
ఇంటర్ బోర్డు చిన్నచూపు
వాణిజ్య శాస్త్రంలో ఏటా రెండు పుస్తకాలు
పరీక్ష పేపర్ మాత్రం ఒక్కటే
ఈనాడు, హైదరాబాద్: ఉద్యోగ మార్కెట్లో కామర్స్ విద్యార్థులకు డిమాండ్ పెరుగుతున్నా ఇంటర్ బోర్డు మాత్రం ఆ సబ్జెక్టుపై శీతకన్ను వేస్తోంది. కామర్స్ గ్రూపులను బలోపేతం చేయకుండా అశ్రద్ధ వహిస్తోందన్న విమర్శలను నిపుణులు వ్యక్తంచేస్తున్నారు. కామర్స్ విభాగంలో సంప్రదాయ డిగ్రీ చదివినా కొలువులు దొరుకుతాయి. ఇతర ఏ సబ్జెక్టుకూ లేని ప్రత్యేకత అది. ఇంటర్ నుంచే ఆ సబ్జెక్టుకు ప్రాధాన్యమిస్తే విద్యార్థులకు అధిక ప్రయోజనమని అధ్యాపకులు, నిపుణులు చెబుతున్నా బోర్డు పట్టించుకోవడం లేదు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల పాఠ్యప్రణాళికను జాతీయ ప్రవేశ పరీక్షలకు అనుగుణంగా సీబీఎస్ఈతో పోటీగా రూపొందిస్తున్న బోర్డు.. వాణిజ్యశాస్త్రం దగ్గరకు వచ్చేసరికి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. డిమాండ్ను గుర్తించి సీబీఎస్ఈ, ఐసీఎస్సీ బోర్డులు కామర్స్ సబ్జెక్టును మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ మాత్రం కనీస సంస్కరణలు తీసుకురావడం లేదు.
నిపుణుల కమిటీని నియమించి సబ్జెక్టును బలోపేతం చేస్తే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని ఓయూ కామర్స్ విభాగం విశ్రాంత ఆచార్యుడు ఎస్వీ సత్యనారాయణ, గజ్వేల్ డిగ్రీ, పీజీ ప్రభుత్వ కళాశాల సహాయ ఆచార్యుడు గోపాల సుదర్శనం సూచిస్తున్నారు.
* సీఈసీ (పౌర, ఆర్థిక, వాణిజ్యశాస్త్రాలు), ఎంఈసీ (గణితం, ఆర్థిక, వాణిజ్యశాస్త్రాలు) గ్రూపుల్లో కామర్స్ ప్రధాన సబ్జెక్టు. కామర్స్లో వాణిజ్యశాస్త్రంతోపాటు గణకశాస్త్రం(అకౌంటెన్సీ) అనే రెండు పుస్తకాలు ఉంటాయి. ఆ రెండింటికి కలిపి 100మార్కులకు ఒకటే పరీక్ష. ఎంఈసీలో గణితానికి మాత్రం ఒక్కోటి 50 మార్కులకు రెండు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాణిజ్య శాస్త్రానికి కూడా రెండు పరీక్షలు జరపాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం ఛాయిస్ కింద కొన్ని అధ్యాయాలను బోధించడం లేదు. ఆ పరిస్థితికి అడ్డుకట్ట పడుతుంది.
* ఎంపీసీ విద్యార్థులకు ఇచ్చే గణితం ప్రశ్నపత్రాన్నే ఎంఈసీ వారికీ ఇస్తున్నారు. ఎంఈసీ విద్యార్థులు బీకాం/సీఏ కోర్సులు చదువుతారు. వారికి ఎంపీసీ విద్యార్థుల తరహాలో కాకుండా కామర్స్ రంగానికి అవసరమైన కొన్ని అధ్యాయాలనైనా గణితంలో చేరిస్తే ప్రయోజనం ఉంటుంది.
కథనాలు
దేవతార్చన

- పాస్పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బంజారాహిల్స్లో రౌడీషీటర్ దారుణ హత్య
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- ‘నా జీవితంలో అది భయంకరమైన జ్ఞాపకం’
- పాక్పై అక్షింతలు వేసిన అమెరికా
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- గొల్లపూడి తీరని కోరిక..!
- మాది గురుశిష్యుల సంబంధం