విదేశాల్లో ఫలిస్తున్న ఎంబీబీఎస్ కల!
స్వదేశంలో మెడికల్ సీట్లు పరిమితంగా ఉండి, ప్రవేశాలకు భారీ పోటీ ఉన్న నేపథ్యంలో విదేశీ వైద్యవిద్య సులువైన ప్రత్యామ్నాయంగా మారింది. ఎందుకంటే ప్రవేశపరీక్ష రాయనక్కర్లేదు; డొనేషన్లు కట్టాల్సిన అవసరమూ లేదు. ఫీజు, ఇతర ఖర్చులతో 15- 30 లక్షల రూపాయిల్లోపు వెచ్చించగలిగితే చాలు. విద్యాభ్యాసం పూర్తిచేసుకుని ఎంబీబీఎస్ పట్టా పొంది, స్వదేశానికి తిరిగివచ్చి వైద్యసేవలను అందించవచ్చు! ఈ మార్గం ఎంచుకునే విద్యార్థులు ఏయే విషయాలు గమనించాలి? ఎలా ముందడుగు వేయాలి?
స్వదేశంలో మెడికల్ సీట్లు పరిమితంగా ఉండి, ప్రవేశాలకు భారీ పోటీ ఉన్న నేపథ్యంలో విదేశీ వైద్యవిద్య సులువైన ప్రత్యామ్నాయంగా మారింది. ఎందుకంటే ప్రవేశపరీక్ష రాయనక్కర్లేదు; డొనేషన్లు కట్టాల్సిన అవసరమూ లేదు. ఫీజు, ఇతర ఖర్చులతో 15- 30 లక్షల రూపాయిల్లోపు వెచ్చించగలిగితే చాలు. విద్యాభ్యాసం పూర్తిచేసుకుని ఎంబీబీఎస్ పట్టా పొంది, స్వదేశానికి తిరిగివచ్చి వైద్యసేవలను అందించవచ్చు! ఈ మార్గం ఎంచుకునే విద్యార్థులు ఏయే విషయాలు గమనించాలి? ఎలా ముందడుగు వేయాలి?
మనదేశంలో వైద్యవిద్య చదువుకోవాలనే ఆకాంక్ష ఉన్న ప్రతి విద్యార్థికీ అది తీరే అవకాశం లేదు. బీఏ, బీకాం, బీఎస్సీ.. దేనిలో చేరాలన్నా సీటు దొరుకుతుంది; అందుబాటులోనే కళాశాలలుంటాయి. ఇంజినీర్ అవ్వాలంటే సొంత జిల్లా కూడా దాటక్కర్లేదు. కానీ ఇంటర్మీడియట్ జీవశాస్త్రంలో 99 శాతం మార్కులు వచ్చినా వైద్యవిద్య అర్హత పరీక్షకు సిద్ధమై, భారీ పోటీని ఎదుర్కోవాల్సిందే.
నిన్నటిదాకా ఎంసెట్... ఇప్పుడు నీట్! ఇంటర్ బైపీసీలో 90 శాతం దాటిన విద్యార్థి కూడా నీట్లో కనీసం అర్హత కూడా సాధించలేకపోయినవారు లక్షల్లో ఉన్నారు. మెడికల్ సీట్లు బాగా తక్కువ ఉండటం వల్ల భారీ వడపోత అనివార్యమైపోయింది.
ఎంతో మంచి ర్యాంకు రానపుడు యాజమాన్య కోటాకు తగ్గ ఆర్థిక స్థితి లేనపుడు వైద్యవిద్యపై ఆశలు వదిలేసుకోవాల్సివచ్చేది.
ఈ పరిస్థితుల్లోనే విదేశీ వైద్యవిశ్వవిద్యాలయాలు మధ్యతరగతి విద్యార్థులకు భరోసాగా నిలిచాయి. ప్రవేశాల కోసం వారిని సాదరంగా ఆహ్వానిస్తూ వస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎంచుకుంటున్న దేశాల్లో జార్జియా, ఫిలిప్పీన్స్, చైనా, కిర్గిస్థాన్, ఉక్రెయిన్, రష్యా, మధ్య అమెరికా ఖండాల్లోని కొన్ని దేశాలు, కరేబియన్ దీవులు ముఖ్యమైనవి. వాటిలో మౌలిక సదుపాయాలూ, బోధనా ప్రమాణాలూ సంతృప్తికరంగా ఉంటున్నాయని అక్కడ చదువుతున్న విద్యార్థులు చెపుతున్నారు.
విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించడం కోసం చాలా సంవత్సరాల నుంచి మన విద్యార్థులు వెళ్తున్నారు. కాలక్రమంలో విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించేవారిలో నాణ్యతా ప్రమాణాల కోసం కఠినమైన నిబంధనలను భారత వైద్యమండలి (ఎంసీఐ) తీసుకువచ్చింది. ముఖ్యంగా.. కోర్సు పూర్తిచేసి, స్వదేశంలో ప్రాక్టీస్ చేయాలంటే ఎఫ్.ఎం.జి.ఇ. (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్) ను తప్పనిసరి చేసింది. దీన్నే స్క్రీనింగ్ టెస్టుగా వ్యవహరిస్తున్నారు. కోర్సు ఆరంభం నుంచీ ఈ పరీక్షపై అవగాహన పెంచుకుంటే ఈ పరీక్షలో నెగ్గటం కష్టమేమీ కాదనేది విజేతలైన విద్యార్థుల అనుభవం.
విదేశాల్లో కళాశాలల ఎంపిక
మారిన నిబంధనల ప్రకారం కళాశాలల ఎంపికకు కొన్ని ముఖ్యమైన సూచనలను విద్యార్థులు గమనించాలి.
1) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వైద్య నిఘంటువులో నమోదైవున్న కళాశాలలను మొదట చూసుకోవాలి.
2) వెళ్తున్న దేశంలో చదవాలనుకుంటున్న కళాశాలకు ఆ దేశ ప్రభుత్వ గుర్తింపు ఉన్నదనేది నిర్ధారించుకోవాలి
3) చేరబోయే కళాశాల ఉన్న దేశంలో భారత ప్రభుత్వ ఎంబసీ ఉందేమో గమనించాలి. అక్కడ కళాశాలల పట్ల మన ఎంబసీ ఏమైనా సూచనలు చేసివుంటే వాటిని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి.
4) స్క్రీనింగ్ టెస్ట్ ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. అందుకని ఎంపిక చేసుకున్న కళాశాలలో ఆంగ్ల మాధ్యమ బోధన ఉన్నదీ లేనిదీ ధ్రువీకరించుకున్నాకే చేరాలి.
ఇందుకు సంబంధించి ఇతర వివరాల కోసం, తాజా సమాచారం కోసం ఎంసీఐ అధికారిక వెబ్సైట్www.mciindia.orgను క్షుణ్ణంగా పరిశీలించడం మేలు.
ప్రత్యేక జాగ్రత్తలు
* విదేశాల్లో వైద్యవిద్య ప్రవేశాల కోసం ఎక్కువమంది విద్యార్థులు కన్సల్టెన్సీలపైనే ఆధారపడుతున్నారు. తగిన కన్సల్టెన్సీని ఎంచుకోవటం, తాము చదవదల్చిన దేశంలో కోర్సు పూర్తిచేసుకుని, ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులను అడిగి అన్ని విషయాలూ తెలుసుకోవడం ముఖ్యం.
పూర్వ విద్యార్థుల నుంచి తెలుసుకోవాల్సినవి:
* కళాశాలలో విద్యాబోధన నాణ్యతా ప్రమాణాలతో ఉందా?
* ఆంగ్ల మాధ్యమ బోధన ఉందా? అది సులువుగా అర్థమయ్యేలా ఉందా?
* క్యాంపస్లో ఎంసీఐ స్క్రీనింగ్ టె®ü్టపై ప్రత్యేక శిక్షణకు ఏర్పాట్లున్నాయా?
* ఆ దేశంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏం జాగ్రత్తలు అవసరం?
* శాంతి భద్రతలూ, వసతి గృహాల్లో రక్షణ చర్యలు బాగున్నాయా?
* భారతీయ విద్యార్థుల ఆహారపు అలవాట్లకు తగిన ఏర్పాట్లు ఉన్నాయా?
* కొన్ని కళాశాలలు విద్యార్థులను చేర్పించేందుకు ఒక్కరికి మాత్రమే అధికారిక ప్రతినిధిగా గుర్తింపునిస్తాయి. మరికొన్ని కళాశాలలు ఒకరికి మించి ఎందరికో గుర్తింపు పత్రాలను జారీచేస్తాయి. ఇక్కడే విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు కళాశాలల వెబ్సైట్లలో సంబంధిత సమాచారం ఉండే అవకాశం ఉంది.
* అమెరికా, బ్రిటన్, కెనడా, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో వైద్యవిద్యలో పీజీ పూర్తిచేస్తే మనదేశంలో ఎంసీఐ ఆ డిగ్రీకి గుర్తింపునిస్తుంది. మిగతా ఇతర దేశాల్లో పీజీ చదివితే మాత్రం ఆ డిగ్రీని గుర్తించదు.
ఉపయోగపడే వెబ్సైట్లు
*www.mciindia.org/MediaRoom/ ListofChinaColleges.aspx
*http://avicenna.ku.dk/database/ medicine
*www.wdmos.org
స్క్రీనింగ్ పరీక్ష కష్టమేమీ కాదు! ‘మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు మాత్రమే చదివి పరీక్ష రాస్తే ఫలితం తలకిందులవుతుంది. అందుకనే పాఠ్యపుస్తకాలు బాగా చదవండి. ప్రాక్టికల్స్ మిస్ కాకండి’ అంటూ మా సీనియర్లు పదేపదే చెప్పేవారు. ఆ సలహా నా మీద బాగా పనిచేసింది. పుస్తకాలను ఇష్టంతో నవలల మాదిరిగా చదివాను. అందుకే ఎంసీఐ స్క్రీనింగ్ టెస్టు రాసిన మొదటిసారే మంచి మార్కులతో పాసయ్యాను. - డా. టి. మనోజ, మెదక్
‘మొదటి సెమిస్టర్ నుంచే పరీక్ష పట్ల పూర్తి అవగాహనతో మా కళాశాలలో చదువుతూవచ్చాను. భారతీయ ప్రొఫెసర్లను రప్పించి ఎంసీఐ పరీక్ష శిక్షణ తరగతులు నిర్వహించేలా కన్సల్టెన్సీ వారు సహకరించారు. దీంతో కాస్త భారం తగ్గింది. సులువుగా పరీక్షకు సిద్ధమయ్యాను. దీంతో రాసిన మొదటిసారే పరీక్షలో నెగ్గగలిగాను.
- డా. రాజ్కుమార్ కె, హైదరాబాద్
|
భారతీయ వైద్యులతో సమానమేనా? విదేశీ వైద్యవిద్యకు సంబంధించి విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో కొన్ని సందేహాలూ, అపోహలూ ఉంటున్నాయి. వాటి నిజానిజాలు చూద్దాం. * విదేశాల్లో వైద్యవిద్య చదవటానికి ఏ అర్హతలు ఉండాలి? *కళాశాలలో చేరేముందు ఎంసీఐ అనుమతి అవసరమా? * విదేశాల్లో మెడిసిన్ చదవాలంటే ఏయే పత్రాలు కావాలి? * విజిటింగ్ వీసా మీద విదేశీ వైద్యకళాశాలలో చేరవచ్చా? *విదేశాల్లో ఇచ్చే ఎంబీబీఎస్ డిగ్రీకీ, మనదేశంలో ఇచ్చే ఎంబీబీఎస్ డిగ్రీకీ ఏమైనా తేడా ఉందా? * ఐదేళ్ళ కోర్సు అనీ, ఆరేళ్ళ కోర్సు అనీ... ఎంబీబీఎస్ ఇన్ని సంవత్సరాల్లో పూర్తిచేయాలనే నిబంధన ఉందా? * విదేశాల్లో ప్రైవేటు వైద్యకళాశాలలకూ, ప్రభుత్వ వైద్య కళాశాలలకూ గుర్తింపులో కానీ, నాణ్యతలో కానీ తేడా ఏమైనా ఉందా? * ఎంబీబీఎస్ కళాశాలలో పీజీ ఉంటేనే యూజీకి గుర్తింపు ఉంటుందా? * స్క్రీనింగ్ టెస్టు చాలా కష్టమనీ, ఉత్తీర్ణత శాతం బాగా తక్కువనీ విన్నాం. నిజమేనా? * వైద్యకళాశాలలకు సంబంధించి ఏదైనా సమాచారం భారతీయ ఎంబసీ వెబ్సైట్లలో లభిస్తుందా? |
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు