వారితో జాగ్రత్త
కొండ ఎక్కుతున్న ఇద్దరు భక్తుల మధ్య తలెత్తిన తగాదాని ప్రస్తావిస్తూ వారికి ఇలా సూచించాలని తన శిష్యులతో చెప్పారు రమణులు.. ‘ఎవరు మనల్ని దూషిస్తాడో అతడే మన మిత్రుడు.
గురుబోధ
కొండ ఎక్కుతున్న ఇద్దరు భక్తుల మధ్య తలెత్తిన తగాదాని ప్రస్తావిస్తూ వారికి ఇలా సూచించాలని తన శిష్యులతో చెప్పారు రమణులు.. ‘ఎవరు మనల్ని దూషిస్తాడో అతడే మన మిత్రుడు. ఎందుకంటే, అతను దూషించేది మనకు శత్రువైన మన శరీరాన్ని మాత్రమే. శత్రువుకు శత్రువు పరమ మిత్రుడు గదా. నిజంగా మనల్ని భూషించే వారి విషయంలో మనం జాగ్రత్తపడాలి’ అని చెప్పారు. భగవాన్ శిష్యులు వారిద్దరికీ ఆ సందేశాన్ని అందించటానికి వెళితే వారు అప్పటికే తమ తగవును పరిష్కరించుకునే యోచనలో ఉన్నారు. తర్వాత వాళ్లు కలుసుకుని గతాన్ని మర్చిపోదామని అనుకున్నారు. అయితే అంతకు ముందు ఒకరికొకరు దూషించుకుంటూ ఉత్తరాలు రాసుకున్నారు. వాటిని తగలబెడదామని ఒక వ్యక్తి చెప్పాడు. వెంటనే రమణులు ‘కాగితాలు తగలబెట్టినంత మాత్రాన ప్రయోజనం ఏంటి? హృదయంలో అది మళ్లీ రగుల్కోకుండా తగలబెట్టాలి’ అని చెప్పారు. సత్యాసత్యాలు, వాస్తవ దృష్టి విషయంలో రమణులు ఒకసారి ఇలా చెప్పారు.. ‘ఏదైనా యుక్తియుక్తంగా ఉంటే, ఒక బాలుడు చెప్పినా గ్రహించండి. అలా లేకుంటే బ్రహ్మ చెప్పినా తృణీకరించండి’
- శాలిని
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం