గతం గురించి చింతెందుకు?!
మనలో చాలామంది నిన్నటి విషయాలను తలచుకుని బాధపడుతుంటారు. ఈ సందర్భంలో ఏసుక్రీస్తు చెప్పిన ‘నిన్నటి గురించి విచారించొద్దు.
మనలో చాలామంది నిన్నటి విషయాలను తలచుకుని బాధపడుతుంటారు. ఈ సందర్భంలో ఏసుక్రీస్తు చెప్పిన ‘నిన్నటి గురించి విచారించొద్దు. ఎప్పటి కీడు అప్పటికి చాలు’ (మత్తయి 6:34) అనే సూక్తిని గుర్తుచేసుకోవాలి. జరిగిన కష్టనష్టాల గురించి పదేపదే తలచుకోవడం వల్ల ఉపయోగం లేకపోగా మనసు కల్లోలం చెందుతుంది. నీ శక్తి గతానికే ధారపోసినట్టవుతుంది. తద్వారా ప్రస్తుతం కుంటుపడుతుంది. కనుక ఈరోజు వీలైనంత మంచిగా జీవించు. చెడుకు దూరంగా ఉండు. అందరి మేలునే కోరుకో. నీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి నీకూ, ఇతరులకూ కూడా శ్రేయస్సు కలిగే పనులు చేయి. వర్తమానం నీ వశంలోనే ఉంటుంది. ప్రభువు చెప్పిన ఈ మంచి మాటను పాటిస్తే మానసిక వ్యథ ఉండదు. అలాగే రేపు ఏం కానుందోనని భయం వద్దు. అందుకు అవసరమైన ప్రణాళికలు రచించుకోవచ్చు. ఆ విషయంలో దేవుని సాయం కోరితే ఆయన తప్పక తోడ్పాటునందిస్తాడు. కానీ ఆందోళన చెందకూడదని భావం.
మర్రి ఎ.బాబ్జీ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Koppula Harishwar Reddy: ప్రభుత్వ అధికార లాంఛనాలతో హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియలు
-
Chandrababu Arrest : రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు విచారణ ప్రారంభం
-
Kakinada: పామాయిల్ తోటలో విద్యుత్ తీగలు తగిలి.. ముగ్గురి మృతి
-
Justin Trudeau: ‘మేం ముందే ఈ విషయాన్ని భారత్కు చెప్పాం’: ఆగని ట్రూడో వ్యాఖ్యలు
-
Jailer: రజనీకాంత్ ‘జైలర్’ కథను మరోలా చూపించవచ్చు: పరుచూరి విశ్లేషణ
-
Vikarabad: స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. 40 మంది విద్యార్థులు సురక్షితం