బయో టెక్నాలజీలో పీజీ
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో జరిగే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్- బయోటెక్నాలజీ (జీఏటీ-బీ) ప్రకటన వెలువడింది. జాతీయస్థాయిలో జరిగే ఈ ప్రవేశ పరీక్ష ద్వారా వివిధ బయోటెక్నాలజీ పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు పొందొచ్చు.
63 విద్యాసంస్థల్లో ప్రవేశాలకు జీఏటీ-బీ
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో జరిగే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్- బయోటెక్నాలజీ (జీఏటీ-బీ) ప్రకటన వెలువడింది. జాతీయస్థాయిలో జరిగే ఈ ప్రవేశ పరీక్ష ద్వారా వివిధ బయోటెక్నాలజీ పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు పొందొచ్చు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
జీఏటీ-బీ 2022కు హాజరయ్యే అభ్యర్థులు సైన్స్ సబ్జెక్టుతో డిగ్రీ పాసై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోన్న అభ్యర్థులు కూడా ప్రవేశ పరీక్షకు హాజరుకావచ్చు. అయితే సంబంధిత విద్యాసంస్థ జారీచేసిన అండర్టేకింగ్/ అటెస్టేషన్ ఫామ్ను సమర్పించాల్సి ఉంటుంది.
జీఏటీ-బీ ద్వారా వివిధ యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో బయోటెక్నాలజీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఎంఎస్సీ బయోటెక్నాలజీ, అనుబంధ కోర్సులు, ఎంటెక్ బయోటెక్నాలజీ, అనుబంధ కోర్సులు, ఎంఎస్సీ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ అండ్ ఎంవీఎస్సీ యానిమల్ బయోటెక్నాలజీ.. మొదలైన పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా 63 యూనివర్సిటీ/ విద్యాసంస్థల్లోని బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు.
స్టైపెండ్: జీఏటీ-బీ 2022లో అర్హత సాధించి, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశం పొందిన అభ్యర్థులు ప్రతినెలా స్టైపెండ్ పొందొచ్చు. ఎంఎస్సీ బయోటెక్నాలజీ, సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలు పొందినవారికి నెలకు రూ.5,000 స్టైపెండ్ లభిస్తుంది. ఎంఎస్సీ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ అభ్యర్థులకు రూ.7,500 స్టైపెండ్ చెల్లిస్తారు. ఎంటెక్/ఎంవీఎస్సీ కోర్సుల్లో ప్రవేశం పొందినవారు నెలకు రూ.12,000 స్టైపెండ్ పొందొచ్చు. కోర్సు మొదటి సంవత్సరంలో విద్యార్థి చూపిన ప్రతిభ ఆధారంగానే రెండో సంవత్సరంలో స్టైపెండ్ను కొనసాగిస్తారు.
పరీక్ష విధానం: జీఏటీ-బీ ప్రశ్నపత్రం బహుళైచ్ఛిక విధానంలో ఉంటుంది.కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ). ప్రశ్నపత్రం ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. సెక్షన్-ఎలో 60 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 60 మార్కులు. ఈ ప్రశ్నలు 10+2 స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, బయాలజీల నుంచి ఉంటాయి. సెక్షన్-బిలోని 100 ప్రశ్నల్లో 60 రాయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 3 మార్కుల చొప్పున 180 మార్కులు. పరీక్ష కాలవ్యవధి 3 గంటలు.
బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ (బీఈటీ)
డాక్టరల్ రిసెర్చ్ ఫెలోషిప్స్ అవార్డుల కేటాయింపునకు దేశవ్యాప్తంగా జరిగే అర్హత పరీక్ష ఇది. ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ప్రకటన వెలువడింది. అభ్యర్థులు బీఈటీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా కేటగిరి-1, కేటగిరి-2 అనే రెండు రకాల మెరిట్ లిస్ట్లను తయారుచేస్తారు. రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా తుది జాబితాను రూపొందిస్తారు. కేటగిరి-1లో స్థానం సంపాదించినవారు దేశంలో గుర్తింపుపొందిన ఏ విద్యాసంస్థ నుంచైనా ఫెలోషిప్ పొందొచ్చు.
అర్హత: బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ (బీఈటీ) రాసే అభ్యర్థులు బ్యాచిలర్స్ (బీఈ/బీటెట్/ఎంబీబీఎస్) అండ్ మాస్టర్స్ (ఎంఎస్సీ/ ఎంటెక్/ ఎంవీఎస్సీ/ ఎం.ఫార్మ్/ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ ఎంటెక్), బయోమెడికల్, బయోఇన్ఫర్మేటిక్స్, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యుటేషన్ బయోలజీ, జెనెటిక్స్, మైక్రోబయోలజీ, జువాలజీ లేదా బయోలజీ/లైఫ్-సైన్సెస్కు చెందిన అనుబంధ కోర్సులు పాసై ఉండాలి. ఫైనల్ సెమిస్టర్కు హాజరవుతున్నవాళ్లు, ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నవాళ్లు కూడా దరఖాస్తు చేయొచ్చు.
మార్కులు: జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు 60 శాతం, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు 55 శాతం మార్కులు సాధించాలి.
వయసు: మార్చి 31 నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ మహిళలకు వయఃపరిమితిలో 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు (నాన్-క్రీమీ లేయర్) 3 ఏళ్ల సడలింపు ఉంటుంది.
పరీక్ష విధానం: ఈ ప్రశ్నపత్రంలో రెండు సెక్షన్లుంటాయి. సెక్షన్-ఎలో 50 ప్రశ్నలు; ఒక్కో ప్రశ్నకు 3 మార్కుల చొప్పున 150 మార్కులు. దీంట్లో జనరల్ సైన్స్, మ్యాథమేటిక్స్, కెమిస్ట్రీ, జనరల్ ఆప్టిట్యూడ్ ఎనలిటికల్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ జనరల్ బయోటెక్నాలజీ ఉంటాయి.
సెక్షన్-బిలో సిలబస్ ప్రకారం బయోటెక్నాలజీకి చెందిన 150 ప్రశ్నలుంటాయి. వాటిలో 50 ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 3 మార్కుల చొప్పున 150 మార్కులకు ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం. తెలంగాణలో హైదరాబాద్/ సికిందరాబాద్.
ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31.03.2022
జీఏటీ-బీ తేదీ: 23.04.2022 ఉదయం 9 - 12 గంటలు
బీఈటీ తేదీ: 23.04.2022 మధ్యాహ్నం 3 - 6 గంటలు
http://dbt.nta.ac.in/
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?