ముందుకు సాగు...

తన ఆస్తి నాలుగు తరాల వరకు సరిపోతుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? అని ఒక పెద్దాయన చింతిస్తున్నాడు....

Published : 07 Jan 2021 01:16 IST

క్రీస్తువాణి

న ఆస్తి నాలుగు తరాల వరకు సరిపోతుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? అని ఒక పెద్దాయన చింతిస్తున్నాడు. ఆ బాధలోనే ప్రాణాలొదిలాడు. అతని చింత, ఆందోళన అతన్ని చితికి చేర్చింది. ఈ సందర్భంగా క్రీస్తు ఉపదేశాన్ని గుర్తు చేసుకోవాలి..‘ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తవు, కోయవు.. అయినా వాటికి సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది కదా.. ఇక్కడ సోమరులుగా ఉండమని కాదు ప్రభువు ఉద్దేశం. ‘దేన్ని గురించీ చింతించకండి. మీకేం కావాలో దేవుడికి తెలుసు. పక్షిరాజు ఆకాశానికి ఎగిరిపోయినట్లు మీదగ్గరున్న ధనం మాయమైపోవచ్చు. కానీ ఆధ్యాత్మిక సిరిసంపదలు మాత్రం ఎక్కడికీ పోవు’ అంటారాయన.

-ఎం.సుగుణరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని