ఈనాడు జర్నలిజం స్కూలు కొత్త బ్యాచ్కు 84 మంది ఎంపిక
హైదరాబాద్: ఈనాడు జర్నలిజం స్కూలు కొత్త బ్యాచ్కు 84 మంది ప్రవేశార్హత సాధించారు. మల్టీమీడియా, టెలివిజన్, మొబైల్ జర్నలిజం విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ‘ఈనాడు జర్నలిజం స్కూలు’ డిసెంబరు నెలలో నిర్వహించిన పరీక్ష తుది ఫలితాలను స్కూలు ప్రిన్సిపల్ ఎం.నాగేశ్వరరావు బుధవారం విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న 663 మంది అభ్యర్థుల్లో 276 మంది బృంద చర్చలు, ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. వారిలో 84 మంది శిక్షణకు ఎంపికయ్యారు. వీరిలో 51 మంది మల్టీమీడియా, 24 మంది టెలివిజన్, 9 మంది మొబైల్ జర్నలిజం విభాగాలకు చెందిన వారు ఉన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈనాడు జర్నలిజం స్కూలులో జనవరి 23వ తేదీన శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ తెలిపారు. అభ్యర్థులకు వ్యక్తిగతంగా కూడా సమాచారం అందుతుంది. ప్రవేశార్హత సాధించిన అభ్యర్థుల జాబితాను దిగువ చూడండి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
కన్నతండ్రి దూరమైనా తరగని ప్రేమ.. భౌతికకాయం ముందే పెళ్లి చేసుకున్న కుమారుడు
-
India News
Usha Gokani: మహాత్మాగాంధీ మనవరాలి కన్నుమూత
-
Politics News
TDP: ఎమ్మెల్యే భవాని సభలో లేకున్నా ‘సాక్షి’లో తప్పుడు ఫొటో: తెదేపా ఎమ్మెల్యే స్వామి
-
India News
the elephant whisperers: ఆస్కార్ లఘుచిత్ర దర్శకురాలికి రూ.కోటి నజరానా
-
India News
వాహ్.. బేటా!.. తాజ్ చూపించి తల్లి కోరిక తీర్చిన తనయుడు
-
Crime News
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి