
తాజా వార్తలు
రోహిత్ కెరీర్లోనే అత్యుత్తమ టెస్టు ర్యాంక్..
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టు కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. ఆదివారం ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్లో అతడు ఆరు స్థానాలు మెరుగుపర్చుకొని 8వ ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్లో రోహిత్ ఒక భారీ శతకంతో పాటు ఒక అర్ధ శతకం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సిరీస్లో హిట్మ్యాన్ మూడు టెస్టుల్లో 298 పరుగులు చేసి భారత్ తరఫున బాగా ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజా టెస్టు ర్యాంకింగ్స్లో కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంక్ నమోదు చేశాడు.
మరోవైపు సీనియర్ బ్యాట్స్మెన్ చెతేశ్వర్ పుజారా ఈ సిరీస్లో పెద్దగా రాణించకపోవడంతో రెండు స్థానాలు దిగజారి పదో ర్యాంక్తో సరిపెట్టుకున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదో ర్యాంక్లోనే కొనసాగుతుండగా, కేన్ విలియమ్సన్, స్టీవ్స్మిత్, మార్నస్ లబుషేన్, జోరూట్ వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని మూడో ర్యాంక్ సాధించాడు. పాట్ కమిన్స్, నీల్ వాగ్నర్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక పింక్బాల్ టెస్టులో 400 వికెట్ల మైలురాయి అందుకున్న అశ్విన్ బౌలర్ల జాబితాలో టాప్ 10లో చోటు దక్కించుకున్న ఏకైక స్పిన్నర్గా నిలిచాడు. యువ స్పిన్నర్ అక్షర్పటేల్ 38వ ర్యాంక్ సాధించాడు.