
తాజా వార్తలు
వాహ్ అజహరుద్దీన్.. నువ్వెంతో గ్రేట్: సెహ్వాగ్
ఇంటర్నెట్డెస్క్: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో భాగంగా ముంబయితో తలపడిన మ్యాచ్లో కేరళ బ్యాట్స్మన్ మహ్మద్ అజహరుద్దీన్(137*; 54 బంతుల్లో 9x4, 11x6) విధ్వంసక శతకం బాదాడు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో కేవలం 37 బంతుల్లోనే శతకం సాధించి భారత్ తరఫున పొట్టి క్రికెట్లో రెండో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. దీంతో అజహరుద్దీన్ బ్యాటింగ్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీమ్ఇండియా మాజీ ఓపెనర్, డాషింగ్ బ్యాట్స్మన్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.
అజహరుద్దీన్ అత్యుత్తమ ఆటగాడని కొనియాడాడు. ముంబయి లాంటి గొప్ప జట్టుపై ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం సాధారణ విషయం కాదన్నాడు. ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించాడని మెచ్చుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ చూసి సంతోషించానని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. అనంతరం అజహరుద్దీన్ చెలరేగడంతో కేరళ 2 వికెట్లు కోల్పోయి 15.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఇదిలా ఉండగా, బుధవారమే ఇంకో మ్యాచ్లో మేఘాలయ ఆటగాడు పునీత్ బిష్ఠ్(146*; 51 బంతుల్లో 17x6) కూడా విధ్వంసక శతకం సాధించాడు. మిజోరాంతో తలపడిన మ్యాచ్లో తొలుత మేఘాలయా 230 పరుగులు చేసింది. అనంతరం మిజోరాం 100 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి భారీ ఓటమి చవి చవిచూసింది.
ఇవీ చదవండి..
రెండో రౌండ్లో ఓడిన సాత్విక్, చిరాగ్
ఇంగ్లాండ్ ఆటగాడికి యూకే స్ట్రెయిన్ వైరస్
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్హౌస్లో విచిత్ర పెంపుడు జంతువులు!
- అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- వైట్హౌస్ను వీడిన ట్రంప్ దంపతులు
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- కష్టాల కడలిలోంచి.. శ్వేతసౌధాన్ని అధిరోహించి
- మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
