దివ్యమైన ఆసరా!
దివ్యాంగులు.. శారీరక లోపం వల్ల కలిగిన వ్యథను అధిగమించి దృఢంగా జీవనం సాగించేందుకు సాయపడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వివిధ స్కాలర్షిప్లను ప్రత్యేకంగా అందిస్తోంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ఈ నిధులను సమకూరుస్తుంది. తొమ్మిదో తరగతి నుంచి పీహెచ్డీ వరకు వివిధ కోర్సులు చదువుతోన్నవారు, విదేశీ విద్య ప్రయత్నాల్లో ఉన్నవారు, పోటీ పరీక్షలకు
9వ తరగతి నుంచి పీహెచ్డీ వరకూ ఉపకార వేతనాలు
40 శాతం వైకల్యం ఉన్నవారు అర్హులు
దివ్యాంగులు.. శారీరక లోపం వల్ల కలిగిన వ్యథను అధిగమించి దృఢంగా జీవనం సాగించేందుకు సాయపడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వివిధ స్కాలర్షిప్లను ప్రత్యేకంగా అందిస్తోంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ఈ నిధులను సమకూరుస్తుంది. తొమ్మిదో తరగతి నుంచి పీహెచ్డీ వరకు వివిధ కోర్సులు చదువుతోన్నవారు, విదేశీ విద్య ప్రయత్నాల్లో ఉన్నవారు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు వీటికోసం నవంబరు 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యా నేపథ్యం బట్టి 6 రకాల స్కాలర్షిప్పులను దివ్యాంగుల కోసం అందిస్తున్నారు. అవి...
ప్రి మెట్రిక్, పోస్టు మెట్రిక్, టాప్ క్లాస్ ఎడ్యుకేషన్, నేషనల్ ఓవర్సీస్, నేషనల్ ఫెలోషిప్,
ఫ్రీ కోచింగ్. 40 శాతం వైకల్యం ఉన్న ఎవరైనా ఈ ఉపకార వేతనాలకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏవైనా ఇతర ఉపకార వేతనాలు పొందనివారు వీటికి అర్హులు. ఎంపికలో కుటుంబ వార్షిక ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ప్రి-మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వీటి ఎంపికలో రాష్ట్రాల వారీ స్లాట్ అనుసరిస్తారు.
* ఆంధ్రప్రదేశ్లో ప్రి-మెట్రిక్ 910, పోస్ట్ మెట్రిక్ 773, టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ 14 స్లాట్స్ ఉన్నాయి.
* తెలంగాణలో ప్రి-మెట్రిక్ 781, పోస్ట్ మెట్రిక్ 664, టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ 12 స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. దివ్యాంగ విద్యార్థినులకు వీటిలో 50 శాతం స్కాలర్షిప్లను కేటాయించారు. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్పుల్లో 30 శాతం మహిళలకు దక్కుతాయి. రాష్ట్రాలవారీగా తగినంత మంది అభ్యర్థులు లేకపోతే ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు.
ప్రి-మెట్రిక్ స్కాలర్షిప్
డే స్కాలర్స్కు రూ.500, హాస్టల్లో ఉండేవారికి రూ.800 చొప్పున నెలకు ఇస్తారు. వీటితోపాటు బుక్ గ్రాంట్ కింది ఏటా రూ.1000, డిజెబిలిటీ అలవెన్స్ నిమిత్తం రూ.2000 నుంచి రూ.4000 వరకు ప్రోత్సాహకంగా అందిస్తారు. విద్యార్థి అకడమిక్ ప్రతిభ, వయసు ఆధారంగా ఈ ప్రి-మెట్రిక్ స్కాలర్షిప్ ఎంపిక ఉంటుంది. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలకు మించకూడదు.
ఎవరు అర్హులు: తొమ్మిది, పది తరగతుల విద్యార్థులు స్కాలర్షిప్పుల సంఖ్య: 20,000కు పైగా
పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్
మొత్తం విద్యార్థులను నాలుగు గ్రూపులుగా విభజించారు.
* గ్రూప్-1లో మెడిసిన్, ఇంజినీరింగ్/ టెక్నాలజీ, ప్లానింగ్/ ఆర్కిటెక్చర్, ఫ్యాషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, బిజినెస్/ ఫైనాన్స్ అడ్మినిస్ట్రేషన్ తదితరాల్లో డిగ్రీ, పీజీ విద్యార్థులకు డేస్కాలర్స్ అయితే రూ.750, హాస్టలర్స్కు రూ.1600 చొప్పున ప్రతి నెలా ఇస్తారు.
* గ్రూప్-2లో డిగ్రీ/ డిప్లొమా, ఫార్మసీ, ఎల్ఎల్బీ, ఇతర పారా మెడికల్ బ్రాంచిలు తదితరాల్లో చదువుతున్న డేస్కాలర్స్కు నెలకు రూ.700, హాస్టలర్స్కు రూ.1100 ఇస్తారు.
* గ్రూప్-3లో బీఏ/ బీఎస్సీ/ బీకాం విద్యార్థులకు డేస్కాలర్స్కు నెలకు రూ.650, హాస్టలర్స్కు రూ.950 చొప్పున అందిస్తారు.
* గ్రూప్-4లో ఐటీఐ / ఒకేషనల్ / పాలిటెక్నిక్ కోర్సులు చదివే విద్యార్థులకు డేస్కాలర్స్కు నెలకు రూ.550, హాస్టలర్స్కు రూ.900 చొప్పున అందిస్తారు.
వీటితోపాటు బుక్ అలవెన్స్ కింద సంవత్సరానికి రూ.1500, డిజెబిలిటీ అలవెన్స్ రూ.2000 నుంచి రూ.4000 వరకు అందిస్తారు. విద్యార్థి అకడమిక్ ప్రతిభ, వయసు ఆధారంగా ఎంపిక ఉంటుంది. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలకు మించకూడదు.
ఎవరు అర్హులు: ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ విద్యార్థులు
స్కాలర్షిప్పుల సంఖ్య: 17000కు పైగా
ఉచిత శిక్షణ, ఉపకారవేతనం
యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పోటీ పరీక్షలకూ, జేఈఈ, నీట్ క్యాట్.మొదలైన ప్రవేశ పరీక్షలకూ పేరున్న సంస్థలో ఉచితంగా శిక్షణ పొందే అవకాశం ఉంది. దీని ద్వారా కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఫీజు చెల్లించడంతో పాటు లోకల్ విద్యార్థికి నెలకు రూ. 2500, నాన్ లోకల్ విద్యార్థికి రూ.5000 ఇస్తారు.స్పెషల్ ఆలవెన్స్ కింద మరో రూ. 2000 అందిస్తారు.ఆ ఏడాది ఏ ఉద్యోగం సాధించలేకపోతే మరో ఏడాది రెన్యువల్ చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.6 లక్షలు మించకూడదు.
ఎవరు అర్హులు: పోటీపరీక్షలకూ, ప్రవేశ పరీక్షలకూ శిక్షణ తీసుకునే విద్యార్థులు
స్కాలర్షిప్పులు: 20000 (ఏడాదికి)
నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్
ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, ప్యూర్ సైన్సెస్ అండ్ అప్లైడ్ సైన్సెస్, అగ్రికల్చర్ సైన్స్ అండ్ మెడిసిన్, కామర్స్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, లా అండ్ ఫైన్ ఆర్ట్స్ విభాగాల్లో విదేశీ యూనివర్సిటీల్లో మాస్టర్స్ డిగ్రీ/ పీహెచ్డీ చేస్తున్న దివ్యాంగులకు ఉపకారవేతనం అందిస్తారు. బ్యాచిలర్స్/ మాస్టర్స్ డిగ్రీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండాలి. యు.కె. మినహా ఇతర దేశాల యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు ఏడాదికి 15400 యూఎస్ డాలర్లు, కంటింజెన్సీ అలవెన్స్ రూపంలో ఏడాదికి 1500 యూఎస్ డాలర్లు అందిస్తారు. యు.కె. యూనివర్సిటీల్లో చదివేవారికి ఏడాదికి 9900 జీబీపీ, కంటింజెన్సీ అలవెన్స్ రూపంలో ఏడాదికి 1100 జీబీపీ వస్తుంది. వీటితోపాటు వీసా ఫీజు, విమాన చార్టీలు, మెడికల్ ఇన్సూరెన్స్.. మొదలైనవాటికి అవసరమయ్యే మొత్తాన్ని చెల్లిస్తారు. పీహెచ్డీ విద్యార్థులకు నాలుగేళ్లు, మాస్టర్స్ డిగ్రీ చదివేవారికి మూడేళ్లు స్కాలర్షిప్ వస్తుంది. వెబ్సైట్ నుంచి దరఖాస్తు నింపి సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి పోస్టు చేయాలి. కుటుంబ వార్షిక ఆదాయం ఏడాదికి ఆరు లక్షలు మించకూడదు. మెరిట్, షార్ట్లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎవరు అర్హులు: విదేశీ యూనివర్సిటీల్లో మాస్టర్స్/ పీహెచ్డీ చేస్తున్న అభ్యర్థులు
స్కాలర్షిప్పులు: 20 (ఏడాదికి)
స్కాలర్షిప్పులకు దరఖాస్తు గడువు: నవంబరు 30 వెబ్సైట్: https://scholarships.gov.in/
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
ప్రజలు బెంజ్ కారు అడగట్లేదు కాదా!.. ఎన్నికలపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
-
22న ఏపీ పదోతరగతి ఫలితాలు