..ఏ దోషం రాదు!
ఉప్పు, నూనె, నువ్వులు, కారం చేతికి తీసుకుంటే దోషం వస్తుందంటారు.. నిజమేనా?
ధర్మసందేహం
ఉప్పు, నూనె, నువ్వులు, కారం చేతికి తీసుకుంటే దోషం వస్తుందంటారు.. నిజమేనా?
ఉప్పు, నూనె, నువ్వులు, కారం వంటివి చేతికి సరాసరి తీసుకోవడం దోషమని మన పెద్దలు చెప్పారు. మనం కొంచెం వివేచన చేసి పరిశీలిస్తే, ఆ పదార్థాలు ప్రత్యక్షంగా చేతికి తీసుకోవడంలో కొంత అసౌకర్యం ఉన్నదని గమనించవచ్చు. అంతేకాక ఉప్పుకారాలు అంటిన చేయి కంటికి తగిలితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక నూనె జిడ్డు పదార్థం. జారిపోయే అవకాశం ఉంటుంది. ఈ దృష్టితో నూనెను నేరుగా తీసుకోరాదనే నియమం వచ్చి ఉంటుంది. నువ్వులు ప్రధానంగా పితృకార్యాలలో వినియోగిస్తారు. అశుభ సందర్భంలో ఉపయోగించే నువ్వులు ఒకరి చేతి నుంచి మరొకరు తీసుకోవడం మంచిది కాదని ఈ విధానం వాడుకలోకి వచ్చింది. కానీ, నువ్వులు చేతికి తీసుకున్నంత మాత్రాన దోషాలు వస్తాయని అనుకోవాల్సిన పనిలేదు. దీనికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి