APPSC: గ్రూప్‌ -4 మెయిన్‌ పరీక్ష ప్రాథమిక కీ విడుదల

ఏపీపీఎస్సీ గ్రూప్‌ ౪ మెయిన్‌ పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. ఈ నెల ౪న రాష్ట్ర వ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.

Updated : 10 Apr 2023 12:53 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ -4 మెయిన్‌ పరీక్ష (Group 4exam) ప్రాథమిక కీ విడుదలైంది. రాష్ట్రంలోని రెవెన్యూ శాఖలో 670 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 4న రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో గురువారం ప్రాథమిక పరీక్ష సమాధానాల ప్రాథమిక కీని ఏపీపీఎస్సీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. ఆన్‌లైన్‌లో జరిగిన ఈ పరీక్ష ప్రాథమిక కీపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఏప్రిల్‌ 7 నుంచి 9వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో తెలియజేయవచ్చని అభ్యర్థులకు సూచించింది. పోస్టు, వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌, ఫోన్‌, వ్యక్తిగతంగా సమర్పించడం తదితర రూపాల్లో అభ్యంతరాలను స్వీకరించబోమని అధికారులు తెలిపారు. 

జనరల్‌ స్టడీస్‌ & మెంటల్‌ ఎబిలిటీ కీ

జనరల్‌ ఇంగ్లిష్‌ & జనరల్‌ తెలుగు కీ

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని