దూరవిద్యలో ఎంబీఏ ఎలా?
ఉద్యోగం చేస్తూనే ఉన్నత స్థాయికి ఎదగాలనుకునేవారికి ఎంబీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులు ఉన్నత అవకాశాలను అందిస్తాయి. ఈ రకంగా ఎంబీఏ కోర్సును చదివేవారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది.
ఫార్మసీ సంస్థలో సప్లై చెయిన్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాను. ఉద్యోగంలో ఉన్నతస్థాయిని అందుకోవడానికి ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. దూరవిద్యలో ఉన్న అవకాశాలు, వాటి ప్రవేశ వివరాలను తెలపండి. - పి. వైకుంఠరావు
ఉద్యోగం చేస్తూనే ఉన్నత స్థాయికి ఎదగాలనుకునేవారికి ఎంబీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులు ఉన్నత అవకాశాలను అందిస్తాయి. ఈ రకంగా ఎంబీఏ కోర్సును చదివేవారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. మనదేశంలో దూరవిద్య ద్వారా ఎంబీఏ చేయాలనుకునేవారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా, కాకతీయ, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలూ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర, శ్రీ వేంకటేశ్వర, ఆచార్య నాగార్జున, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు దూరవిద్యలో ఎంబీఏని అందిస్తున్నాయి. తెలంగాణలోని యూనివర్సిటీల్లో చదవాలనుకొంటే టీిఐసెట్ ప్రవేశ పరీక్షనూ, ఆంధ్రప్రదేశ్లోని యూనివర్సిటీల్లో చదవాలనుకొంటే ఏపీఐసెట్ ప్రవేశ పరీక్షనూ రాయాలి. పైన పేర్కొన్న రాష్ట్ర విశ్వవిద్యాలయాలతో పాటుగా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ కూడా ఎంబీఏను దూరవిద్య ద్వారా అందిస్తోంది. ఇందులో చదవాలనుకొంటే, ఆ యూనివర్సిటీ నిర్వహించే ప్రత్యేక ప్రవేశపరీక్ష ద్వారా అడ్మిషన్ పొందవచ్ఛు వీటితో పాటుగా ఇతర రాష్ట్రాలకు చెందిన చాలా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలూ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఎంబీఏను దూరవిద్య ద్వారా అందిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కోర్సును దూరవిద్య ద్వారా చదివే అవకాశం ఉంది.
- ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల