Updated : 03 Jan 2023 05:01 IST

నోటిఫికేషన్స్‌

అర్హత పరీక్ష

యూజీసీ- నెట్‌ డిసెంబర్‌ 2022

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌) డిసెంబర్‌ 2022 పరీక్షకు షెడ్యూల్‌ విడుదలైంది.

సబ్జెక్టులు: అడల్ట్‌ ఎడ్యుకేషన్‌, ఆంత్రొపాలజీ, అరబ్‌ కల్చర్‌ అండ్‌ ఇస్లామిక్‌ స్టడీస్‌, అరబిక్‌, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్‌, కామర్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, క్రిమినాలజీ.. తదితరాలు.
అర్హత: 55% మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ.
వయసు: జేఆర్‌ఎఫ్‌కు 01.02.2023 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయసు పరిమితి లేదు.
పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ)లో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్‌ టైప్‌, మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలు... 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలు... 200 మార్కులు.  పరీక్ష వ్యవధి 3 గంటలు.
దరఖాస్తు రుసుం: జనరల్‌/ అన్‌ రిజర్వ్‌డ్‌కు రూ.1100; జనరల్‌- ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ- ఎన్‌సీఎల్‌ రూ.550; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్‌ జెండర్‌కు రూ.275.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17-01-2023.
పరీక్ష రుసుం చెల్లింపు చివరి తేదీ: 18-01-2023.
పరీక్ష తేదీలు: 21-02-2023 నుంచి 10-03-2023 వరకు.

వెబ్‌సైట్‌: https://ugcnet.nta.nic.in/


ప్రభుత్వ ఉద్యోగాలు

401 ట్రైనీ ఇంజినీర్‌, ట్రైనీ ఆఫీసర్‌లు

హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ- నేషనల్‌ హైడ్రోఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ).. ట్రైనీ ఇంజినీర్‌, ట్రైనీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు: 401.
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్‌, డిగ్రీ, పీజీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎంఏతో పాటు గేట్‌-2022, యూజీసీ-నెట్‌-డిసెంబర్‌ 2021, జూన్‌ 2022, క్లాట్‌ 2022 (పీజీ) స్కోరు.
వయసు: 25-01-2023 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు రుసుం: రూ.295 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 05-01-2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25-01-2023.

వెబ్‌సైట్‌: http://www.nhpcindia.com/


400 సెక్యూరిటీ స్క్రీనర్‌ పోస్టులు

ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అల్లాయిడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌ (సీఎల్‌ఏఎస్‌) 400 సెక్యూరిటీ స్క్రీనర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ 2019, 2020, 2021/ ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌ 1 పరీక్షలో అర్హత సాధించివుండాలి.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్‌: నెలకు రూ.15000.
ఎంపిక: స్క్రూటినీ, ప్రిలిమినరీ వెరిఫికేషన్‌ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.100
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14.01.2023

వెబ్‌సైట్‌: http://aaiclas.aero/career


బొల్లారం ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో...

సికింద్రాబాద్‌ బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌.. 2023-24 విద్యా సంవత్సరానికి 63 ఉపాధ్యాయ (రెగ్యులర్‌/ ఫిక్స్‌డ్‌ టర్మ్‌) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌: 15
* ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌: 25  
* ప్రైమరీ టీచర్‌: 23  
సబ్జెక్టులు: గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఇన్ఫర్మాటిక్స్‌ ప్రాక్టీసెస్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, జాగ్రఫీ, హోమ్‌ సైన్స్‌, సైకాలజీ, పెయింటింగ్‌/ ఫైన్‌ ఆర్ట్స్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, మ్యూజిక్‌, డ్యాన్స్‌, హిందీ, సంస్కృతం తదితరాలు.
అర్హత: డిగ్రీ, పీజీ, బీఈడీ, బీఈఎల్‌ఈడీ, డీఈఎల్‌ఈడీతో పాటు సీటెట్‌/ టెట్‌ అర్హత.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘ప్రిన్సిపల్‌, ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ బొల్లారం, జేజే నగర్‌, సికింద్రాబాద్‌’ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 30-01-2023.

వెబ్‌సైట్‌: https://www.apsbolarum.edu.in/index.html


181 ఆపరేటర్‌ ట్రైనీ కొలువులు

ముంబయిలోని ప్రభుత్వ రంగ సంస్థ- రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌.. 181 ఆపరేటర్‌ (కెమికల్‌) ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: బీఎస్సీ(కెమిస్ట్రీ/ ఫిజిక్స్‌) లేదా డిప్లొమా (కెమికల్‌ ఇంజనీరింగ్‌/ టెక్నాలజీ).
వయసు: 01.12.2022 నాటికి 29 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు రుసుం: రూ.700.
ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 16.01.2023.

వెబ్‌సైట్‌: https://www.rcfltd.com/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని