నలందలో.. పీజీ, పీహెచ్‌డీ

జాతీయ ప్రాధాన్య సంస్థ హోదా ఉన్న విశ్వవిద్యాలయం నలంద. బిహార్‌లోని రాజ్‌గిరీలో స్థాపించిన ఈ సంస్థలో పీజీ, పీహెచ్‌డీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు అందిస్తున్నారు.

Published : 09 May 2023 00:41 IST

జాతీయ ప్రాధాన్య సంస్థ హోదా ఉన్న విశ్వవిద్యాలయం నలంద. బిహార్‌లోని రాజ్‌గిరీలో స్థాపించిన ఈ సంస్థలో పీజీ, పీహెచ్‌డీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు అందిస్తున్నారు. వీటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. భారత్‌తోపాటు 18 భాగస్వామ్య దేశాలకు చెందిన విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు. కోర్సులన్నీ ప్రపంచ దృక్పథంతో, ఆసియా ఖండాన్ని దృష్టిలో పెట్టుకుని అందిస్తున్నారు!

కోర్సులు

ఎంఏ: బుద్ధిస్ట్‌ స్టడీస్‌, ఫిలాసఫీ అండ్‌ కంపారిటివ్‌ రెలిజియన్‌, హిందూ స్టడీస్‌ (సనాతన ధర్మ), హిస్టారికల్‌ స్టడీస్‌, వరల్డ్‌ లిటరేచర్‌ ఇన్‌ ఇంగ్లిష్‌.
ఎంబీఏ: సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌
ఎమ్మెస్సీ: ఎకాలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌
పీహెచ్‌డీ: ఎకాలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ స్టడీస్‌, బుద్ధిస్ట్‌ స్టడీస్‌, ఫిలాసఫీ అండ్‌ కంపారిటివ్‌ రెలిజియన్‌, హిందూ స్టడీస్‌ (సనాతన ధర్మ), హిస్టారికల్‌ స్టడీస్‌, వరల్డ్‌ లిటరేచర్‌ ఇన్‌ ఇంగ్లిష్‌.

ఎంపిక

స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ (ఎస్‌ఓపీ) 250 పదాల్లో రాయాలి. నలందలో ఎందుకు చదవాలనుకుంటున్నారో తెలిపేలా వంద పదాల్లో వివరించాలి. అలాగే సంబంధిత కోర్సును ఎంచుకోవడానికి కారణాలను 300 నుంచి 500 పదాల్లో వ్యక్తీకరించాలి. డిగ్రీని ఆంగ్ల మాధ్యమంలో చదవనివారికి టోఫెల్‌ లేదా ఐఈఎల్‌టీఎస్‌ స్కోర్‌ తప్పనిసరి. ఇవన్నీ దరఖాస్తుతో పంపాలి. వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్‌ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో చూపిన ప్రతిభతో కోర్సులోకి తీసుకుంటారు.
ఆగస్టు మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. రెసిడెన్షియల్‌ విధానంలో వీటిని అందిస్తున్నారు. పీజీ కోర్సుల వ్యవధి రెండేళ్లు. పీహెచ్‌డీలకు నాలుగేళ్లు. పీహెచ్‌డీలో చేరినవారికి నెలకు రూ.35,000 స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఎంబీఏ కోర్సు ఫీజు రూ.2.22 లక్షలు. మిగిలిన పీజీలకు ఇది రూ. 1.34 లక్షలు. వసతి, భోజనానికి విడిగా చెల్లించాలి.  
దరఖాస్తులకు చివరి తేదీ: మే 31.
వెబ్‌సైట్‌: https://nalandauniv.edu.in/

అర్హత

కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా యూజీ విద్యార్హతతో పీజీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో విద్యార్థి గరిష్ఠంగా రెండు కోర్సులకే పోటీపడవచ్చు. ఎంబీఏకు క్యాట్‌/ఎక్స్‌ఏటీ/మ్యాట్‌ ఎందులోనైనా 70 పర్సంటైల్‌ తప్పనిసరి. పీహెచ్‌డీకీ సంబంధిత విభాగాల్లో 65 శాతం మార్కులతో పీజీ పూర్తవ్వాలి.


డిప్లొమా, సర్టిఫికెట్‌

ఈ సంస్థ స్వల్పకాల వ్యవధితో డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులనూ అందిస్తోంది.
డిప్లొమా: ఇంగ్లిష్‌, కొరియన్‌, పాళీ, సంస్కృతం, యోగా. వ్యవధి ఏడాది. కోర్సు ఫీజు రూ.వెయ్యి. వారంలో మూడు రోజులు తరగతులుంటాయి.
సర్టిఫికెట్‌: ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ, ఫ్రెంచ్‌, కొరియన్‌, పాళీ, సంస్కృతం, టిబెటన్‌, యోగా. కోర్సు వ్యవధి 5 నెలలు. ఫీజు రూ.500. వారంలో మూడు రోజులు తరగతులు నిర్వహిస్తారు.
ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల్లో చేరవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశాలుంటాయి. ఆసక్తి ఉన్నవారు జులై 14లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని