
ప్రధానాంశాలు
భారతి సిమెంట్స్ తరఫు న్యాయవాది
ఈనాడు, హైదరాబాద్: సీఆర్పీసీ ప్రకారం ఒక నేరంపై రెండు విచారణలను కొనసాగించడానికి వీల్లేదని భారతి సిమెంట్స్ తరఫు న్యాయవాది జ్ఞానేంద్రకుమార్ సీబీఐ కోర్టుకు నివేదించారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో నమోదైన కేసుల్లో సీబీఐ కేసు అనంతరం ఈడీ కేసు విచారించాలంటూ దాఖలైన పిటిషన్లపై సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బి.ఆర్.మధుసూదన్రావు విచారించారు. సీబీఐ కేసు విచారణ అనంతరమే ఈడీ కేసు విచారణ చేపట్టాల్సి ఉందని న్యాయవాది జ్ఞానేంద్రకుమార్ ప్రస్తావించారు. సాయిరెడ్డి, జగతి తరఫు న్యాయవాదుల వాదనలనే అన్వయించుకుంటున్నట్లు మరో నిందితుడైన ఐఏఎస్ అధికారి బి.పి.ఆచార్య తరఫు న్యాయవాది చెప్పారు. మరో మాజీ ఐఏఎస్ అధికారి శామ్యూల్ తరఫు న్యాయవాది గడువు కోరడంతో విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో రాంకీ, జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడులు, వాన్పిక్ కేసుల్లో విచారణ గురువారం జరగనుంది. ఓఎంసీ కేసులో మాజీ ఐఏఎస్ కృపానందం, గాలి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్ అలీఖాన్ వేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణ డిసెంబరు 1కి వాయిదా పడింది.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- ఇన్కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- కంగారూను పట్టలేక..
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- సస్పెన్స్కు తెరదించిన శతాబ్ది రాయ్
- తమన్నా చీట్: సాయేషా డ్యాన్స్: మంచు కుటుంబం
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- అరెరె షా.. రోహిత్కు కోపం తెప్పించేశావ్గా!
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!