నాయకత్వ లక్షణాలకు పదునుపెట్టేలా..
మనలోని నాయకత్వ లక్షణాలకూ, వ్యాపార మెలకువలకూ మరింత పదునుపెట్టేలా ప్రఖ్యాత అడెకో సంస్థ ‘సీఈవో ఫర్ వన్ మంత్’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
మనలోని నాయకత్వ లక్షణాలకూ, వ్యాపార మెలకువలకూ మరింత పదునుపెట్టేలా ప్రఖ్యాత అడెకో సంస్థ ‘సీఈవో ఫర్ వన్ మంత్’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గత ఏడేళ్లుగా జరుగుతున్న ఈ ప్రోగ్రామ్కు ఈసారీ ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దీనికి ఎంపికైన అభ్యర్థులు దేశవిదేశాల నుంచి వచ్చే అభ్యర్థులతో కలిసి నెల రోజులపాటు మెంటర్షిప్ ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశం దక్కించుకుంటారు.
ఏటా దాదాపు 40 దేశాల నుంచి 2 లక్షల మంది దీనికి దరఖాస్తు చేస్తున్నారని అంచనా. ఎంపికైన అభ్యర్థుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినవారిలో పది మందిని తుది ఎంపిక చేస్తారు. తరువాత ప్రపంచ బూట్ క్యాంప్ నిర్వహించి, సీఈవో పేరిట ఎంపిక చేస్తారు. ఎంపికైన సీఈవో నెల రోజులపాటు బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ ప్రోగ్రామ్ పూర్తయ్యేకాలంలో అభ్యర్థికి పారితోషికం అందుతుంది. ఇప్పటికే 300 మంది ఈ కార్యక్రమం ద్వారా అవగాహన పొందారు.
ఎవరు అర్హులు?: 18-24 ఏళ్లలోపు వయసువారు దరఖాస్తు చేయొచ్చు.
ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు స్వీకరణకు ఆఖరి తేదీ: 15 ఏప్రిల్.
ఇతర వివరాలకు వెబ్సైట్: www.adeccogroup.com
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ