...ఆమె రూపంలో అర్చన!

పంచభూత క్షేత్రాలుగా పిలిచే అయిదు శైవక్షేత్రాల్లో జంబుకేశ్వరం ఒకటి. జలలింగ క్షేత్రమైన దీన్ని...

Updated : 30 May 2019 00:08 IST

పంచభూత క్షేత్రాలుగా పిలిచే అయిదు శైవక్షేత్రాల్లో జంబుకేశ్వరం ఒకటి. జలలింగ క్షేత్రమైన దీన్ని తిరువనై కాయ్‌, తిరువనై కావల్‌ అని కూడా పిలుస్తారు. తమిళనాడులో శ్రీరంగానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో స్వామివారికి అమ్మవారే మధ్యాహ్నం పూజలు నిర్వహిస్తారు. దీనికోసం రోజూ మధ్యాహ్నం ఆలయంలోని అర్చకుల్లో ఒకరు స్త్రీ దుస్తులను ధరించి స్వామివారికి పూజలు చేస్తారు. అనంతరం అదే అర్చకుడు గోవును కూడా పూజిస్తారు. ఈ పూజ అనంతరం ఏనుగు గర్భాలయంలోకి ప్రవేశించి జంబుకేశ్వరస్వామిని అభిషేకించి, పూలమాలను సమర్పిస్తుంది. ఇదంతా భక్తులు చూడొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు