
ప్రధానాంశాలు
విశ్రాంతి తర్వాత టీమ్ఇండియాపై గర్జిస్తా
లండన్: టీమ్ఇండియాతో తొలి రెండు టెస్టులకు దూరమవ్వడం కాస్త బాధాకరమేనని ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్స్టో అన్నాడు. విశ్రాంతి తర్వాత పునరాగమనంలో గర్జిస్తానని పేర్కొన్నాడు. సమయం చిక్కడం లేదు కాబట్టే ఇప్పుడు విరామం తీసుకున్నానని వెల్లడించాడు. అతడికి విశ్రాంతినివ్వడంతో సెలక్టర్లపై మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, కెవిన్ పీటర్సన్ తదితరులు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.
‘ఇప్పుడు ఇవ్వకపోతే ఇంకెప్పుడు వాళ్లు నాకు విశ్రాంతినిస్తారు. ప్రస్తుత ప్రపంచం ఇలాగే ఆలోచిస్తోంది. మూడు ఫార్మాట్లు ఆడుతున్న ఆటగాడు సిరీస్ సాంతం ఆడుతున్న సందర్భాలు తక్కువ. వేసవి, శీతాకాలంలో సుదీర్ఘంగా క్రికెట్ జరిగింది. అన్నింటా ఆడలేం కదా. బయో బుడగ నుంచి బయటకెళ్లి కుటుంబ సభ్యులను చూడాల్సిన అవసరం ఉంది. విశ్రాంతి తర్వాత నేను రెచ్చిపోతాను’ అని స్టో అన్నాడు.
‘ఇంగ్లాండ్ టెస్టు జట్టులోకి తిరిగి రావడం సంతోషం కలిగించింది. శ్రీలంకపై విజయం తర్వాత డ్రస్సింగ్ రూమ్లోకి ప్రవేశించాక భావోద్వేగానికి గురయ్యాను. భారీ స్కోర్లు చేస్తే బాగుండేది. కానీ చేసిన పరుగులతో సంతృప్తిగానే ఉన్నా’ అని బెయిర్స్టో అన్నాడు. ఎరుపు బంతి క్రికెట్ ఆడటం తనకిష్టమని పేర్కొన్నాడు. బయో బుడగల మధ్య ఆడటం కాస్త భిన్నంగా, కష్టంగా ఉందని వెల్లడించాడు.
ఇవీ చదవండి
దాదా కాల్ చేశాడు..క్రెడిట్ ద్రవిడ్కే: రహానె
టీమ్ ఇండియాను ఆయనే బలంగా తయారుచేశాడు..
ప్రధానాంశాలు
సినిమా
- సొంతవాళ్లే నన్ను మోసం చేశారు: రాజేంద్రప్రసాద్
- మాగంటిబాబు కుమారుడి కన్నుమూత
- ఆఫర్ కోసం చిరు, పవన్లకు కాల్ చేశా: కోట
- రెండు సెకన్లకు ఒక ఈ-స్కూటర్!
- తెలుగు హీరోయిన్ కోసం బన్నీ పట్టుబట్టాడు
- ఆచార్య ఫొటో వైరల్.. ఇలియానా బెంగ
- అఫ్రిది అల్లుడవుతున్న షహీన్
- ఆమె నవ్వితే లోకమంతా ఆనందం
- జూమ్కాల్లో భోజనం.. విస్తుపోయిన సొలిసేటర్!
- విశాఖ స్టీల్ప్లాంట్లో రాష్ట్రానికి ఈక్విటీ షేర్ లేదు: కేంద్రం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
