్టీవ్స్మిత్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 161 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో రిషభ్పంత్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. 62 ఓవర్లకు టీమ్ఇండియా స్కోర్ 165/5గా నమోదు కాగా ఇంకా 204 పరుగుల వెనుకంజలో ఉంది.
అంతకుముందు 62/2 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ తొలి సెషన్లో రెండు వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే పుజారా(25) హేజిల్వుడ్ బౌలింగ్లో కీపర్కు చిక్కగా, తర్వాత అజింక్య రహానె(37) మిచెల్ స్టార్క్ బౌలింగ్లో వేడ్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ భోజన విరామ సమయానికి 161/4 స్కోర్ సాధించింది.
ఇవీ చదవండి..
సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్