అప్రమత్తతా ఆధ్యాత్మికతే!

ఒకసారి దక్షిణేశ్వరంలోని పంచవటిలో సంకీర్తనల కార్యక్రమం ఏర్పాటైంది. అక్కడే రామకృష్ణ పరమహంస సాధన చేస్తుంటారు.

Published : 02 Feb 2023 00:30 IST

కసారి దక్షిణేశ్వరంలోని పంచవటిలో సంకీర్తనల కార్యక్రమం ఏర్పాటైంది. అక్కడే రామకృష్ణ పరమహంస సాధన చేస్తుంటారు. వర్షాకాలం కనుక అద్వైతానంద గురుదేవుల కోసం గొడుగు తీసుకెళ్లారు. కార్యక్రమం పూర్తయ్యాక పరమహంస ఆవాసానికి విచ్చేసిన భక్తులు అద్వైతానందను గొడుగు అడిగారు. ‘అయ్యో! సంగీత పారవశ్యంలో పడి ఆ విషయమే మర్చిపోయాను!’ అన్నాడు. అప్పుడు గురుదేవులు ‘సాధారణంగా నేనిలాంటి లౌకిక విషయాలను పట్టించుకోను. అలాగని అజాగ్రత్తను కూడా సహించను. సంగీతం విను. కానీ వచ్చేటప్పుడు వెంట తీసుకెళ్లింది గుర్తుపెట్టుకొని తెచ్చుకోవాలి. ఇలాంటివే మానసిక స్థితికి అద్దం పడతాయి. పరధ్యానం, ఏమరుపాటు పారమార్థికత అనిపించుకోదు. అప్రమత్తత కూడా ఆధ్యాత్మికతే! అడుగడుగునా జాగ్రత్తతో మసలు కోవాలి’ అని హితవు పలికారు. అలా పరమహంస పారమార్థిక విషయాల్లోనే కాదు ప్రాపంచిక విషయాల్లోనూ శిక్షణ ఇచ్చేవారు. చిన్నచిన్న అంశాల్లోనే నిర్లక్ష్యంగా ఉంటే.. ఇక పెద్ద విషయాల్లో జాగ్రత్త ఎలా వస్తుందని సూటిగా ప్రశ్నించేవారు.

ప్రహ్లాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని