
తాజావార్తలు
ప్రావిడెన్స్ (గయానా): బౌలర్లు రాణించడంతో వెస్టిండీస్పై భారత మహిళా జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా గయానాలో జరిగిన నాలుగో మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో మ్యాచ్ను అంపైర్లు తొమ్మిది ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. భారత బ్యాట్స్ఉమెన్ రాణించలేకపోయారు. పూజ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేసింది. విండీస్ బౌలర్లలో మాథ్యూస్ (3/13) సత్తా చాటింది.
అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్ భారత బౌలర్ల ధాటికి ఐదు వికెట్ల నష్టానికి 45 పరుగులే చేసింది. అంజు (2/8), దీప్తి శర్మ (1/8), రాధ (1/8) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమ్ఇండియా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోగలిగింది. ఫలితంగా హర్మన్ప్రీత్ సేన 5 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది. సిరీస్లో ఇప్పటికే 4-0తో ఆధిక్యంలో నిలిచిన భారత్ చివరి మ్యాచ్ను నవంబర్ 20న ఆడనుంది.