నోటిఫికేషన్స్‌

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) డైరెక్టరేట్‌ జనరల్‌ కార్యాలయం కింది గ్రూప్‌ బి, గ్రూప్‌ సీ పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుషుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Published : 13 Jun 2022 00:56 IST

ఉద్యోగాలు

బీఎస్‌ఎఫ్‌లో 110 పోస్టులు

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) డైరెక్టరేట్‌ జనరల్‌ కార్యాలయం కింది గ్రూప్‌ బి, గ్రూప్‌ సీ పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుషుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 110, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ)-22, కానిస్టేబుల్‌-88.

విభాగాలు: వెహికిల్‌ మెకానిక్‌, ఆటో ఎలక్ట్రీషియన్‌, స్టోర్‌ కీపర్‌, వెల్డర్‌, టర్నర్‌, పెయింటర్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in


యూపీఎస్సీ-24 పోస్టులు

న్యూదిల్లీలోని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 24, సైంటిఫిక్‌ ఆఫీసర్‌-01, అసిస్టెంట్‌ మైనింగ్‌ జియాలజిస్ట్‌-21, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌-02

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: నియామక పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 30.

వెబ్‌సైట్‌: www.upsc.gov.in


ప్రవేశాలు

నిన్‌, హెదరాబాద్‌ - ఎన్‌ సెట్‌ 2022

హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ.. ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఎన్‌-సెట్‌ 2022 ప్రకటనను విడుదల చేసింది.

* నిన్‌ - కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎన్‌-సెట్‌)

అందిస్తున్న కోర్సులు-సీట్ల వివరాలు: ఎమ్మెస్సీ (అప్లైడ్‌ న్యూట్రిషన్‌)-22, ఎమ్మెస్సీ (స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌)-17.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ/ ఎంబీబీఎస్‌/ బీఏఎంఎస్‌ ఉత్తీర్ణత.

కోర్సు వ్యవధి: రెండేళ్లు.

ప్రవేశం: ప్రవేశ పరీక్ష, కౌన్సెలింగ్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 30

ప్రవేశ పరీక్ష తేది: 2022, జులై 16.

వెబ్‌సైట్‌: https://www.nin.res.in


ఏయూఈఈటీ - 2022

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం సమీకృత ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏయూ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏయూఈఈటీ 2022) ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా బీటెక్‌, ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

* ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏయూఈఈటీ 2022)

అందిస్తున్న ప్రోగ్రాములు-సీట్ల వివరాలు: బీటెక్‌, ఎంటెక్‌ (సీఎస్‌ఈ)-360 సీట్లు, బీటెక్‌, ఎంటెక్‌ (ఈసీఈ)-60 సీట్లు, బీటెక్‌, ఎంటెక్‌ (మెకానికల్‌ ఇంజినీరింగ్‌)- 30 సీట్లు, బీటెక్‌, ఎంటెక్‌(ఈఈఈ)-30 సీట్లు.

అర్హత: గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌ (10+2) ఉత్తీర్ణత.

ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 22.

ప్రవేశ పరీక్ష తేది: 2022, జూన్‌ 30.

వెబ్‌సైట్‌: http://aueet.audoa.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని