APPSC Group-4 exam: 4న రెండు షిఫ్ట్‌ల్లో పరీక్ష.. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోండి

ఏప్రిల్‌ 4న జరిగే గ్రూప్‌ 4 మెయిన్స్‌ పరీక్షకు హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. అర్హులైన అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Updated : 28 Mar 2023 16:55 IST

అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్ 4 మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ ప్రధాన పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్ నుంచి అడ్మిట్‌ కార్డులు పొందొచ్చు. ఏపీ రెవెన్యూ శాఖలో మొత్తం 670 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్ అసిస్టెంట్‌(గ్రూప్ 4) ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటికే స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించిన అధికారులు.. మెయిన్స్‌ పరీక్షను ఏప్రిల్‌ 4న నిర్వహించనున్నారు. రెండు షిఫ్టుల్లో జరిపే కంప్యూటర్‌ ఆధారిత పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 11,574 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.  రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది.

హాల్‌టిక్కెట్ల కోసం క్లిక్‌ చేయండి..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని