ఉద్యోగాలు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....
బెల్లో 55 పోస్టులు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 55 పోస్టుల వారీగా ఖాళీలు: 1) ట్రెయినీ ఇంజినీర్ - 38 2) ప్రాజెక్ట్ ఇంజినీర్-ఆఫీసర్ - 17 విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, హెచ్ఆర్, సివిల్. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎంబీఏ/ ఎంఎస్డబ్ల్యూ/ పీజీహెచ్ఆర్ఎం ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 28 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. జీతభత్యాలు: నెలకు రూ.30,000 నుంచి రూ.55,000. ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా. దరఖాస్తు ఫీజు: ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుకు రూ.472, ట్రెయినీ ఇంజినీర్కు రూ.177 చెల్లించాలి.
దరఖాస్తులకు చివరితేది: జూన్ 01, 2022.
వెబ్సైట్: www.bel-india.in/Default.aspx
ఎస్వీపీఐఎస్టీఎంలో వివిధ ఖాళీలు
భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వశాఖకు చెందిన కోయంబత్తూరులోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ మేనేజ్మెంట్ (ఎస్వీపీఐఎస్టీఎం) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 12 పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్, అడ్మిషన్ కమ్ ప్లేస్మెంట్ అండ్ ట్రెయినింగ్ ఆఫీసర్. విభాగాలు: మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ అనలిటిక్స్, టెక్స్టైల్ అండ్ అపారెల్. అర్హత: పోస్టులను అనుసరించి కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్, మాస్టర్స్ డిగ్రీ, ఏంబీఏ/ పీజీడీఎం ఉత్తీర్ణత. జీతభత్యాలు: నెలకు రూ.30,000 నుంచి రూ.50000. ఎంపిక: షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు: ఈమెయిల్/ ఆఫ్లైన్ ద్వారా. ఈమెయిల్: recruitment2022@svpitm.ac.in చిరునామా: ది డైరెక్టర్, ఎస్వీపీఐఎస్టీఎం, అవినాషి రోడ్, పీలమేడు, కోయంబత్తూరు-641004. దరఖాస్తులకు చివరి తేది: జూన్ 02, 2022.
వెబ్సైట్: http://svpistm.ac.in/
ఏపీఎస్-గోల్కొండలో..
హైదరాబాద్ (గోల్కొండ)లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ (ఏపీఎస్) కింది టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 16 పోస్టులు: టీజీటీ, పీఆర్టీ, అడ్మిన్ సూపర్వైజర్లు, లైబ్రేరియన్ తదితరాలు. విభాగాలు: ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్ తదితరాలు. అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్/ రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బీఈడీ ఉత్తీర్ణత. సీటెట్/ టెట్ అర్హులై ఉండాలి. దరఖాస్తు: ఆఫ్లైన్ ద్వారా. చిరునామా: ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, సన్సిటీ దగ్గర, హైదరాబాద్- 500031. దరఖాస్తులకు చివరి తేది: జూన్ 04, 2022.
వెబ్సైట్: www.apsgolconda.edu.in/
ప్రవేశాలు
బిట్స్లో పీజీ ప్రోగ్రాములు
మెస్రా (రాంచీ)లోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్స్) 2022 విద్యాసంవత్సరానికి కింది పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
* బిట్స్లో పీజీ ప్రోగ్రాములు
ప్రోగ్రాములు: ఎంటెక్, ఎం.ఫార్మా, మాస్టర్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్, ఎమ్మెస్సీ. విభాగాలు: ఏరోస్పేస్, బయోటెక్నాలజీ, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ తదితరాలు. కోర్సు వ్యవధి: రెండేళ్లు. అర్హత: కోర్సులను అనుసరించి బీఈ/ బీటెక్/ ఏఎంఐఈ/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ/ ఎంఏ ఉత్తీర్ణత. గేట్ 2020 లేదా 2021 స్కోర్ ఉండాలి. 2022లో తుది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక: రాత పరీక్ష/ కౌన్సెలింగ్, ప్రోగ్రాములని అనుసరించి గేట్ /జీప్యాట్ / జామ్/ సీయూఈటీ స్కోర్ ఆధారంగా. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: జూన్ 07, 2022.
వెబ్సైట్: https://bitmesra.ac.in/
వాక్ఇన్లు
ఐజీఎన్సీఏలో 25 పోస్టులు
భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్ (ఐజీఎన్సీఏ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 25 పోస్టులు: కంటెంట్ ఎగ్జిక్యూటివ్, కంటెంట్ సూపర్వైజర్, బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్, వీడియో ఎడిటర్ తదితరాలు. అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ/ బీటెక్, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, పీహెచ్డీ ఉత్తీర్ణత. జీతభత్యాలు: నెలకు రూ.25000 నుంచి రూ.లక్ష. ఇంటర్వ్యూ వేదిక: వేదిక: జనపథ్ బిల్డింగ్, జన్పథ్, న్యూదిల్లీ-110001. వాక్ఇన్ తేదీలు: 2022 మే 18-31.
వెబ్సైట్: https://ignca.gov.in/
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి