కరెంట్ అఫైర్స్
సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ఏ రోజున బాధ్యతలు స్వీకరించారు?
మాదిరి ప్రశ్నలు
* సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ఏ రోజున బాధ్యతలు స్వీకరించారు?
జ: 2022, ఆగస్టు 27
* తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఎవరు? (ఈయన పదవీ కాలాన్ని ప్రభుత్వం ఇటీవల పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈయన పదవిలో కొనసాగుతారని వెల్లడించింది.)
జ: బోయినపల్లి వినోద్ కుమార్
* సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారిగా ఏ రోజున కోర్టు కార్యకలాపాలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా దేశ ప్రజలంతా వీక్షించేలా ఏర్పాటు చేశారు?
జ: 2022, ఆగస్టు 26
* 2022 ఆగస్టు 22, 23 తేదీల్లో ‘గ్రామ పంచాయతీల్లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ - స్వీయ నిర్మాణాత్మక మౌలిక సదుపాయాలు’ అనే అంశంపై జాతీయ సెమినార్ను ఎక్కడ నిర్వహించారు?
జ: ఛండీగఢ్
* 2022 ఆగస్టులో తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ మొబిలిటీ (టీ - ఎయిమ్) ప్రారంభించిన గ్రాండ్ ఛాలెంజ్ దేనికి సంబంధించింది? (విజేతకు రూ.20 లక్షల బహుమతి ఇవ్వాలని నిర్ణయించారు)
జ: కృత్రిమ మేధస్సు టెక్నాలజీ ద్వారా రోడ్లపై గుంతల గుర్తింపు
* ఉత్తర్ ప్రదేశ్లోని నోయిడాలో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన ఏ ట్విన్ టవర్స్ను 2022, ఆగస్టు 28న కూల్చివేశారు?
జ: అపెక్స్, సియానే
* కొత్త తరం ఇంటర్నెట్ వెబ్ 3.0 పై ఉన్న గందరగోళాన్ని, అస్పష్టతను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ఏ పేరుతో నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది?
జ: శాండ్బ్యాక్స్
* ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో జనాభా, జననాల రేటు ఆధారంగా సీఐఏ వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా ప్రతి నాలుగు నిమిషాలకు భారత్లో ఎన్ని జననాలు నమోదు అవుతున్నాయి? (రెండు, మూడు స్థానాల్లో వరుసగా చైనా (103 జననాలు), నైజీరియా (57 జననాలు) ఉన్నాయి)
జ: 172
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ