
తాజా వార్తలు
గబ్బా టెస్టు: రెండో వికెట్ కోల్పోయిన భారత్
బ్రిస్బేన్: బోర్డర్-గావస్కర్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. నాథన్ లైయన్ బౌలింగ్లో శుభ్మన్గిల్(91) ఔటయ్యాడు. 48వ ఓవర్ చివరి బంతికి స్లిప్లో స్టీవ్స్మిత్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 132 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అంతకుముందు పుజారా(26*)తో కలిసి గిల్ రెండో వికెట్కు 114 పరుగుల కీలక భాగస్వామ్యం జోడించాడు. క్రీజులోకి రహానె రాగా తర్వాతి ఓవర్లో హేజిల్వుడ్ బౌలింగ్లో పుజారా గాయపడ్డాడు. అప్పటికి టీమ్ఇండియా స్కోర్ 132/2గా నమోదైంది.
ఇవీ చదవండి..
స్మిత్ చూస్తుండగానే రోహిత్ షాడో బ్యాటింగ్
సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
Tags :