టెన్త్తో టెక్నీషియన్ ఉద్యోగం
భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్ఐ) 641 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పదో తరగతి విద్యార్హతతో వీటికి పోటీ పడవచ్చు. ఆన్లైన్ పరీక్షలో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు లెవెల్-3 వేతనం అందుకోవచ్చు. వీరు ఐఏఆర్ఐ ప్రధాన కార్యాలయంతోపాటు దేశవ్యాప్తంగా ఐసీఏఆర్ కేంద్రాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 64 ఐసీఏఆర్ కేంద్రాలు ఉన్నాయి. ఖాళీలను ఆయా కేంద్రాల వారీగా భర్తీ చేస్తారు. అయితే వీటికి ఎవరైనా పోటీ
భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్ఐ) 641 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పదో తరగతి విద్యార్హతతో వీటికి పోటీ పడవచ్చు. ఆన్లైన్ పరీక్షలో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు లెవెల్-3 వేతనం అందుకోవచ్చు. వీరు ఐఏఆర్ఐ ప్రధాన కార్యాలయంతోపాటు దేశవ్యాప్తంగా ఐసీఏఆర్ కేంద్రాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 64 ఐసీఏఆర్ కేంద్రాలు ఉన్నాయి. ఖాళీలను ఆయా కేంద్రాల వారీగా భర్తీ చేస్తారు. అయితే వీటికి ఎవరైనా పోటీ పడవచ్చు. ఎంపికైనవారికి ఏడాది పాటు శిక్షణ నిర్వహిస్తారు. ఈ వ్యవధిలో వీరిని టెక్నికల్ ట్రైనీగా పరిగణిస్తారు. దాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి టెక్నీషియన్-1 హోదా కేటాయిస్తారు. వీరికి లెవెల్-3 కేంద్ర వేతనం అందుతుంది. అంటే రూ.21700 మూలవేతనానికి అదనంగా డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. మొదటి నెల నుంచే రూ.35 వేలకు పైగా వేతనం అందుకోవచ్చు.
పరీక్ష ఇలా
వంద మార్కులకు ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. మొత్తం వంద ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. వీటిని 4 విభాగాల నుంచి అడుగుతారు. జనరల్ నాలెడ్జ్, మ్యాథమేటిక్స్, సైన్స్, సోషల్ సైన్సెస్లో ఒక్కో విభాగం నుంచి 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తించిన సమాధానానికి పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్షలో అర్హత సాధించాలంటే యూఆర్లు 40, ఎస్సీ, ఓబీసీ ఎన్సీఎల్, ఈడబ్ల్యుఎల్లు 30, ఎస్టీలు 25 మార్కులు పొందడం తప్పనిసరి. ఇలా అర్హ్హత పొందినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన నియామకాలు చేపడతారు.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తులు: జనవరి 20 వరకు స్వీకరిస్తారు.
ఆన్లైన్ పరీక్షలు: జనవరి 25 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఉంటాయి.
పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. చిత్తూరు, తూర్పు గోదావరి, ఏలూరు, గుంటూరు, కడప, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, చీరాల, విజయనగరం. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్.
ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు రూ.300. మిగిలిన అందరికీ రూ.వెయ్యి.
ఖాళీలు: మొత్తం 641 ఉన్నాయి. వీటిలో 286 అన్ రిజర్వ్డ్, 61 ఈడబ్ల్యుఎస్, 93 ఎస్సీ, 68 ఎస్టీ, 133 ఓబీసీ (ఎన్సీఎల్)కు కేటాయించారు.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత
వయసు: జనవరి 10, 2022 నాటికి కనిష్ఠంగా 18 నుంచి గరిష్ఠంగా 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
వెబ్సైట్: https://www.iari.res.in/
ఏ విభాగాల నుంచి ప్రశ్నలు?
జనరల్ నాలెడ్జ్: వర్తమానాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా భారత్, పొరుగు దేశాలకు సంబంధించి అడుగుతారు. చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఎకనామిక్ సైన్స్, జనరల్ పాలసీ అండ్ సైంటిఫిక్ రిసెర్చ్ విభాగాల్లో వీటిని అడుగుతారు. గత 9 నెలల ముఖ్యాంశాలను బాగా చదువుకుంటే సరిపోతుంది.
మ్యాథ్స్: ఈ విభాగంలో ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. నంబర్ సిస్టమ్, అరిథ్Çమెటికల్ ఆపరేషన్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగనోమెట్రీ, స్టాటిస్టికల్ చార్టుల నుంచి వీటిని అడుగుతారు.
సైన్స్: ఈ ప్రశ్నలూ పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. ఫిజికల్ కెమికల్ సబ్ స్టాన్సెస్- నేచర్ అండ్ బిహేవియర్, వరల్డ్ ఆఫ్ లివింగ్, నేచురల్ ఫినామినన్, నేచురల్ రిసోర్సెస్ అంశాల్లో ఇవి ఉంటాయి.
సోషల్ సైన్స్: ఇవీ పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. భారత దేశం, ప్రపంచానికి సంబంధించి ఆర్థిక రాజకీయ అంశాలు, అభివృద్ధి, విపత్తు నిర్వహణ మొదలైన వాటిలో ప్రశ్నలుంటాయి.
ప్రభుత్వ ఉద్యోగాలు
బీఈసీఐఎల్ - 500 పోస్టులు
భారత ప్రభుత్వరంగానికి చెందిన నోయిడాలోని బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 500
పోస్టులు-ఖాళీలు: ఇన్వెస్టిగేటర్లు-350, సూపర్వైజర్లు-150.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ నాలెడ్జ్, స్థానిక భాష తెలిసి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
చివరి తేది: 2022, జనవరి 25.
వెబ్సైట్: https://www.becil.com/
ప్రవేశాలు
నీట్-పీజీ 2022
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్బీఈఎంఎస్) నీట్ పీజీ -2022 నోటిఫికేషన్ విడుదల చేసింది.
* నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) పీజీ-2022
కోర్సులు: 1. ఎండీ/ ఎంఎస్/ పీజీ డిప్లొమా 2. పోస్ట్ ఎంబీబీఎస్ డీఎన్బీ/ ఎన్బీఎంఎస్ డిప్లొమా
అర్హత: ఎంబీబీఎస్ డిగ్రీ/ ప్రొవిజనల్ ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా.
పరీక్ష తేది: 2022, మార్చి 12.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
చివరి తేది: 2022, ఫిబ్రవరి 04.
వెబ్సైట్: https://nbe.edu.in/
నల్సార్, హైదరాబాద్లో ఎంబీఏ
హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాకు చెందిన మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం 2022-2024 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
* మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)
స్పెషలైజేషన్లు: కార్పొరేట్ గవర్నెన్స్, ఇన్నవేషన్ అండ్ సస్టైనబిలిటీ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్, ఆపరేషన్స్ అండ్ సిస్టమ్స్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, బిజినెస్ రెగ్యులేషన్స్, కోర్ట్ మేనేజ్మెంట్
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: నల్సార్ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎన్-మెట్)/ క్యాట్/ గ్జాట్/ జీమ్యాట్/ జీఆర్ఈ స్కోర్, అకడమిక్ క్రెడెన్షియల్స్, ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: 2022, జనవరి 31.
ఎన్-మెట్ పరీక్ష తేది: 2022, ఫిబ్రవరి 20.
వెబ్సైట్: https://doms.nalsar.ac.in/
వాక్ఇన్
డీఎంహెచ్ఓ, కృష్ణా జిల్లాలో...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా (మచిలీపట్నం) వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్ఓ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 110
పోస్టులు: స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్లు, సైకియాట్రిస్ట్, ఫోరెన్సిక్ స్పెషలిస్ట్, కార్డియాలజిస్టులు తదితరాలు.
విభాగాలు: పీడియాట్రీషియన్, అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, అనెస్తీషియా, జీరియాట్రిక్, ఈఎన్టీ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీడీఎస్, ఎంబీబీఎస్, మెడికల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత. ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.
వాక్ఇన్ తేదీలు: 2022, జనవరి 12 నుంచి 22 వరకు.
వేదిక: డీఎంహెచ్ఓ, కృష్ణా జిల్లా, మచిలీపట్నం, ఏపీ.
వెబ్సైట్: https://krishna.ap.gov.in/
అప్రెంటిస్షిప్
సెంట్రల్ రైల్వేలో 2422 అప్రెంటిస్లు
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వే, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* ట్రేడ్ అప్రెంటిస్లు
మొత్తం ఖాళీలు: 2422
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ డీజిల్ తదితరాలు.
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 17.01.2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: 2022, ఫిబ్రవరి 16.
వెబ్సైట్: https://rrccr.com/
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ