ఆ దూరం మంచికే!
ఆషాఢ మాసంలో కొత్తకోడలు అత్తవారింట్లో ఉండకూడదని చెబుతారు. ఎందుకు?
ధర్మ సందేహం
ఆ దూరం మంచికే!
ఆషాఢ మాసంలో కొత్తకోడలు అత్తవారింట్లో ఉండకూడదని చెబుతారు. ఎందుకు?
వివాహమైన మొదటి సంవత్సరం ఆషాఢ మాసంలో అత్తాకోడళ్లు ఒకే ఇంట్లో ఉండరాదన్నది ఆచారంగా వస్తోంది. ఉమ్మడి కుటుంబాలు ఉన్న రోజుల్లో ఈ ఆచారం మరింత ఎక్కువగా పాటించేవాళ్లు. కొత్తదంపతులు ఆషాఢ మాసంలో దూరంగా ఉండాలన్నది ఇందులోని ఆంతర్యం. గ్రీష్మ, వర్షరుతువుల సంధికాలమైన ఆషాఢంలో శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి.. కాలుష్యాలను కలిగించే సూక్ష్మక్రిముల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో నూతన వధువు గర్భం ధరిస్తే.. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పైగా ఆషాఢంలో గర్భధారణ జరిగితే.. నెలలు నిండే సమయానికి వేసవి తీవ్రత అధికం అవుతుంది. ఈ ప్రభావం తల్లీబిడ్డల ఆరోగ్యంపై పడే ప్రమాదం ఉంది. అందువల్ల ఆషాఢంలో కొత్తదంపతులు దూరంగా ఉండటమనే ఆచారం వచ్చింది. ఈ సంప్రదాయం వెనుక మరో ఆలోచన కూడా ఉంది. మనది వ్యవసాయం ప్రధానవృత్తిగా ఉన్న దేశం. ఈ మాసంలోనే వ్యవసాయ పనులు ప్రారంభం అవుతాయి. కొత్తదంపతులు ఒకేచోట ఉంటే కొత్త కోరికల ప్రవాహంలో వ్యవసాయం అశ్రద్ధ అవుతుందనీ, ఫలితంగా ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని.. సామాజిక దృష్టితో ఈ ఆచారాన్ని తీసుకొచ్చారు మనపెద్దలు. ఏది ఏమైనా ఇది ఆచారమే కానీ, శాస్త్రం కాదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
C-Vigil: సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM